ఆల్టర్ నేట్ హీరో ఆర్ ఎస్ రావు
అణగారిన వర్గాల కోసం అహర్నిశం పట్టించుకొనేవారు ఒక్కరొక్కరుగా రాలిపోతున్న సందర్భం ఇది. కన్నాభిరాన్ బాలగోపాల్ బుర్ర రాములు పతిపాటి వెంకటేశ్వర్లు .. ఇప్పుడు ఆర్ ఎస్ రావు (రేగులగడ్డ సోమేశ్వర రావు ) తెలుగు వాడే కాని ఒరిస్సా లోని బుర్ల యూనివెర్సిటీ లో ప్రొఫెసర్ గా పని చేసారు. అయిన ఆంధ్రప్రదేశ్ రాజకీయలను, ఉద్యమాలను సాహిత్యాన్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు. అతడు రాసిన "అభివృద్ధి వెలుగు నీడలు" ఒక అద్భుత రచన. అభివృద్ధి గురించి ఇప్పటికే జరుగుతున్న చర్చకి 1990 లోనే శాస్త్రీయ సమాధానాన్ని వివరించి చెప్పిన ఆర్ ఎస్ రావు ను ఏ ఉద్యమ కార్యకర్త మర్చిపోరు. ఆర్ ఎస్ రావు అంటే " అభివృద్ధి వెలుగు నీడ" అనే విధంగా గుర్తిండిపోయారు. ఆ తర్వాత కూడా అనేక విషయాల మీద ఆయన చేసిన రచనలు మనకు ఒక స్పష్టమైన అవగాహనని కల్పించే విధంగా వుంటాయి. కాబట్టి అతడ్ని గుర్తు చేసుకోవడం అంటే అతడి రచనల్ని మరొక్కసారి మననం చేసుకొని ముందుకు సాగిపోవడమే.
మీరు ఆనకట్టలకి, విద్యుత్ కేంద్రాలు కు, రోడ్ల నిర్మానాలకి వ్యతిరేకమా? అంటే "అభివృద్దికి వ్యతిరేకులు". అభివృద్దికి వ్యతిరేకులంటే ద్రోహులు అనే స్థాయికి వెళ్ళిపోయాయి , మనలో కొందరి బుర్రలు. అ బుర్రలు బూజు వదల గోట్టాలి అంటే " అభివృద్ధి వెలుగు నీడల" గురించి లోతుగా చర్చించాలసిందే. అభివృద్ధి గురించి ఆర్ ఎస్ రావు మాటలోనే" ఏ ఉత్పత్తి శక్తుల పెరుగుదల అయినా దాని వెనుక నిబిడమయి ఉన్న మానవ శ్రమ, విజ్ఞానాల ఫలితం. అ విజ్ఞానం ఒకనొక ప్రాపంచిక దృక్పధం కారణంగా జనిస్తుంది అంటే ఏ రూపంలో కన్పించే అభివృద్ధి పథకం అయిన అంతిమ పరిశీలనలో ఒకానొక ప్రాపంచిక దృక్పథం నుండే పుడుతుంది. అందుచేత ఆయ అభివృద్ధి పథకాల సారం వాటికి కారణం అయిన ప్రాపంచిక దృక్పథమే అని చెప్పుకోవాలి. అలాంటప్పుడు ఆనకట్ట నో ఫాక్టరియో కాలేజినో అభివృద్దో కాదో తెలుసుకోవాలంటే ఆ అభివృద్ధి పథకం ప్రాపంచిక దృక్పథం లో ఎమైన మార్పులు తీసుకు వచ్చిందా, లేదా, అప్పటికే బలంగా వున్నా వేరొక ప్రాపంచిక దృక్పథం లో తానే ఒక భాగం అయి పోయిందా అనే అంశాన్ని పరిశీలించాలి. ప్రాపంచిక దృక్పథం అంటే ఏమిటి? నిర్దిష్ట దేశకాల పరిస్థితిలలో మనిషికి, ప్రకృతి కి మధ్య గల సంబందాని లేదా వైరుధ్యం గురించి తెలియ చెప్పే దృక్పథమే ప్రాపంచిక దృక్పథం. ....
అభివృద్ధి అనే భావన ఏక కాలం లో క్లిష్ట0 అయినది సులభంగా అర్ధమయ్యేది కూడా. సులభంగా ఎందుకు అర్థం అవుతుందంటే దాని బలమైన దర్సనీయత. (visibility ) వల్ల, క్లిష్టమయినది ఎందుకు అంటే దాని వెలుతురిని అర్థం చేసుకోగలిగినంత సులభంగా అది సృస్తించే నీడల్ని అర్ధం చేసుకోలేము కాబట్టి.
అయితే అభివృద్ధి సారం దాని భౌతిక రూపం లో కాక ఆ అభివృద్ధి సాధ్యం చేసిన ప్రాపంచిక దృక్పథం లోనే ఉందని సులభంగానే అర్ధమవుతుంది. అందుకే భయంకర దుర్ఘటన జరగక ముందు భోపాల్ యునియాన్ కార్బిదే అభివృద్దికి ప్రతీక, ఆ సంఘటన తర్వాత ఆ భావం బీటలు వారింది,
అభివృద్ధి వెలుగు నీడలు ఒక మంచి వ్యాసం అయితే దాని ఒక జీవితం ద్వార చెప్ప్ప గలిగిన రచయత కాలిపతనం రామారావు. అతడి యజ్ఞం కథ గురించి రాస్తూ గొప్ప్ప విశ్లేషణ చేసారు.
యజ్ఞం కథలో గాంధిజీ ఆశయాలతో ప్ర భావితం అయినా శ్రీ రాములు నాయుడు గ్రామాభివృద్దికి రోడ్లు స్కూలు ఏర్పాటు చేస్తాడు. రోడ్ల ద్వార మోటారు వాహనాలు వచ్చి రిక్షాలను మూల పడేశాయి. వ్యాపార పంటలు వలన సంప్రదాయ రీతులు నష్ట పోయి అప్పులు పాలవుతారు. ఈ నేపద్యంలో అప్పల రాముడు అప్పు తగువే ఈ కథ. ఈ తీరని అప్పులు వలన తన లాగే తన కొడుకును బానిస కావడానికి వీలు లేదని తన కొడుకును చంపేసి అప్పల రాముడు పంచాయితి ముందు పడేస్తాడు.
గ్రామా జీవితంలో అభివృద్ధి క్రమం ముందు శ్రీ రాములు నాయుడు హీరోగా మొదలు పెడితే కథ అంతానికి అప్పల రాముడు అంటి హీరో నుంచి హీరో అయిపోతాడు. ఇంకా వర్గం రుపొందని కాలంలో అప్పల రాముడు అ వర్గ ప్రతినిధి గానే వర్గ సహకారం లేకుండా ఉండిపోయాడు. కాని ఆ తర్వాత కాలానికి వర్గ పోరాటాల ద్వార వర్గం రూపొందటం మొదలయింది. సంఘర్షణ ప్రధానం అయ్యింది. ఆ మార్పులో నూతన దృక్పథం కనిపిస్తుంది. ఇది ఎటువంటి అప్పు అనే ప్రశ్న కాకుండా దానికి ఒక సమాధానం ఇస్తుంది. ఇది ఎటువంటి అభివృద్ధి అని కాకుండా అభివృద్ధి అంటే ఏమిటి అని చెపుతుంది. ఉద్యమం ప్రధానంగా ఉన్న గ్రామాల లోనే కాకుండా మిగిలిన ప్రాంతాలలో కూడా ఈ మార్పు కనిపిస్తుంది. రూపాలు వికృతం అవ్వచును. అంటే నిజ జీవితం అంటి హీరో నుంచి alternativeహీరో కు మార్పు చెందింది. ఈ alternative హీరో అట్టడుగు వర్గాల నుంచి అనగార్చ బడ్డ ఆడవాళ దగ్గర నుండి ముందుకు వస్తున్నారు..
there is no alternative, ఈ అభివృద్ధి తప్ప్ప వేరే దారి లేదు అని చెబుతూ సామ్రాజ్యవాద పెట్టుబడి దారి విధానం తన విధ్వంసకర కారక్రమాన్ని అణిచివేత విధానాలతో అమలు చేయ ప్రయత్నిస్తుంది. ప్రత్యామ్నాయం ఉందంటూ (alternative ) ప్రజలు ప్రతిఘటిస్తూనే ఉన్నారు వారి పక్షాన నిలిచిన ఆర్ ఎస్ రావు ప్రత్యామ్నాయా రాజకీయాలను ప్రతిపాదించి మనందరికీ "కొత్త చూపు" ను అందించారు.