సామాన్యుడు కాదు సామ్రాజ్యవాద దళారీ-’ఒక దళారీ పశ్చాత్తాపం’ పుస్తక పరిచయం
‘ఒక దళారీ పశ్చాత్తాపం’ పుస్తక పరిచయం
రచయత: జాన్ పెర్కిన్స్తెలుగు: కొణతం దిలీప్
పుస్తక పరిచయానికి భూమికగా పుస్తకం తో నా నడకగురించి గత సంచిక లో వివరించాను. అప్పట్లో పుస్తకంఅంటేకవిత్వం, ఒక మంచి కధ , నవల అంతే!
శ్రీశ్రీ గీతాలతో ఊగిపోయి, చలం మైదానంలో
ఓలలాడికుటుంబరావు సాహిత్యంతో కుదుటపడి, అభివృద్ది వెలుగు నీడల్లాంటి రాజకీయ
విశ్లేషణలతో తేరుకొని కొత్త వెలుగులనుఅవగాహన చేసుకుంటున్న క్రమంలో నా కంట
పడిన ఒకమంచి పుస్తకమే జాన్ పెర్కిన్స్ దళారీ పశ్చాత్తాపం .అయితే ఇది
కవిత్వమూ కాదు సాహిత్యం కాదు. ఒక దళారీపశ్చాత్తాపమే !మన
కళ్ళు మిరమిట్లు గొలిపే అభివృద్ధి వెనుక జరిగే కుట్రల గురించి జాన్
పెర్కిన్స్ చెబుతుంటే నిజమా ? ఇంత అన్యాయామా” అని అనుకోకుండా ఉండలేము, ఈ
పుస్తకం చదివిన తరువాత విప్లవ కవి చెరబండరాజు కవితా పాదం ఒకటి గుర్తుకు
వచ్చింది.

ఇన్ని విద్రోహాల మధ్య మనం ఎంత అమాయకంగా బ్రతికేస్తున్నామో! మన జీవితాలను, పిల్లల భవిష్యతుని గాలిలో దీపం లా ఎలా వదిలేసి ఉండగలుగుతున్నామో అని ఆశ్చర్యం కలుగుతుంది. మన గుండెల్ని పిండేసే నిజాలు ఈ పుస్తకం నిండా. ప్రతి క్షణం ఎంత అప్రమత్తం గా ఉండాలో, ప్రతి చిన్న విషయాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో కొరడాతో కొట్టినట్టు చెప్పిన పుస్తకం ఇది. ఇవాళ ఈ పుస్తకం మనం చదవకపోతే ఇంకే విషయాన్ని సంపూర్ణం గా అవగాహన చేసుకోలే మెమో !
ఈ విషయా ల గురించి ఒక దళారీ రాయటం ఏమిటి? దాన్ని మనం ఎగబడి చదవడం ఏమిటి?
ఒక భోగి వేమారెడ్డి యోగి వేమన అయినట్టు, ఒక సిద్దార్ధుడు (రాజు) బుద్దుడిగా మారినట్టు జాన్ పెర్కిన్స్(దళారీ ) పెట్టుబడి దారీ వ్యవస్థ పొట్ట విప్పిచూపిస్తున్న్నాడు.
దళారీలు, బ్రోకర్లు మనకు కొత్తే మీ కాదు. బ్రిటిష్ వారు మన దేశాన్ని అంచెలంచెలు గా ఆక్రమించు కోవడానికి, వారి అధికారం అలా కొనసాగి పోవటానికి అడుగడుగునా తమకు అనుకూలంగా ఉండే దళారీ వ్యవస్థను ఏర్పాటు చేసుకొన్నారు. చాలా క్రింది స్థాయిలో పనిచేసే ఈ దళారీ వ్యవస్థ ఈ రోజు అమెరికా , ప్రపంచ బాంకు పథకాలను అన్ని దేశాలు తు .చ తప్పకుండా అమలు చేసే పనిలో కుడా ప్రవేశించాయి. ఈ దళారీ లను ఇంగ్లీష్ లో ఎకనామిక్ హిట్మెన్ అంటారు. అప్పట్లో రాజీకీయాలలో అదృశ్య హస్తం, పాకిస్తాన్ హస్తం ఉందనే వాళ్ళు . అలాగే ఇప్పుడు పెద్ద పెద్ద ప్రాజెక్ట్లు, పధకాలు అమలయ్యే క్రమం లో ఈ దళారీల పాత్ర గురించి ఈ పుస్తకం లోచదువుతూంటే ఒళ్ళు గగుర్పోడుస్తుంది.
ప్రతి నాయకుడి చావు ఒక హత్యే అని ఎవరన్నారో గాని అది అక్షరాలా సత్యమని లాటిన్ అమెరికా దేశాధి నేతల విమాన ప్రమాదాల వల్ల తేటతెల్లమవుతుంది. అయితే ఈ దుర్మార్గ వ్యవస్థల్నినిలబెట్టేందుకు జరిగే ఈ బలులు మనకు ఆమోద యోగ్యమా? మనం తేల్చుకోవాలి. మన నాగరికతల్ని, సంస్కృతుల్ని విధ్వంసం చేస్తున్న ప్రపంచీకరణను మనం ఎలా ఎదుర్కుంటామన్న నిర్ణయం మీదే మన అభివృద్ది ఆధారపడి ఉంటుందని నాకు అర్ధమయ్యింది. కానీ పోరాటం మన అందరిది. భవిష్యత్తూ మనదే. అందుకే అబివృద్ది వెలుగు నీడల్ని అర్ధం చేయించే పుస్తకాల్ని చదువుదాం. మనచుట్టూ కమ్ముకున్న చీకట్లను పారద్రోలుదాం .
ఈ దళారీ పుట్టుక ..
1951 లో తన సహజవనర్లను దోచుకొంటున్న
బ్రిటిష్ తో ఇరాన్ తలపడినప్పుడు ఒక నిర్ణయాత్మక పరిణామం సంభవించింది. ఈ
సంఘర్షణ పర్యవసానంగా ఇరాన్ ప్రధాన మంత్రి దేశంలోని చమురు వనర్లన్నిటిని
జాతీయం చేసాడు. దానితో చిర్రెత్తిన బ్రిటన్ తన రెండవ ప్రపంచయుద్ద మిత్రుడు
అమెరికాను సాయం అడిగింది. అయితే ఇరాన్ ఫై సైనిక చర్య తీసుకొనే సాహసం
చేయలేకపోయాయి. ఇలా చేస్తే ఇరాన్ తరుపున సొవియట్ యూనియన్ రంగంలోకి దిగుతుంద
ని భయపడ్డాయి.
ఇరాన్ కు సేనల బదులు కేర్మిట్ రుజ్వేల్తును అనే ఎకనామిక్ హిట్ మాన్ ను
పంపించింది అమెరికా. కేర్మిట్ అక్కడ అద్భుతంగా పనిచేసాడు. కొందరిని డబ్బుతో
కొన్నాడు. మరి కొందరిని బెదిరించి లొంగ దీసుకొన్నాడు. దేశామంతటా వీధి
పోరాటాలు ,హింసాత్మక ప్రదర్శ నలు జరిపించాడు. అప్పటి ప్రధానికి ప్రజల్లో
పట్టులేదని భ్రమను కలుగజేసాడు ఫలితంగా అతడు పదవిని కోల్పోయాడు . అమెరికా
మద్దత్తు తో షా ఇరాన్ అధ్యక్షడు అయ్యాడు . ఎదురులేని నియంతలా మారి ఇరాను ను
పాలించాడు. ఇదే పరిణామక్రమాన్ని మనం ఈజిప్టు సుడాన్ నిన్నమొన్న జరిగిన
పొలిటికల్ వార్లో చూడొచ్చు.
కేర్మిట్ రుజువేల్ట్ ఒక వృత్తికి ప్రాణం పోసాడు. అదే సామ్రాజ్యవాద దళారి.
1960లలో ఒక కొత్త పరిణామం సంభవించింది. అంతర్జాతీయ ద్రవ్య సంస్థలు (ప్రపంచ
బ్యాంకు, ఐ ఎం ఎఫ్ ) అప్పుడప్పుడే వేల్లూనుకు న్నాయి. అమెరికా, దాని
యురోపియన్ సామ్రాజ్యవాద మిత్ర దేశాల పెట్టుబడితో నడిచే ఈ ద్రవ్య సంస్థలు,
బహుళ జాతి కార్పోరేషన్ల మధ్య ఒక పరస్పర లాభాదాయకమయిన బంధం ఏర్పడింది. ఇకఫై
సి .ఐ.ఎ ఏజెంటు లా కాకుండా ఈ దళారీలు జీతాలు ప్రివేటు కంపేనీల నుండి
తీసుకొంటారు. పనులు మాత్రం అమెరికన్ సామ్రాజ్యవాదులుకు పనికి వచ్చేలా
చేస్తారు.
అందుకే మనం కొంచెం చరిత్ర పట్ల శ్రద్ద
పెట్టాలి. అప్పుడే విషయాలు స్పష్టంగా అర్ధం కావడం మొదలవుతుంది. క్యమ్యూనిజం
బారిన పడకుండా దేశాన్ని రక్షించడమే ఈ పనులలొ ఒకటి. సమసమాజం అనే కమ్మని
కలని చిదిమేసే కుట్ర..
1971 నాటికి ఇండోనేషియా కమ్యూనిజం దారిన పోకుండా ఆపాలన్న అమెరికా తాపత్రయం
ఇంకా ఎక్కువైంది. దానికి కారణం అప్పుడు వియత్నాం లో అగ్రరాజ్యానికి తగిలిన
ఎదురుదెబ్బలు.
దక్షిణ ఆసియాలో అమెరికా ఆధిపత్యాన్ని నిలబెట్టడానికే జాన్ పెర్కిన్స్
పనిచేసే కంపెనీ ఆధ్వర్యములో ఇండోనేషియా విద్యుదీకరణ ప్రాజెక్ట్ చేపట్టారు.
ఇరాన్ లో షా ప్రభుత్వం లాగే సుహార్తోను అమెరికా చేతిలో కీలుబొమ్మగా
మార్చడమే వ్యూహం. అంతే కాదు అప్పుడు ఇండోనేసియాలో ప్రయోగాత్మకంగా
జరపబడుతున్న ఆ ప్రయత్నం సఫలమవుతే ఇతర దేశాలలో కూడా ఇదే నమూనా చూపవచ్చుననేది
అమెరికా ఆలోచన.
అచ్చంగా చంద్రబాబు హయాంలో ఇండోనేషియా నమూనానే అమలు జరిగింది.
దళారీ స్వగతం..
ఇవాళ పని కోసం ఆరాటపడే మనుష్యుల కోసం వెతుకుతూ మా వాళ్ళు థాయిలాండ్, ఫిల్లిప్పిన్స్, బోట్ స్వనా ,బోలివీయ ఇంకా అనేక దేశాలకు వెళుతున్నారు. ఇప్పటికే దుర్బరదారిద్రయంలో ఉన్న తమ బిడ్డలకు కడుపునిండా నాలుగు మెతుకులు పెట్టలేని వారిని ఇంకా దోపిడీ చెయ్యడానికి వీళ్ళు వెళుతున్నారు. అమెరికా లోని పెద్ద పెద్ద నగరాలలో ఉన్న ఖరీదయిన ఆఫీసులల్లో ఈ దళారీలు ఉంటారు. విలాసవంత మై న జెట్ విమానాలలో తిరుగుతూ ఖరీదయిన 5 స్టార్ హోటల్స్ లో బస చేస్తూ వీరు శ్రామికులకోసం వెతుకుతారు .
బానిస వ్యాపారులు ఇప్పటికి ఉన్నారు. కాకపోతే పుర్వంలా వాళ్ళు ఆఫ్రికా అడువుల్లోకి వెళ్లి నల్లవారిని కట్టేసి పట్టుకు రారు. చార్లెస్టన్, కార్ట్ జిన్నా, హవానాల్లో బానిసల వేలం పాటల వేదికలు లేవిప్పుడు. ఇప్పుడు దళారీలు ఫ్యాక్టరీలు కట్టి స్థానికంగా దొరికే శ్రామికు లను అందులో పనిచేయించుకుంటారు.
ఆ ఫ్యాక్టరీలలో జీన్స్ పాంటులు, టెన్నిస్ బూట్లు, వాహనాల విడిభాగాలు, కంప్యూటర్ విడిభాగాలు తయారుచేస్తారు. తమ ఇష్టం వచ్చిన దేశాలలో వాటినిన అమ్ముకుంటారు .ఒక్క్కోసారి వాళ్ళు అసలు ఫాక్టరీ కూడా పెట్టరు . స్థానికంగా వున్న పెద్దవ్యాపార వేత్త తో ఫాక్టరీ పెట్టిస్తారు తమ వస్తువులు తయారు చేయించుకుంటారు, ఇప్పటి భారతి వాల్మార్టు లాగ.
ఇలా వెళ్ళే దళారి యువతీయువకులు తమను తాము చాల ఉన్నతమైన మనుష్యులు అనుకుంటారు . ఆయా
దేశాల పురాతన శిధిలాల ఫోటోలను తెచ్చి స్వదేశం లో గర్వంగా
ప్రదర్శించుకుంటారు. విదేశాలలో వ్యాపారం చేయడంలో గల సాధక బాధకాల గురించి
సదస్సులలో పిచ్చాపాటిగా మాట్లాడుకుంటారు. వాళ్లకు విదేశంలో ఏ చికాకు
కలగకుండా వారి కంపెనీ ఒక పెద్ద లాయరును నియమిస్తుంది. వాళ్ళు చేస్తున్న పని
సరైనదేనని వారిని అనుక్షణం నమ్మించడానికి మానసిక వైద్యులతో సహా అన్ని
“వసతులు ” సమకూరుస్తుoది వారి కంపెనీ.
బానిసలు పూర్తి గా పరిణామం చెందని మానవులని, వారిని సంస్కరించెందుకే కిరస్తానీ మతం లోకి వారిని చేర్చు కుంటున్నామని పూర్వకాలపు బానిస వ్యాపారి అనుకునేవాడు. తమ ఆర్ధిక వ్యవస్థ , తమ సమాజం బానిసల శ్రమశక్తి పైనే ఆధారపడినదని అతగాడికి తెలుసు.
అసలేమి లేకపోవడం కన్న నేను ఇచ్చే డాలర్ మిన్న అనీ , ఇటువంటి ఉద్యోగాలు చేయడం వలన పేద ప్రజలకు అంతర్జాతీయ సమాజంతో కలిసే ఒక గొప్ప అవకాసం కల్పిస్తున్నామని కొత్త బానిస వ్యాపారులు అనుకుంటున్నారు. తాము చేసే ఈ పనుల వలన తమ కంపెనీ అయితే లాభాపడుతుందేమో కాని తమ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందోని వీరికి ఎప్పటికి అర్ధం కాదు.
లాటిన్ అమెరికా దేశాలలో దళారి అనుభవాలు :
పనామా కాలువలో దొంగలుపడ్డారు
అట్లాన్టిక్ , పసిఫిక్ మహా సముద్రాలను కలుపుతూ పనామ కాలువ తవ్వాలని ఒక ఫ్రెంచ్ ఇంజనీర్ నిర్ణయించే నాటికి పనామ కొలంబియా దేశం లో అంతర్భాగంగా ఉండేది. 1881 లో ఫ్రెంచ్ వారి నేతృత్వం లో మొదలయిన కాలువ పనులకు అడుగడుగునా ఆటంకాలు ఎదురయ్యాయి. చివరికి భారి ఆర్ధిక నష్టంతో పనులు ఆగిపోయాయి. పనామ కాలువను ఒక అమెరికన్ కంపెనీకు అప్పగించమని కోరింది అమెరికా. కొలంబియానిరాకరించింది.
1903 లో రుజువేల్ట్ అప్పటి అమెరికా అధ్యక్షుడు పనామా ఫై దాడికి ఆదేశించాడు. ఒక స్థానిక ప్రజా నేతను మట్టుబెట్టి ఒక కీలుబొమ్మ నేతను ప్రతిష్టించి మొదటి కాలువ పనులను అమలులోకి తెచ్చారు. దీని ప్రకారం పనామా కాలువ ఇరువైపుల అమెరికా అధీనంలో ఉంటుంది. అయితే ఈ వొప్పందం లో వింత ఏమిటంటే దీనిపి సంతకం చేసినవారు అమెరికా సెక్రటరీ అఫ్ స్టేట్ మరియుఒక ఫ్రెంచ్ ఇంజనీరు. పనామ దేశస్తులు ఎవ్వరు సంతకం చెయ్యకపోవడం గమనార్హం.
1968 లో స్వతంత్రం ప్రకటించు కోనేదాక అమెరికన్ సేనలు పనామాను కంటికి రెప్పలా కాపలా కాసేవి. ఒమర్ తోరిజాన్ పనామా దేశాధ్యుక్షుడు అయ్యాక పనామాకు తన గడ్డపై , తన ప్రజలపై , తమ కాలువ పై సర్వ హక్కులు ఉన్నాయని వాదించేవాడు.
అట్లాంటి పనమాకు ఒక భారి అభివృద్ధి పధకం తయారుచేయడానికి దళారి జాన్ పెర్కిన్స్ నియమించబడ్డాడు. ఈ పథకం వలన ప్రపంచ బ్యాంకు ఇంటర్ అమెరికన్ డెవలప్మెంట్ బ్యాంకు కలిసి పనామకు కోట్ల కొద్ది డాల్లర్లు అప్పుగా ఇవ్వడానికి వీలవుతుంది. విద్యుత్ ,వ్య్వవసాయ రంగాలకు ఉద్దేశించిన ఈ అప్పు కేవలం ఒక మోసపూరిత ఎత్తుగడ. పనామాను ఎప్పటికి తమ పాద దాసిగా చేసుకొనేందుకు అమెరికా వేసిన పాచిక.
కాని పనామ దేశ స్త్ర్రీలను వ్యభిచారం చేయనివ్వరు. వారు బార్ గల్స్ గాను, డాన్సుర్లుగా పనిచేయవాచ్చు. కాని శరీరాలను అమ్ముకోకూడదు. ఆ పని విదేశీయులకు వదిలివేయబడింది.
1989 డిసెంబర్ 20 నాడు పనామ పై అమెరికా ఏకపక్ష దాడికి దిగింది. పనామ చేసిన నేరమల్లా గుప్పెడు మంది అమెరికన్ ప్రభుత్వ పెద్దలను, బహుళ జాతి కంపెనీలను వ్యతిరేకించడమే. తమ దేశంలో ఒక కాలువను తమకు నచ్చిన వారితో (జపనీస్) నిర్మింప చేసుకోవాలనే ఆకాంక్షని వ్యక్తపరచడమే.
అమెజాన్ అడవుల్లో గ్రీన్ హంట్
తనకు తెలిసిన ప్రతి సంస్కృతి 1990 చివరి సంవత్సరాలలో ఒక కీలకమైన దశకు చేరుకున్నామని చెబుతుందని జాన్ పెర్కిన్స్ ఒక మంచి పరిశీలన చేస్తాడు . యాదృ చ్చికంగా మన దేశంలోనూ, ఇతర దేశాల లాలోను సంస్కరణల ‘స్వర్ణ’ యుగం అదే.
ఈక్వెడార్ అనే చిన్న దేశాన్ని తన అమెజాన్
అడవులను చమురు కంపెనీలకు అర్పించమని అంతర్జాతీయ సంస్థలు, బహుళజాతి సంస్థల
ఒత్తిడి చేసాయి. రచయిత ఈ సందర్భంగా ఒక వ్యాఖ్య చేస్తాడు.
ఈక్వెడార్ లో ఇప్పుడు జరుగుతున్నసంఘర్షణ ధనవంతులు దరిద్రులు మధ్య కాదు,
పీడితులు పీడింప బడే వారి మధ్యే కాదు — ఇది మన నాగరికత ఏ పాటిదో తేల్చే
సమరం అంటాడు.
ఈక్వెడార్ లో సతత హరిత అడువులు చాల విలువైనవి. ఇక్కడ స్థానిక తెగలు వారి సంస్కృతి విలువైనవే. ఇక్కడ నివశించే సమస్త జీవజాతులు విలువైనవే.
ఆఫ్ఘనిస్తాని .ఇరాక్, వెంజుల్లల్లో ఉన్న ఉద్రిక్తతలు కూడా ఈక్వెదార్లొ అమెరికా వేలుపెట్టకుండా నిరోధించా లేకపోయింది . ఎందుకంటే ఈ సంఘర్షణకు అమెరికన్ సేనలు అవసరం లేదు. ఇక్క్కడ యుద్ధం చేస్తున్నది బరిశేలు, బల్లాలు , పాత తుపాకీలు చేబూనిన అడివి పుత్రులు కదా. వారిని ఎదుర్కోవడానికి ఆధునిక ఈక్వెడార్ సైన్యం సరిపోతుంది. కొద్దిమంది అమెరికన్ స్పెషల్ ఫొర్సెస్ కు చెందినా “నిపుణులు ” ఉంటే చాలు. ఇలాంటి “యుద్ధం” ఒకటి జరుగుతున్నట్టు కూడా మా అమెరికన్ ప్రజలకు తెలియదని ఆశ్చర్య పోతాడు జాన్ పెర్కిన్స్. మన దేశం లో దండకారణ్యంలో గ్రీన్ హంట్ పేరిట ఇలాంటి యుద్ధం ఒకటి జరుగుతుందని మనలో మాత్రం ఎందరికి తెలుసు?
కొలంబియా గెరిల్లాలు
1970లలో కొలంబియా లొ జాన్ పెర్కిన్స్ కంపినీకు అనేక మౌలిక వసతుల రూపకల్పన కాంట్రాక్టులు దక్కాయి. అప్పుడే పౌలా అనే కొలంబియా యువతీ పరిచయమవుతుంది. ఆమె తమ్ముడు ప్రజా గెరిల్ల సైన్యం లో ఒక్కడు. పౌలా ఒక రోజు పెర్కిన్స్ తో నిర్మొహమాటంగా మాట్లాడుతుంది.
” మీరు ఆనకట్ట కడుతున్న్న నది ఒడ్డున నివసిస్తున్న రెడ్ ఇండియన్లు ,రైతులు మిమ్మల్ని ద్వేషిస్తున్నారు. నగరాలలో నివసిస్తున్న ప్రజలు కొందరు మీ కంపెనీ క్యాంపులపై దాడి చేస్తున్న గెరిల్లాల పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం వీళ్ళని కమ్యూనిస్టులని,టెర్రరిస్టులు , స్మగ్లర్లు అని అంటుంది. కాని వాస్తవం ఏమిటంటే వాళ్లు మామూలు ప్రజానీకం . మీ కంపెనీ నాశనం చేస్తున్న భూములపై నివసిస్తున్నారు.
గెరిల్లాల పట్ల రచయితకు సానుభూతి ఉంది
” నమ్మిన ఆశయాల కోసం నిలబడ్డారు వాళ్ళు. నిజమైన ప్రపంచాన్ని ఎంచుకున్నారు వాళ్ళు ” రెండు ప్రపంచాల మధ్య ఊగిసలాడుతున్నాను నేను అని రచయిత వాపోతాడు.
ఈ అనుభవాలు మచ్చుకి కొన్ని మాత్రమే ! మనదేశం లోనూ జరుగుతున్న’ అభివృద్ధి’ పరిణామాలకు కొన్ని విషయాలు దగ్గరగా వున్నాయనిపిస్తుంది కదా! అందుకే ఈ దళారి పశ్చాతాపం మనలోకూడా ఉన్న నిజమైన మనిషిని నిదురలేపుతుంది.
- నక్కా హేమా వెంకట్రావు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
This entry was posted in పుస్తక సమీక్షలు and tagged . అంతర్జాతీయ, 1881, 1903, 1951, 1960, 1968, 1971, 1989, 5 స్టార్ హోటల్స్, అట్లాన్టిక్, అమెజాన్, అమెరికా, అమెరికా అధ్యక్షుడు, అమెరికా దేశాల, ఇంగ్లీష్, ఇంజనీర్, ఇండోనేషియా, ఇరాన్, ఈజిప్టు, ఒక దళారీ పశ్చాత్తాపం, కంపెనీ, కంప్యూటర్, కమ్యూనిజం, కవిత్వం, కార్పోరేషన్ల . క్యమ్యూనిజం, కాలువ, కీలుబొమ్మ, కేర్మిట్, కొణతం దిలీప్, కొలంబియా, గాలిలో దీపం, గ్రీన్ హంట్, చంద్రబాబు, చమురు, చలం మైదానం, చెరబండరాజు, జాతీయం, జాన్ పెర్కిన్స్, జాన్ పెర్కిన్స్ ఆగస్ట్ 15, జీన్స్ పాంటులు, జెట్ విమానాల, టెన్నిస్ బూట్లు, డాలర్, డిసెంబర్, తెలుగు, థాయిలాండ్, దక్షిణ ఆసియా, దళారీ, దేశం, దేశాలు, ద్రవ్య సంస్థలు, నవల, పనామా, పసిఫిక్ మహా సముద్రాల, పాకిస్తాన్ ప్రతి నాయకుడి, పిల్లల, పుస్తక పరిచయం రచయత, పుస్తకం, పుస్తకం నిండా, పేద ప్రజల, ప్రధాన మంత్రి, ప్రపంచ బాంకు, ప్రపంచీకరణ పుట్టుక, ఫిల్లిప్పిన్స్, ఫ్యాక్టరీ, ఫ్రెంచ్, బుద్దు దళారీలు, బోట్ స్వనా, బోలివీయ, బ్యాంకు, బ్రిటన్, బ్రిటిష్, బ్రిటిష్ వారు, బ్రోకర్లు, భారతి యువతీయువకులు స్వదేశం, భూమిక, భోగి, మంచి కధ, మానసిక వైద్యుల, మిత్రుడు, యోగి, రాజకీయ, రుజువేల్ట్, రెండవ ప్రపంచయుద్ద, లాటిన్, లాటిన్ అమెరికా, లాయరు, వాహనాల, విదేశాలలో, విద్యుత్, విద్రోహం, విప్లవ కవి, వేమన, వేమారెడ్డి, వ్యభిచారం, వ్యవస్థ, వ్యాపారం, వ్య్వవసాయ, శ్రీశ్రీ, సంఘర్షణ, సంచిక, సమా, సాహిత్యం, సిద్దార్ధుడు, సుడాన్ సామ్రాజ్యవాద, సొవియట్ యూనియన్, స్త్ర్రీ. Bookmark the permalink.
3 Responses to సామాన్యుడు కాదు సామ్రాజ్యవాద దళారీ-’ఒక దళారీ పశ్చాత్తాపం’ పుస్తక పరిచయం
-
సమగ్రమైన సమీక్ష అందించారు. తప్పకుండ చదవాలి ఈ పుస్థకాన్ని. అభినందనలు.
-
ఇది చాలా అద్భుతమైన పరిచయం హేమా గారూ. మీకు నా హృదయ పూర్వక అభినందనలు.