Monday, August 6, 2012


THE ANDHRA PRADESH DALIT MAHA SABHA
    6-3-600/A2/1, F 5 Tejaswini apartments Hiltop colony Erramanjil Colony  Hyderabad - 82
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -                               
BEFORE THE ANDHRA PRADESH STATE HUMAN RIGHTS COMMISSION
HYDERABAD ::  AT HYDERABAD

HRC   NO:                               OF 2012


BETWEEN:

ANDHRA PRADESH DALITH MAHA SABHA 
Rep by Founder General Secretary Katti Padma Rao                     . . . . . . . . PETITIONER


AND

1.  State of Andhra Pradesh
     rep. by Chief Secretary
     Government of Andhra Pradesh
     Hyderabad  500 022

2.  State of A.P rep Principal  Secretary to 
     Ministry of Home
     Government of Andhra Pradesh

3.  Director General of Police
     Government of Andhra Pradesh

4.  Deputy Inspector General of Police 
     Visakhapatnam

5.  State of A.P rep Principal Secretary to
     Ministry of Revenue
     Government of Andhra Pradesh

6.  The District Collector
     Srikakulam District



7.  The Superintendent of Police
     Sirkakulam
     Srikakulam District.                                                     ................RESPONDENTS

                     

PETITION FILED UNDER SECTION 12 A OF NATIONAL HUMAN RIGHTS ACT 1993
     ---------------------------------------------------------------------------------- ----------------


         For the reasons mentioned in the accompanying affidavit the petitioner herein in prays that the Hon'ble Human Rights Commission may be pleased to intervene and direct the respondents to take stern action against the abettors like Botsa Vasudevarao and Botsa Satyanaryana u/s 120(b) and punish them as  per law. b)  To register cases against all accused u/s 302 and  u/s 3 (V) of the Scheduled Castes and the Scheduled Tribes (Prevention of Atrocities) Act 1989, c)  To register cases against all accused u/s  25 of the Indian Arms Act, 1959, d))  To register a case against against respondents 4,6, and 7 concerned station house officer u/s 120(b) d)  To appoint advocate commission to visit the area of Laximpet, investigate and report to the Hon'ble State Commission, e)  To organise a public hearing of Lakshimpet dalits. f)  To establish special court at Lakshimpet itself to ensure justice that case be probed within six months,
g) to identify government lands and to distribute to oppressed castes and communities like Dalits, Adivasis, Muslims, and  other weaker castes  as self-assertion and dignity is invariably linked to the land question for the vast majority of the oppressed people. h)  all the disputed land of 250 acres at Lakshimpet  must be distributed to the 80 families of dalits, especially victims family must be allotted 5 acres each. i)  To pay the Rs 10 Lakhs compensation and rehabilitate the family members of victims. j)  To provide a government job to the members of the victims immediately. k)   Lift the cases foisted against the dalits of Lakshimpet l) appoint special public prosecutor j)  And to pass such other order and orders as deemed fit and proper in the circumstances    of the case.




                                                                COUNSEL  FOR THE PETITIONER





BEFORE THE ANDHRA PRADESH STATE HUMAN RIGHTS COMMISSION
HYDERABAD ::  AT HYDERABAD

HRC   NO:                               OF 2012



BETWEEN:

ANDHRA PRADESH DALITH MAHA SABHA 
Rep by Founder General Secretary Katti Padma Rao
S/0 Katti Subba Rao aged 59 years r/o 6-3-600/A2/1,
F 5 Tejaswini apartments Hiltop colony
Erramanjil Colony  Hyderabad 500 082                                . . . . . . . . PETITIONER



1.  State of Andhra Pradesh
     rep. by Chief Secretary
     Government of Andhra Pradesh
     Hyderabad  500 022

2.  State of A. P rep Secretary to 
     Ministry of Home
     Government of Andhra Pradesh

3.  Director General of Police
     Government of Andhra Pradesh

4.  Deputy Inspector General of Police 
     Visakhapatnam

5.  State of A.P rep Secretary to
     Ministry of Revenue
     Government of Andhra Pradesh

6.  The District Collector
     Srikakulam District




7.  The Superintendent of Police
     Sirkakulam
     Srikakulam District.                                                      ................RESPONDENTS

                        AFFIDAVIT FILED BY THE PETITIONER
                                                         


I. Katti Padma Rao S/0 Katti Subba Rao aged 59 years r/o 6-3-600/A2/1, F 5 Tejaswini apartments Hiltop colony Erramanjil Colony  Hyderabad 500 082, do here by solemnly affirm and state on oath as follows:

I am the Petitioner herein and therefore, I am well acquainted with facts of the case. I am a social activist and poet and an activist pioneering the dalit rights.

It is submitted that the oppression of the dalits continues unabated in the state. Reminding one of the infamous bloody past incidents that witnessed the brutal killings of Dalits in the state like, Karamchedu, Neerukonda, Dechavaram and Tsundur, five dalits  were hacked to death, and about 30 dalit men and women were critically injured in a well-orchestrated attack by Turpu Kapu backward caste brahmanical forces in Lakshimpeta village of Vangara block in Srikakulam District on 12 June 2012.

It is pertinent to mention that whichever dominant castes are in power people belong to those castes continue to conduct violent attacks on the dalits, when NTR was in power six dalits  were brutally killed in Karamchedu.  When Neduramalli Janardhan Reddy was in power, they chopped off the eight dalits in tsundur village of Guntur District and dumped them in River Tungabhadra.  Now when Botsa Satyanarayana who call himself a B.C is the Pradesh Congress President, Botsa Vasudevarao Naidu and horde of turpu kapus, armed with swords, axes have tortured and slaughtered ruthlessly the dalits of Lakshimpet in Srikakulam District.  The incidents listed here may not figure in any history of post-independence India.  Most Indians may not have heard of these places.  Lakshmipet too, many soon be similarly forgotten.  This petition is to ensure that it will not be easily erased in the history of Human right's struggle  and for the justice guaranteed by the Constitution of India which was written by the great Dalit legend Dr. Ambedkar.

It is  submitted that I am filing this  petition after visit of  our fact finding committee  to the Lakshimpet consisting of  Chintapally Guru Prasad , the President of Andhra Pradesh Dalit Maha Sabha and other three Excutive Committee members namely P. Benjimen, Gokara Narayana Rao and Nuthalapati Chandra Sekhar.  


It  is further submitted that on 12th June 2012 the landowning Thurpu kappus of  Lakshmpet village, Vangara Mandalam in Srikakulam District surrounded the dalitwada of the village at seven in the morning. Groups of around 20 members each, armed  with  deadly  weapons like sickles, hatchets, axes, crowbars.  They dragged the dalits from their houses  and lathis and showered inhuman abuse and insults on them.  "  you maala bas….., you think you have grown big enough to be cultivators?  They ranted in their cast arrogance.  Shouting “you think you can tilt the land along side us”.  They launched brutal attack and  butchered the  Burada Sundara Rao (45), Chitri Appadu (35), Nivarti Venkati (65) and Nivarti Sangameshu (40) who died in the bloodbath. Bodduru Papaiah died in King George Hospital, Vishakhapatnam on 20 June while taking treatment. With his death, the number of people killed in the massacre increased to five. 

The fact finding committee members also observed that each body bore around 40-50 knife and spear wounds. The victims died immediately after they received injuries.  They have become martyrs in the struggle for land and as offering to the fire of caste hatred. 
About 30 people injured apart from the five who died.  They are undergoing treatment in RIMS Hospital in Srikakulam.  Kalamata Ganapati (35) Kalamata Prakash (50) Kalamati Simhachalam, Kalamati Gangulu, Gonela Ravi (25) Nivirti Gangaia (50) Kalamata Gaddiah (Lachchaiah’s son) Kalamati Gaddaiah (Chinna Mutyalu’s son)  Nivirti Simhachala, Nivirti Narsaiah, Nivirti Rama Rao, Bodduri Bhogesu, Gongada Shivudu, Nivirti Darappadu, Nivirti Gangaiah, Kalamati Sngamma, Chittari Yellaiah, Kalamati Gangulu, Bodduri Gowaraiah  are fighting for their lives in the hospital.

“My father Venkati begged with folded hands to spare him saying the entire family depended on him. But the attackers did not heed his appeal and killed him on the spot,” said a shocked Anuradha who had become unconscious after witnessing the attack.   The accused entered the homes of victims and ransacked their belongings on the plea of searching for the their men.The accused pushed, insulted and outraged the modesty of dalit women and the same was witnessed by the total community.   The women who had their husbands at 7.30 am had lost their husbands within minutes. The accused axed some, speared some and hit some of them with the iron rods indiscriminately resulting in their instantaneous death.  The victims also heard loud cries made by the accused and some others instigating the other accused to kill the dalits who ever was sighted.  Due to the frightening attack on the deceased who witnessed the attack ran helter skelter for fear of their lives.
26 year old Chittari Sridevi, Borada Kasalu, Nivirti Ramudamma, Viviri Venkatamma were widowed and rendered helpless by this gruesome attack.  Most of them are between the ages of 30-40 years, all mother.  Women who had husbands at 5 in the morning lost them by 7.30.   The children of these deceased families are thrown into the streets without any security both socially and economically.  There is no answer for the fate of the children.

It is further humbly submitted that Lakshimpeta is the biggest massacre by the upper cates after Karamchedu and Tsundur.  These caste villains surrounded the Dalits, chased and hunted them for two and half hours with deadly weapons and derived perverse pleasure from attacking even dead bodies with the words and axes. The toorpu Kapu landlords here, even though BCs in name, are great believer in caste supremacy.  The Kalingas,  Koppula  velmas and tiirpu in Srikakulam in Srikakulam district perform the role undertaken by the Kammas, Reddies and Kshatriyas in Coastal Andhra.

The Lakshmet village is not unique.  It seems to be a reenactment of primordial punishment to the subordinated castes that Manu had ordained over two millennia ago.   Infact  Land was acquired by government for Madduvalasa reservoir built on two tributaries of Nagavali river, Suvarnamukhi and Vegavathi which, while displacing thousands of people irrigated 15000 acres of land. In Lakshimpeta village, after the construction of the reservoir, 240 acres of land intermittently comes out of the submergence when water dries up. As the land turns fertile, rich crops were being raised on it with profitable cultivation in the past five years. The government paid a compensation of two lakh rupees per acre to Kapu land owners and settled 190 Kapu families and 60 Dalit families about seven kilometres away from the reservoir. The Dalit families were not paid any compensation or given employment though they were also displaced and resettled except for four families, who had assigned lands—only 40 thousand rupees per acre were paid to each of these four Dalit families. Meanwhile one each from 40 families of the Kapu caste was provided with employment in the reservoir office departments in addition to compensation amount for land. All 250 families were settled in pacca houses built by the government.

 Having been deprived of land for centuries, the Dalits of Lakshimpeta, as in most other cases, aspired to take over the unaffected land under the project and they have been  asserting their rights over the land which now falls under the control of the government.  This led  discontent among the Thurpu Kaapu was on the rise and they were waiting for an opportunity to liquidate the Dalits  situation slowly led to the cornage of the dalits on the unprecedented scale in the over which the entire civilized world was shocked.  

The dalits were subjected to a social boycott.  They are not being called for cooli work, no entry in schools and hospitals , forcing them out of village.  All these acts were intended to make the village hot for the dalits to live and slowly to send them out the village.  When the dalits failed to yield to the threats of the upper castes they began to seriously consider other methods to subjugate and eliminate the dalits.  The dalits were particularly ill-treated, assaulted and they are being massacred and  facing genocidal attacks.

It is submitted that  Lakshmpet is not one of incident an unfortunate aberration in globalizing shining India.  Every village in India is a potential Lakshimpet. If most villages wear a Vencor of peace and tranquility much celebrated in text books and tourist brochures this owes to the tacit compromise and reconcilement dalits have made with their demeaning condition. It is the same compromise that has carried India through centuries of having been bestowed with utterly undeserved attributes such as tolerance, nonviolence and love of peace.  Whenever this compromise has collapsed the inherent violence of this society has reared its ugly face to brutally suppress any possible eruption of the wrath of the wretched and once again history of oppression repeated   violating all  human rights of Dalits.
There are 80 dalit families and 10 non Kaapu Backward caste communities. all these non- kapu BC Communities not participated in the massacre. It is true that kaapu community  in around 7 villages of Lakshimpet decided to forge a united front against the dalits and conspired to attack on Lakshimpet dalits. Including women and children of neighbouring villages participated in the massacre.  The reason behind their participation in massacre is not just they belong to the same community but also the same situation is prevailing in their villages also. .  

It is further submitted that as the 240 acres of land—that once belonged to Kapu community became government land after compensation was being paid—came out of submergence every now and then,  190 acres of land has been cultivated by the Kapu families while only 60 acres by 80 dalit families in the last five years.  Kapu community in the village claimed that the entire land belongs to them as it once belonged them. Dalits argued with the local revenue administration that they should be allowed to cultivate this land as it was now government land. This enraged the feeling of the kaapus and sparks of rationalization have started to fly.
In Lakshimpeta village under Vangara Mandal about 80 Dalit families are living and a majority them are agriculture workers. Two year ago, the Dalits from the village had requested the district authorities to allow them to cultivate land.  

.   It is a fact that the district administration has supported the dalit community in the past to cultivate the land of  60 acres. Few days ago when some Dalits tried to cultivate the lands, BC leaders attacked them and the police as a routine filed cases against both the groups. So far, both the communities have clashed with each other four times. A month ago when the BCs attacked them Dalits filed a case and a police picket was set up in the village. This had enraged the BC leaders who were trying to capture the lands. The land owning upper caste were on prowl and waiting for an opportunity to wreak vengeance against dalits  Revenue officials visited the places and tried to settle the matter with both the warring groups but failed. They have also declared that they would not allow either of the groups to cultivate the disputed lands.  


It is submitted that the local administration maintained silence as the Kapu caste people were supported by powerful lobbies within the ruling party from the state to the bloc levels within the same caste. Both sides of the dispute approached the court for justice. The court as usual stayed the cultivation from both sides till its judgment. But this also triggered fury among the Kapu backward community and they blamed squarely the dalit community for the court order, though both communities had approached the court. The former local block president of Congress Party, Botsa Vasudevanaidu instigated the Kapus against the dalit people with the active encouragement from PCC chief, Botsa Satyanarayana from North Andhra Region.  Laximpet represents the quintessence of caste India.

  .he petitioner further submits that some of the shudra castes have emerged in dominant position in the production process and successfully translated this in the political cultural domain.  Since the formation of the state, landowning castes in the various regions – be it Kammas or Reddies or Kapus or Kalingas or velmas or Kshatriyas have been unable to bear the sight of dalits tilling land on their own, developed grudges against them claiming that the Dalits have no right to land on their own, conducted violent attacks on them or expelled them from villages. In the earlier period the contest was between the brahmines and the peasant castes.  No, it is increasingly seen between the landowning peasant castes and dalits as landless labourers. The history witnessed the same with  Reddy  and Kamma Communities in Andhra Pradesh. This  aspired the kaapu community to emerge as new caste-based regional outfit  to grab the power in Andhra Pradesh.and this led polirization of all sub castes of Kaapus. They have become the powerful agents of land grab in the region for thermal power plants, industrial corridor projects and mining in North Andhra Region.  They are maintaining land mafia’s and have acquired thousands of acres of for their own families.  There is a strong bond between state power and caste hatred of this kind.  The modernist state that has given caste a new lease of life; it is also its fountain head its policies and institutions have increasing reinforcing castes and accentuated their viciousness as never before.    These castes are responsible for the police firings and state-sponsored killings of the people, who are protesting against land grab in the region. They are the powerful political leaders of the region who are in real sense representatives of globalisation and displacement of hundreds of thousands of people in the region.

 
It is submitted that  police picket in the village, instead of solving the issue and the bloc has been placed under the atrocitiy-proned area. This shows such an attack as the one on dalits on 12 June has been expected to happen. In these circumstances, the government itself is directly responsible for the massacre of dalits. In the pretext of by elections on 12th June majority of police personnel at the picket were sent away on by-election duty. The police forces returned to the village only after giving enough time to the caste chauvinists to carry out the massacre unhindered. History testifies to this set pattern of conduct of the state forces as every time they remained mute witnesses to the upper caste brahmanical fascist attacks on dalits. In fact the Indian state forces like police, paramilitary and army always either sided with upper caste big landing owning communities or stayed as onlookers over the atrocities as they represented the interests of the brahmanical upper caste Indian state.

It is further submitted that  Srikakulam near the Government Hospital, Dalit organizations and members of the victims’ families have organized dharna demanding stern action against those involved in the attack. They refused to take the bodies till action was initiated against the guilty. 

It is submitted that  the political leaders of all ruling parties hovered over the surviving victims of dalit families pouring out their crocodile tears and false promises of jobs, lakhs of compensation and distribution of land. People have seen through the cunningness of these leaders as well as the empty rhetoric of their false promises. The upper caste brahmanical forces would never allow land to come into the hands of dalits as it is both symbolically and in real sense economic and political power. Further it will nullify all the coercive methods of surplus maximization of the landed through the forced rendering of the dalits landless and hence dependent on the upper castes for their survival. The powers that be have only ensured through their police and paramilitary hand in glove with politician and the landowning classes to perpetuate this system by careful promotion of their interests. Dalit people of Lakshimpeta village have shown exemplary self-assertion to own the land despite continuous threats and atrocities from the powers that be. Yet this juncture, the dalits have further threat to their lives.  

It is humbly submitted that it is clear that the accused and others having conspired and formed themselves into an unlawful assembly armed with deadly weapons like axes, knives, sticks, iron rods, spears, crow bars and other weapons with common intention and common object of attacking and butchering the dalits of Lakshimpet, and in pursuance of the above said conspiracy, common object and intention, and have attacked the dalits fatally and caused death of 5 dalits and grievous injuries to more than 30  dalits.

Fsurther the accused being members of landowning upper castes have most inhumanly ill-treated the dalits, socially boycotted them removed them from employment, and openly proclaiming that they would be driven out the village, in pursuance of their intention has actually carried out their intention.  The dalits were particularly ill-treated, assaulted, and insulted on the ground that they belong to the Scheduled Castes.. the crimes of accused are heinous and grievous and therefore
.therefore the petitioner prays that the Hon'ble State Human Rights Commission that interest of justice may be please to pass order :;

 a) to investigate by CBI into the circumstances which led to brutal carnage of dalits in Lakshimpet of Srikakulam District and consequentially protect the human and fundamental rights of the dalits guaranteed under art. 14,16,19 and 21 of the Constitutuion of India.

A week after when the law was evoked, it was used against small insignificant elements among the culprits, leaving out safely the main abettors and political leaders like Botsa Vasudeva Naidu,  Botsa Satyanarayana and others. Hence direct the respondents to take stern action against the abettors like Botsa Vasudevarao and Botsa Satyanaryana u/s 120(b) and as per law. 

b)  To register cases against all accused u/s 3 (V) of the Scheduled Castes and the Scheduled Tribes (Prevention of Atrocities) Act 1989.

c)  To register cases against all accused u/s  25 of the Indian Arms Act, 1959.

b)  To register a case against case u/s 302 IPC against respondents 4,6, and 7 concerned station house officer
c) to provide protection to  the lives of  the victims as  there is life threat to victims from the accused and their kith and kin to protect  their

c)  To appoint advocate commission to visit the area of Laximpet, investigate and report to the Hon'ble State Commission.

d)  To organise a public hearing of Lakshimpet dalits.


e)  To establish of special court  at Lakshimpet to ensure that case be probed within six months,

f) to identify government lands and to distribute to oppressed castes and communities like Dalits, Adivasis, Muslims, and a vast majority of oppressed other weaker castes  as self-assertion and dignity is invariably linked to the land question for the vast majority of the oppressed people.

g)  All the disputed land of 250 acres at Lakshimpet  must be distributed to the 80 families of dalits, especially victims family must be allotted 5 acres each.

h)  To pay the Rs 10 Lakhs compensations and rehabililate the family members of victims.

i)  To provide a government job to the members of the victim.

j)  Lift the cases foisted against the dalits of Lakshimpet

k)  And to pass such other order and orders as deemed fit and proper in the circumstances    of the case.




                                                                                        DEPONENT


                                            VERIFICATION

I, Katti  Padma Rao S/0 Katti Subba Rao aged 59 years r/o 6-3-600/A2/1, F 5 Tejaswini apartments Hiltop colony Erramanjil Colony  Hyderabad 500 082 do hereby verify the contents of the affidavit and state on oath that I have verified the Contents of the above paras of affidavit and declare them to be true to the best of my knowledge and I did not suppress any material facts.




                                                                                              DEPONENT
Solemnly affirm on oath on
This 27th June, 2011

Before me.


                                      Sd/-Hema Venkatrau.
                                              ADVOCATE









                                                           BEFORE THE HON’BLE  ANDHRA  PRADESHSTATE HUMAN RIGHTS COMMISSION
HYDERABAD ::  AT HYDERABAD

HRC   NO:                               OF 2012


BETWEEN:

ANDHRA PRADESH DALITH MAHA SABHA 
Rep by Founder General Secretary Katti Padma Rao                     . . . . . . . . PETITIONER


AND

  1. State of Andhra Pradesh
Rep. Chief Secretary  and 6 others






Wednesday, August 1, 2012

దళిత బహుజన ఉద్యమాలపై సవాలక్ష ప్రశ్నల ”లక్షింపేట”

Posted By on August 1, 2012
హేమలలిత
అట్టడుగు వర్గాల ఊచకోతే అభివృద్ధికి తొలిమెట్టేమో! అందుకే  కారంచేడు, ఖైర్లాంజీ, చుండూరు, నీరుకొండ…ఇప్పుడు లక్షింపేట. లక్షింపేట హత్యాకాండ సంధిస్తున్న సవాలక్ష ప్రశ్నల్ని విశ్లేషించుకోవాల్సిన సందర్భం ఇది. దాని వెనకాల శక్తులు, అది రేపిన ప్రతిస్పందనలు, మన ముందుంచిన కర్తవ్యాలు, స్వీకరించాల్సిన, తిరస్కరించాల్సిన అనేక అంశాలను ముందుకు తెచ్చింది.
ప్రపంచీకరణలో అభివృద్ధి నీడల్లోకి నెట్టివేయబడి మిగులు మనుషులుగా మిగిలిపోయిన దళిత బహుజనుల దైన్యస్థితికి ‘లక్షింపేట’ అద్దంపడుతుంది. దళితులపై జరుగుతున్న దాడుల్లో రాజ్యమే భాగం కావడాన్ని మరియు పాలక పార్టీలతో మిలాఖత్‌ అవుతున్న దళిత బహుజన రాజకీయ నాయకుల దగుల్బాజీతనాన్ని చర్చకు పెట్టింది. రాజ్యాంగ యంత్రాంగంలో చెప్పుకోదగ్గ స్థాయిలో దళితులకు ప్రాతినిధ్యం వహిస్తున్న దళిత నాయకులు వున్నారని, పాలనా యంత్రాంగంలో విద్యాధికులైన దళితులు రాజ్యాంగపరంగా లభించే వాగ్దానాలను, హామీలను అమలు చేస్తారని, అంతేగాకుండా ఇతర అస్థిత్వ ఉద్యమాలు (స్త్రీ, మైనారిటీ) తమ పోరాటాలకు బాసటగా నిలుస్తాయని, చివరిగా కుల అస్థిత్వ ప్రాతిపదికన దళిత, శూద్ర కులాల ఐక్యత కోసం వచ్చిన బహుజనవాద రాజకీయాల లక్ష్యసాధనలో ఒక వ్యూహంతో మనగలుగుతాయని అనుకున్న ప్రచారంలో లక్షింపేట అనేక ప్రశ్నల్ని సంధిస్తుంది.
జూన్‌ 12, 2012 ఉదయం 7 గంటలకు శ్రీకాకుళం జిల్లా వంగర మండలంలోని లక్షింపేట దళిత కుటుంబాలు తమ పని పాటల్లో నిమగ్నమయ్యారు. సభ్య సమాజం విస్తుపోయేలా అదే గ్రామానికి చెందిన బిసి కులస్థులైన భూస్వామ్యకాపులు మూకుమ్మడిగా బరిసెలు, గండ్రగొడ్డళ్ళు, బాంబులు, కత్తులతో  ఒక్కొటింటిని 20 మంది చొప్పున చుట్టుముట్టి ఇంట్లో వున్నవారిని బయటికిలాగి, బయట వున్నవారిని తరిమికొడుతూ అమానుషంగా పైశాచిక చర్యలతో దాడి చేశారు. అడొచ్చిన వారిని తెగ నరుకుతూ, గాయపరుస్తూ, పరుగులు తీయిస్తూ వారి తడినెత్తుటితో భూమిని తడిపేశారు. స్త్రీలు అని కూడా చూడకుండా అసభ్యకరంగా ప్రవర్తించారు.  వలస వాదుల్ని మైమరిపించే జలియన్‌వాల్‌బాగ్‌ పునరావృతమైంది.నివర్తి వెంకటేష్‌ (60), సంగమేష్‌ (35) బూరాడ సుందర్రావు, చిత్తం అప్పడు(25) దాడిలో చనిపోగా, బొద్దూరి పాపయ్య (60) విశాఖపట్నం కెజిహెచ్‌ ఆస్పత్రిలో చనిపోయారు ఇరవై మందిపైగా గాయపడ్డారు. ఇదే గ్రామంలో ఉన్న పది కుటుంబాలు ఓ బి.సి కులాలకు చెందినవారు వున్నారు. దాడి జరుగుతున్నపుడే వారు దాడుల్ని ప్రతిఘటించలేకపోయారు.
 దళితులపై జరుగుతున్న దాడులలో స్వభావరీత్యా అనేక మార్పులు వచ్చాయి. అనాదిగా సాగుతున్న వ్యక్తిగత దాడుల స్థాయి దాటి సామూహికంగా మొత్తం కమ్యూనిటీనే నిర్మూలించే స్థాయికి వీటి తీవ్రత పెరిగింది. ప్రపంచీకరణలో భాగంగా మొదలైన సెజ్‌ లలో గ్రామాలు గ్రామాలుగా దళితులు తరలించబడుతున్నారు. ఒక్క కాకినాడ సెజ్‌లో ఏకంగా ఐదు దళిత గ్రామాల్ని సమూలంగా ఖాళీ చేయించారు. ఈ దేశంలో అట్టడుగు వర్గాల పరిస్థితి నానాటికి తీసికట్టుగా వుంటుంది.
భారతసమాజంలో అట్టడుగు వర్గాలు అంటే ఎస్‌సి, ఎస్‌టి, బిసిలు లేక దళిత బహుజనులు లేక మహిళలు. వీరు అట్టడుగు వర్గాలుగా మారడానికి కారణం సుమారు నాలుగు వేల సంవత్సరాలుగా ఈ దేశంలో వున్న వర్గ, కుల వ్యవస్థ. అందులో రెండువేల సంవత్సరాలకు పైగా వున్న చాతుర్వర్ణ వ్యవస్థ, వైదిక లేక హిందూ మత సామాజిక ఆర్థిక వ్యవస్థ. ఇందులో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు అగ్రవర్ణాలు. సమాజంలో 5%గా వుండే వీరికి ఆస్తుల యాజమాన్యం, వ్యాపారాలు, విద్యా, అధికారం ప్రత్యేక హక్కులుగా చేయబడ్డాయి. నిమ్మ వర్గమైన శూద్రులు వీటినుండి మినహాయించబడి, అవి శూద్రులుకు నిషేదించబడి వారికి దూరం చేయబడ్డాయి. జనాభాలో 95% పైగా వుండే శూద్రులు ఈ విధంగా ఆస్థి, ఆదాయం, విద్య, అధికారాలకు దూరం చేయబడి అభివృద్ధికి మార్గాలల్ని మూసివేయబడి అగ్రవర్ణాలవారికి సేవలు చేసేవారుగా మార్చబడ్డారు. ఈ పరిణామ క్రమంలో వర్ణవ్యవస్థ రూపాంతరం చెంది కులవ్యవస్థగా మారితే అగ్ర వర్ణాలు అగ్రకులాలుగా  శూద్ర వర్ణం వేలాది కులాలుగా విడిపోయింది. అదే క్రమంలో అంటరానివారుగా చూడబడ్డ పంచములు అతిశూద్రకులాలుగా ఏర్పడ్డారు. వర్ణ కుల వ్యవస్థలో భూములకు చట్టపరంగా రాజు యజమానిగా వుండడంవలన వ్యక్తిగత ఆస్థి లేదు. కాని రాజులు బ్రాహ్మణ పూజారులు, పండితులు, గ్రామాధికారులు, సైన్యాధికారులు, సామంతులకు భూదానం, గ్రామదానాలు చేయడంతో భూస్వామ్య సంబంధాలు వృద్దిచెందాయి.
బ్రిటిష్‌ పాలనలో చట్టపరంగా భూస్వామ్య వ్యవస్థను ఏర్పరచడంతో అగ్రకులాలకు చెందినవారు భూస్వాములు, జమీందారులుగా శూద్ర అతి శుద్రకులాలు, రైతాంగం, చేతివృత్తులు, వ్యవసాయకూలీలుగా మారారు. అలాగే బ్రిటిష్‌్‌ కాలంలో బ్రాహ్మణులు గ్రామాల్లో భూములను వదిలి పట్టణాలకు వెళ్ళి పాశ్చాత్య విద్యా, ఉద్యోగాలు, వైద్య, వకీళ్ళ వంటి వృత్తులు, వ్యాపారాలలోకి వెళ్ళిపోవడంతో, భూములు శూద్రులలోని పై కులాలవారికి బదిలీ అయి, ఆ కులాలు శూద్ర ఆధిపత్యకులాలుగా మార్పు చెందాయి. ఫలితంగా 20వ శతాబ్దంలో  ఇతర ‘శూద్రకులాలు’ ‘బిసి’లుగా, అతిశూద్రులు ‘ఎస్‌సి’లుగా ఆదివాసీలు ఎస్‌టిలుగా మారారు. ఈ ఎస్‌సి ఎస్‌టి, బిసిలు దళిత బహుజనులుగా పిలువబడుతున్నారు. కుల భూస్వామ్య వ్యవస్థలో పెట్టుబడిదారీ సంబంధాలు వృద్ధి చెంది అగ్రకులాలకు చెందినవారు పెట్టుబడిదారీ వర్గంగా, దళిత బహుజనుల కార్మిక వర్గంగా మారారు. ఈ విధంగా ప్రస్తుతం ఈ దేశంలోని సామాజిక వ్యవస్థ కుల భూస్వామ్య పెట్టుబడిదారీ వ్యవస్థ. ఒక మిశ్రమ ‘కుల వర్గ వ్యవస్థ.’
ఈ సామాజిక ఆర్థిక వ్యవస్థలో నిత్యం అసమానతలు, ఆధిక్యత, అణచివేత, దోపిడీ, వివక్ష, అంటరానితనాలకు గురవుతూ వెనుకబాటుతనానికి దళిత బహుజనులు బలవుతూనే వున్నారు. లక్షింపేట దాని కొనసాగింపే.
లక్షింపేట…’అభివృద్ధి’ యజ్ఞఫలం. కాళీపట్నం రామారావు, యజ్ఞం కథలో అభివృద్ధి పేరిట ఒక ఊరిలో అణగారిన వర్గాలు ఎలా విధ్వంసానికి గురయ్యారో వివరంగా చెబుతారు. ఈ దేశంలో ‘అభివృద్ధి’కి బలిపశువులు దళితబహుజనులే.
‘లక్షింపేట’ శ్రీకాకుళ పోరాట జిల్లాలోనిది, నక్సల్బం పోరాటాన్ని తిరిగి రగిల్చిన పోరాట జ్వాల శ్రీకాకుళం, ఆ పోరాటవారసత్వం. అణగారిన వర్గాలవారికి అందకుండా అడ్డుగోడగా నిలిచిన సామాజిక , ఆర్థిక రాజకీయ పరిస్థితులేవో చూద్దాం!
లక్షింపేట సంఘటన వ్యక్తిగతమైనదేమి కాదు. మొత్తంగా అక్కడ వున్న దళిత బహుజనులకు సంబంధించిన భూవివాదం. ఈ వివాదం గత పదేళ్ళుగా నడుస్తున్నదే. కాకపోతే ఒక్కసారిగా నరమేధంతో అట్ట్టుడికి పోవడంతో దాని తీవ్రత బయట పడంది. నాగావళి సువర్ణముఖి మీద నదుల మద్దివలస రిజర్వాయరు ప్రాజెక్టుకోసం పదేళ్ళుక్రితం గ్రామాన్ని తరలించడంతో వివాదం మొదలైంది. అంతవరకూ వివిధ కులాల వద్దనున్న భూమిని సేకరించి రిజర్వాయరు నిర్మించడంతో 250 ఎకరాలు భూమి ముంపుకు గురికాని ప్రాంతంగా మిగిలిపోయింది.  అప్పటివరకు ఒక గ్రామంలా వుండి  విస్థాపనకు గురైన వారిలో రెండు రకాల భావోద్వేగాలు చోటుచేసుకున్నాయి. నష్టపరిహారం  తీసుకున్న కాపులు తిరిగి భూమిని స్వాధీనపరుచుకోదలిచారు. ఏ లబ్ది పొందక,  వ్యవసాయ ఉత్పత్తి పనులు దొరకక  కుటుంబ పోషణ కష్టమై వేరే దారిలేక దళితులు కూడా భూమిని సాగుచేసుకోదల్చారు. కాపులు 190 ఎకరాలు చేసుకుంటే మిగిలిన 90 ఎకరాలను సాగుకౖైె 88 మంది దళిత కుటుంబాలు ముందుకు వచ్చాయి. మౌఖికంగా ఆనాటి జిల్లా యంత్రాంగం నుంచి అనుమతి తీసుకున్నాయి. తమ ప్రక్కన యిప్పటివరకు సామాజికంగా అణగారిన  దళితులు మిగిలిన భూమిని సాగుచేసుకోవటం కాపులు  జీర్ణించుకోలేక దాడులకు దిగారు.  కాపుల దౌర్జన్యం తట్టుకోలేని దళితులు వంగర పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌సి,ఎస్‌టి అట్రాసెటీల కేసులను  పెట్టారు. ఈ వివాదం కొనసాగుతుండగానే   జిల్లా కలెక్టరు ఓ కమిటికి ఏర్పాటు చేసి యిరువర్గాలవారికి భూమిని దున్నుకోవద్దుని అంక్షలు విధించారు. దళితులు పదేళ్ళుగా పట్టువిడవకుండా భూమిని సాగుచేసుకుంటూ అర్థికంగా నిలదొక్కుకోవడం, ఆ భూమిపై హక్కు సంపాదించుకోవడం కోసం ప్రయత్నించడం ‘కాపు-కులాలు’కు కన్నెర్ర అయ్యింది. దళి తుల మీద కక్ష పెంచుకొని దాడుల్ని ఉధృతం చేసారు. ఫలితంగా పోలీసు పికెటింగ్‌ ఏర్పాటయ్యింది. అదునుకోసం ఎదురుచూస్తున్న కాపు వర్గాలు నర్సన్నపేటలో జరుగుతున్న ఉప ఎన్నికల సందర్భంగా వ్యూహాత్మకంగా పోలీస్‌ పికెట్నిఎత్తివేయించి 12.06.12న లక్షింపేట హత్యకాండను సాగించారు. అసలైన ముద్దాయిల్ని వదిలేసి కంటి తుడుపుగా కొందర్ని అరెస్ట్‌ చేశారు. మొత్తంగా దాడికి మూలం భూవివాదంగా కన్పించినా గ్రామంలోని హిందూకులాల దురంహాకా రమే ప్రధాన పాత్ర వహించింది.
 ఇందుకు నేషనల్‌ క్రైమ్‌ రికార్డు బ్యూరో గణాంకాలే సాక్ష్యం. దీనిప్రకారం ప్రతిరోజు యిద్దరు దళితులు హత్య చేయచేయబడుతున్నారు. ముగ్గురు దళిత స్త్రీలు అత్యాచారానికి గురవుతున్నారు. ఇద్దరు దళితుల యిళ్ళు తగలబడుతున్నాయి.  పందకొండుమంది చావు దెబ్బలు తింటున్నారు అన్న వాస్తవాలు వెనుక ఈ కుల దురంహాకారంతో పాటు వారిని అభివృద్ధి నీడల్లోకి నెట్టేెసిన  ఆర్థిక నేపథ్యం వుంది. వాస్తవానికి 1947 తర్వాత బ్రిటిష్‌ వారి నుండి అధికార మార్పిడి అయితే జరిగింది కాని ప్రజాస్వామీకరణ చెందలేదు. మొదటి  పంచవర్ష ప్రణాళికలలోనే దేశ ఆర్ధిక ప్రగతికి వ్యవసాయంలో అనూహ్యమైన మార్పులకు డ్యాంలు, రిజర్వాయర్లు దోహదపడతాయని, తద్వారా పంటపొలాలు విస్తీర్ణం పెరగడం, లేదా విద్యుత్‌ ఉత్పాదక  పెరిగి పరిశ్రమలు పెరుగుతాయని ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం జరుగుతుందని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆశించింది. కాని అప్పట్నుంచి పునరావాసానికి ఒక స్పష్టమైన అవగాహనతో చట్టాలు చేయకపోవడం, వనరులు ఉన్న వారే లబ్దిపొందడం, నష్టపరిహారంలో అందివ్వడంలో కుల వర్గాలకు  తేడాలు కన్పిస్తుంది. సర్వసత్తాక రాజ్యంగా పేర్కొన్న దేశంలో నెహ్రూ నాయకత్వంలోని భూస్వామ్య వర్గాలు రాజ్యాధికారం పొందడంలో  సర్వజనులకు భూమిపై హక్కు కల్పించలేదు. ఈ వైరుధ్యం ఆరు దశాబ్దాల తర్వాత కూడా  లక్షింపేటలో కొనసాగింది.
దేశంలో వచ్చిన కంటితుడుపు భూసంస్కరణలు, దున్నేవాన్కి భూమి లక్షింపేట దళితులకు ఏ ఆసరా కల్పించలేదు. బలమైన రాజకీయ ఆకాంక్షతో పెట్టినది కాదు కాబట్టి సహజసిద్ధంగానే అది విఫలమయ్యాయి. భూమి, నీరు, విద్యుత్తు, రవాణా సౌకర్యాలు మౌలిక సదుపాయల కల్పనతో  పారిశ్రామీకరణ ద్వారా అభివృద్ధి సాధ్యమని వక్కాణించిన ప్రభుత్వం శ్రీకాకుళంలో జిల్లాలో ఎలాంటి పరిశ్రమల్ని స్థాపించలేక పోయింది. కాబట్టి విధిగా లక్షింపేట ప్రజలు భూమినే  నమ్ముకొని బ్రతుకుతున్నారు. ఆ తర్వాత వచ్చిన  ఇందిరమ్మ ‘గరీబి హాఠావో’ అన్న నినాదం ఆమె రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడ్డాయి తప్ప సుమారు 100 కుటుంబాలున్న లక్షింపేట దళిత బహుజనులకు ఒరిగిందేమీ లేదు. 1980లలో ప్రవేశించిన ఉదారవాదం, ప్రైవేటీకరణతో రిజర్వేషన్ల వెసులుబాటుతో చదువుకున్న దేశంలో అతికొద్దిమంది దళితులు ఉపాధి అవకాశాల్ని గండి కొట్టినట్టే లక్షంపేటలోని కొద్దిశాతం చదువుకున్న దళితుల్ని  గండి కొట్టింది. 1990లలో బాహాటంగా వచ్చిన ప్రపంచీకరణ ప్రభావంవలన ఈ దళిత బహుజనులను ఉత్పత్తికి అవసరమైన జ్ఞానం, నైపుణ్యత వున్న హక్కుదారులుగా రాజ్యం గుర్తించక కేవలం లబ్దిదారులుగా గుర్తించి లక్షింపేట నుంచి ఖాళీ చేయించింది. పోలవరంలో వచ్చిన ప్రతిఘటన యిక్కడ రాకపోవడం ప్రధాన కారణమయ్యిండొచ్చు. స్త్రీలకు పావలా వడ్డీ, యువజనులకు రాజీవ్‌యోజన, ఉపాధి, పేదరిక నిర్ములనా పథకాలు రుణసహాయం అప్పుడప్పుడే కొత్త గ్రామంలో కుదురుకుంటున్న దళితులకు అందలేదు.
దేశంలోగాని, రాష్ట్రంలోగాని గమనిస్తే మొదట్నుంచి సంస్కరణల రూపంలో వచ్చిన అభివృద్ధి ఫలాలను 1960లను నుంచి ఆధిపత్య  కులాలు అందిపుచ్చుకుంటునే వున్నాయి.  ఈ  ఫలాల ద్వారా వచ్చిన మిగులుని పారిశ్రామికీరణకు తరలించారు. పరిశ్రమలు వారి సొత్తయ్యాయి. సహజంగానే అధికారం వాడికి బట్వాడా జరిగింది. అందుకే భూస్వామి వర్గాలు బూర్జువా శక్తులతో కలిసిపోయి భూస్వామి వ్యవస్థను కూకటివేళ్ళతో పెకిలించలేక పోయాయి. ఈ పరిణామంతో పుట్టినవే జాతీయంగా కాంగ్రెస్‌, రాష్ట్రంలో టిడిపి పారిశ్రామీకరణతో వృత్తులు కోల్పోయిన బి.సిలు,  కూలీలుగా, పట్టణాలకు వలసవెళ్ళపోయారు. ఏ దిక్కులేక భూమిని నమ్ముకుని దళితులు పల్లెలలో ఉండిపోయారు. వారిలోని  చదువుకున్న దళితులు వ్యవస్థలోని వివక్షను  ప్రశ్నించడంతో కారంచేడు, చుండూరు, నీరుకొండ మారణహోమానికి ప్రతీకలుగా చరిత్రలో నిలిచిపోయాయి. ఏ ఆధిపత్య కులాలు అధికారంతో వుంటాయో దళితులపై ఆ కులాల దాడులు, దౌర్జన్యాలు జరిగాయి.
బహుజనులలో భాగమైన బి.సి కులానికి చెందిన తుర్పు కాపులు దళితులపై దాడి దానికి భిన్నమైనది. యిప్పటివరకు ఆధిపత్య కులాలుగా వున్న రెడ్లు, కమ్మలు కాకుండా బి.సిలు ఎందుకు ఈ ఘటనకు పూనుకున్నాయి. అన్న దానికిి రాజకీయ కోణం కారణాల వున్నాయి. ప్రపంచీకరణ సామ్రాజ్యవాద ప్రపంచీకరణగా మారుతున్న క్రమంలో, బహుళజాతికంపెనీలు రూపంలో ఎమ్‌.ఎన్‌సిలు గుత్త పెట్టుబడిదారివర్గం ఆధిపత్య కులాలతో జతకట్టింది. దేశంలో దళారీ బూర్జువా వర్గం మరింతగా బలపడింది. పాలకవర్గాలు వారికి అనుకూలంగా తోలుబొమ్మలుగా మారాయి. తమకు అనుకూలమైన చట్టాలు చేశాయి. ప్రత్యేక ఆర్థిక మండలి చట్టం 2005  తెచ్చింది. ఎగుమతులు, ఉపాధిపేరిట వేల ఎకరాలు సమకూర్చాయి. రాష్ట్రంలో 17-18%వున్న కాపు కులాల వారు కృష్ణా, గోదావరి ఆనకట్టలవలన లబ్దిపొంది సామాజిక ఆర్థికంగా  కోస్తాలో రాజకీయంగా బలంగా వుంది. వారు తమ ఆధిపత్య వాటాకోసం పోటీ పడుతూనే బిసిలుగా మారడానికి ఉద్యమాన్ని చేపట్టారు. వీరు ఉత్తరాంధ్రలో, తెలంగాణలో బిసిలుగాను, రాయలసీమ, కోస్తాంధ్రలోను ఓసిలుగా వున్నారు. వీరు ఎక్కడ వున్న ప్రధానవృత్తి వ్యవసాయం.
పోటీలో భాగంగా వున్న కాపు వర్గం గోదావరిజిల్లాకు చెందిన  చిరంజీవిని సామాజికన్యాయం పేరిట రాజకీయరంగ ప్రవేశం చేయించింది. అణగారిన వర్గాలను, కులాలను కలుపుకొంటూ  అధికారాన్ని పొందాలని అనుకుంది. ఆ సంకల్పం విఫలమయ్యి 2009 ఎన్నికలలో  ఘోరంగా పరాజయం పాలయ్యింది. ఇది అప్పుడప్పుడే రాజకీయం శక్తిగా ఎదగాలనుకున్న కాపుల ఆకాంక్షను అనూహ్యంగా దెబ్బతీసింది. ఈ లోపు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చనిపోవడం, జగన్‌ మరో పార్టీ పెట్టడం అందులోకి రెడ్లు, దళిత వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు వెళ్ళిపోవడంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది.ఈ దెబ్బతో ముక్కలు చెక్కలుగా వున్నకాపు ఉపకులాల్పి ఏకంచేసే బాధ్యతను బొత్స తన భుజాన వేసుకున్నాడు. ఒకే దెబ్బకు రెండు పిట్టలుగా కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కాపాడాలన్న నెపంతో తన కాపు వర్గాన్ని బలపరచటానికి బొత్సాసత్యనారాయణ (పిసిసి అధ్యక్షుడు కూడా) నడుము బిగించాడు. దాంతో రెండేడ్లలోనే ప్రజారాజ్యాన్ని గాలికొదిలేసి చిరంజీవి కాంగ్రెస్‌లో కలిసిపోయాడు. యిలా  రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ సమీకరణలు కాపులకు వరంగా పరిణమించాయి. ఈ నేపథ్యంలో కాపులు మొత్తంగా అన్ని రంగాలను తమ ఆధిపత్యంలోకి తెచ్చుకునే ప్రయత్నాల్లో భాగంగానే లక్షింపేట దాడి జరిగిందని మనం అర్థం చేసుకోవాలి.
 పథకాలు, పాలసీలు, ఎన్నికలు అన్ని కూడా కుల వ్యవస్థను బలపరచాయే తప్ప  బలహీనపర్చలేదు. శ్రీకాకుళంలో  నెలకొల్పుతున్న విద్యుత్‌ ప్రాజెక్టులో ఎక్కువభాగం లబ్ది పొందింది రెడ్లు, రాజులు, కమ్మలే. అలాగే చంద్రబాబు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో సెజ్‌లే పేరిట జరిగిన భూపంపకాలలో లాభపడింది వారే. కాబట్టి తమ వాటాకోసం కాపులు బొత్స నాయకత్వంలో ఏకమయ్యేందుకు సిద్ధపడ్డారు. జిల్లాపై తమ అధిపత్య పట్టును బిగించారు. అందుకే గత పది ఏళ్ళుగా భూవివాదం లక్షింపేటలో వున్నా కాపులు దళితులపై దాడిచేయడానికి ఇప్పుడు సిద్ధపడ్డారు. అధికారాన్ని హస్తగతం చేసుకునే దిశలో పయనించడం, రాష్ట్రంలో వారి ఉపకులాల ఐక్యత కాపులను దోపిడి దౌర్జన్యాలకు పాలు పడటానికి ప్రేరేపించాయి. భూమిలేని పేద కులాలు వలస వెళ్ళుతున్న కొద్ద్ది గ్రామాలు, భూమి కాపు కులాల సొంతం అవుతూ వచ్చాయి. శ్రీకాకుళం, ఎచ్చర్ల, కోట బొమ్మాళి, హీరా, ఆముదాలవలస, ఎల్‌ఎన్‌ పేట మండలాల్లో సైతం కాపు వర్గానికి చెందినవారు దళితులపై దాడి చేసి తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ వున్నారు. ఇందుకు పాలనాయంత్రాంగం సహకారం కూడా వుందనటానికి జూలై 6న పాలకొండలో లక్షింపేట దాడి నాయకుడు బొత్స వాసుదేవనాయుడిని అరెస్ట్‌ చేసినందుకు ధర్నా చేసినవారిని అరెస్ట్‌ చేయకపోగా వారికి సహకరించారు. చంపబడ్డ జనం తాలూకూ వాళ్లేకాదు, చంపినవారు సైతం ధర్నాలు చెయ్యగలిగే ప్రజాస్వామ్యం మనది.
రాజ్యాంగ యంత్రం కుమ్మక్కు
కులం పేరుతో జరిగే దాడుల్ని పరిశీలిస్తున్నపుడు సామాజిక సంబంధాల్లో  హిందూ కులాల మధ్య కొనసాగుతున్న అసమానత ఉన్నది, దళితులకు రాజ్యాంగపరమైన మద్దతు, రక్షణ యంత్రాంగం వున్నప్పటికీ ఈ అసమాన దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. సామాజిక సంబంధాల్లో అసమానత కొనసాగడం కులవ్యవస్థ అంతర్గత లక్షణం. దళితులు ఈ అసమానతని అణచివేతని అంగీకరించినంత కాలం ఏ వివాదం ఉండదు. సామాజిక సంబంధాల చలనం సాధారణంగా ఆయా కులాల, వర్గాల బలాన్ని బట్టి రెండు శిబిరాలుగా కొనసాగుతుంది. రాజ్యం కీలకపాత్ర పోషిస్తూ రక్షణ యంత్రాంగం ద్వారా దళితుల అభ్యున్నతికి తోడ్పడాలి. కాని మొత్తంగా దళితులపై జరిగిన దాడుల్ని పరిశీలిస్తే రాజ్యాంగం యిచ్చిన అన్ని భద్రతా చర్యల విషయంలో రాజ్యాం వైఫల్యం నిర్లక్ష్యం కన్పిస్తుంది. రాజ్యాం పూర్తిగా పాలక వార్గల సేవలో కుల సంబంధాల్ని కొనసాగించడంలో నిమగ్నమైంది.  అందుకే దాడికి కొన్ని రోజుల ముందే లక్షింపేట దళిత పోలీస్‌స్టేషన్‌ వున్న దళిత అధికారిని వేరే స్టేషన్‌కు ఉద్ధేశపూర్వకంగానే బదిలీ చేసారు.ఈ రాజ్యాన్కి వుండే అగ్రకుల ఆధిపత్య స్వభావం వలన దళితులపై జరిగిన దాడుల అనంతరం ఎవర్ని వెంటనే అరెస్టు చేయలేదు.   వేసేంతవరకు ఇతర  ప్రజాస్వామిక సంఘాలు ప్రతిఘటించే వరకు అసలైన ముద్దాయిని అరెస్ట్‌ చేయ్యలేదు. దాడుల అనంతరం కూడా ములాఖత్‌ స్పష్టంగా తెలుస్తుంది. దాడులు జరిపినపుడు కేసు నమోదు చేయకపోవడం, సాక్ష్యాధారాలను ఘటన స్థలంలోనే వదిలెయ్యడం, నేరస్థుల కొమ్ముకాయడం చేస్తున్నది. ఈ దాడుల్ని నిలవరించడంలో రాజ్యాం పాత్ర ఏ మేరకు పెరిగినా కారంచేడు సంఘటన మళ్ళీ మళ్ళీ తిరగబడేవి కావు.
చట్టాలు/భూస్వామ్య ఆధిపత్య హిందూ కులాల చుట్టాలు
ఓటు బాంకు రాజకీయ ప్రయోజనాలకోసం కొన్ని రక్షణ చట్టాలను దళితులకు చేయవలసిన అవసరం ఏర్పడింది.  అది ఎస్‌.ఎసి. అట్రాసిటీస్‌ చట్టం (1989).  ఎన్ని దాడులు దళితకులకు జరిగినా కేవలం 30% మాత్రమే రిజిస్టర్‌ అవుతున్నాయి. కేంద్ర సామాజిక న్యామంత్రిత్వశాఖ పార్లమెంట్‌ స్థాయిసంఘం స్వయంగా ప్రకటించినట్లుగా 80% కేసులు పెండింగ్‌ వున్నాయంటే  రాజ్యం యొక్క  పక్షపాత ధోరణి తేటతెల్లమయ్యింది. ఈ చట్టం నియమాలు 1995 ప్రకారం ఆరునెలలకొకసారి ముఖ్యమంత్రి  ఆధ్వర్యంలో పర్యవేక్షణ కమిటీ రాష్ట్రస్థాయి సమావేశం జరగాలి. అలాంటి సమావేశాలు జరిగి చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేక కాబట్టే ఈనాడు కారంచేడులు మళ్ళీ మళ్ళీ చరిత్ర తెరమీదకొస్తున్నాయి. ఓట్ల కోసం చేసే ఫీట్లు చేసే అగ్రకులా రాజకీయ నాయకులు సమావేశాల పట్ల దళితులకు భ్రమలు లేవు. కాని అసలైన సూత్రధారి బొత్స సత్యనారాయణను అరెస్టు చేయటానికి ఈ చట్టం ఉపయోగపడలేదంటే రాజ్యం యొక్క పాత్ర స్పష్టంగా తెలుస్తుంది. బాధితుల్ని అణచివేయ డానికి పోలీసులు ప్రారంభంలో చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసారు. ఇందులో బొత్స సత్యనారాయణ రాజకీయ ప్రాబల్యం, డబ్బు ప్రధానపాత్ర పోషించాయి. దళితులతో జరిగే  ఏ వ్యవహారంలో నైనా తమకెవరూ అడ్డు చెప్పరన్నది ఆధిపత్య కులాలవాళ్ళకు తెలుసు. లక్షింపేటలో దోషులని గుర్తించిన కూడా ఈ మద్దతు హామీ కన్పించడంతో దళితులు తమకు ప్రత్యేక కోర్టును అదే గ్రామంలో పెట్టి విచారణ చేయాలన్న డిమాండ్లను చేస్తున్నారు. ఇంత జరిగినా నిజమైన నేరస్థులు శిక్షింపబడతారా అన్నది ఎవరూ ఖచ్చితంగా చెప్పలేని విషయం.
ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన పోలీస్‌ వ్యవస్థ
లక్షింపేట ఘటన జరిగినప్పుడు, తదనంతర  ఆధిపత్య, దాడుల్లో పోలీసులు కుల ఆధిపత్యాన్కి అండగానే నిలిచారు.
భూవివాదంలో ఎన్ని సార్లు  కేసులు నమోదు చేయమని పోలీసుల్ని అభ్యర్థించినా కోరినా కేవలం నాలుగు కేసులే నమోదు చేసారు. పోలీసులు మొత్తం ఘర్షణల క్రమాన్ని, వివాదాల్ని దృష్టిలో ఉంచుకొని వ్యవహరించి ఉంటే లక్షింపేట ఘటన జరిగి వుండేది కాదు. కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలో వున్న పోలీసులు ఘటనా స్థలానికి వెంటనే రాలేదు ఇది చాలా అసాధారణంగా కన్పించినా జరుగుతున్నది అదే.
దళిత బహుజన ఉద్యమాల దశ-దిశ
అస్థిత్వ ఉద్యమాలు కారంచేడు మారణహోమం తర్వాత ఊపందుకున్నాయి. అప్పటివరకు కేవల అంబేద్కర్‌ సంఘాలుగా వున్న దళితుల్ని ‘దళిత మహాసభ’ ఏకం చేసింది. ఆ తర్వాత  చుండూరు, నీరుకొండ, పదిరికుప్పం దాడుల్ని నివారించడంలో తిరుగులేని శక్తిగా ఎదగలేకపోయింది. కారణం అస్థిత్వ ఉద్యమాలు రాజకీయనాయలకు ప్రయోజనం చేకూర్చాయి. దళిత ప్రజానికానికి మాత్రం ఉట్టి నినాదాలు, బోలు చిహ్నాలు తప్ప ఏమి మిగలలేదు. దళితుల్ని ఎదుర్కొంటున్న సమస్యల్ని గుర్తించడం , పరిష్కరిచండం కాకుండా అస్థిత్వ రాజకీయాలకు పాలకవర్గ రాజకీయాల్లో భాగంగా చేసారు. అందుకు ఉదాహరణగా రాష్ట్రంలో జరుగుతున్న అనేక విస్థాపన ప్రాజెక్టులలో ఉపాధిని, భూమిని కోల్పోతున్న దళితుల పట్ల ఏ దళిత సంఘాలు యిప్పటివరకూ అండగా నిలబడలేదు వాస్తవానికి కాకినాడ సెజ్‌, వాప్‌సిక్‌ , కోస్టల్‌ కారిడార్‌ ప్రాజెక్టులలో కొందరు దళిత నాయకులు దళితుల ప్రయోజనాలు  దెబ్బ తీస్తూ పాలకవర్గాలతో  మిలాఖాత్‌ అయ్యి ఉద్యమాన్ని దెబ్బతీయడం మాత్రమే కాకుండా జాతి భవిష్యత్తుని పాలకవర్గాలకు తాకట్టు పెట్టారు. ఈ కారణం వల్లనే ప్రత్యామ్నాయ రాజకీయాలను దళితులు దరిచేరనివ్వటం లేదు.
గత ఆర్నెళ్ళ క్రితం రాష్ట్రంలో అంబేద్కర్‌ విగ్రహానికి  అవమానం జరిగితే రాష్ట్రమంతా వెల్లువెత్తిన ప్రజానికం  ప్రభుత్వం దిగివచ్చేదాకా నిరసనను కొనసాగించింది. ఈ విషయంలో వచ్చిన ప్రతిస్పందనలతో పోలిస్తే లక్షింపేటను ఖండిస్తూ వచ్చిన స్పందన తక్కువే. విగ్రహానికి జరిగిన అవమానం అందుకు  తీవ్రంగా వచ్చిన స్పందన, ఆగ్రహం దారుణ అవమానాలను, హత్యకు గురైన మనుషుల విషయంలో రాలేదు. దీన్ని బట్టి చూస్తే అస్థిత్వ చిహ్నాల పట్ల ఉన్న స్పందన సజీవమైన మనుషుల విషయంలో లేకపోయింది. ఇక్కడ రెండు అనుకూల ప్రతికూల ప్రభావాన్ని గమనిస్తాం. దళిత పోరాట వారసత్వ చిహ్నామైన అంబేద్కర్‌ విగ్రహం భావితరాల్ని పోరాటంలో ఉత్తేజపరచటం ఒకటైతే అంబేద్కర్‌ దేవుడై పోవడం రెండవది నిజానికి పాలకవర్గాలు రెండవ అంశాన్నే ఆసరా చేసుకుని మరింతగా మత ప్రచారంలా అంబేద్కర్‌ విగ్రహాల్ని ప్రతిష్టింపచేసి ఆయన ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారు.
 ఇలాంటి అనేక విషయాల్ని లక్షింపేట  బయటపెట్టడమే కాదు దళిత శక్తులు పునరాలోచించుకునే దిశను చూపించింది. వ్యూహాత్మకంగా చూస్తే  దళిత ఉద్యమాలు ప్రజలతో కలిసి తమ ప్రాముఖ్యాంశాలను ఖచ్చితంగా తేల్చుకోవలసిన సమయం ఆసన్నమైంది ఆత్మగౌరవం పట్ల అంబేద్కర్‌ విగ్రహానికి జరిగిన అవమానాన్ని సహించని మన సున్నిత స్పందన సజీవ మనుష్యులపట్ల  దర్శించగలిగినపుడే సరైన చైతన్యాన్ని ప్రదర్శించిన దళిత ఉద్యమం ఆవిర్భవిస్తుంది.కాని దాడులకు మూలకారణమైన సామాజిక ఆర్థిక అంశాల్ని గుర్తించడంవల్ల తమ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందనే ఉద్దేశం తోటే నాయకులు వాటిని గుర్తించ నిరాకరిస్తారు. అందుకే లక్షింపేట గ్రామ సర్పంచి దళిత స్త్రీకు ఎన్ని అవమానాలు ఎదురైనా అక్కడి దళిత సంఘాలు ఎలాంటి చర్యలు తీసుకులేకపోయారు. లక్షింపేట నియోజక వర్గ ప్రజాప్రతినిధి రాష్ట్రమంత్రి  కొండ్రు మురళి దళితుడైనా రాజ్యం చేతిలో కీలుబొమ్మాయ్యాడు.
యింకో వైపు రాజ్యాధికారం లక్ష్యంతో పార్లంటరీ రాజకీయ పార్టీలు ఎన్నికలలో మెజార్టీ కోసం దళిత బహుజనులను ఒక గాడిన కట్టడం జరుగుతుంది. కాని యిప్పటికీ గ్రామాలలో వారి మధ్య అనేక వైరుధ్యాలు వున్నాయి. దళితుల బట్టలు ఉతకని చాకళ్ళు, సామాజికంగా దరిచేరని బి.సి కులాలు గ్రామాల్లో వున్నారు.  అందులో లక్షింపేట తూర్పు కాపులు వున్నారు. వీరు సామాజికంగా బి.సిలు అయినా బ్రాహ్మణ వాదానికి ప్రతినిధులు. వారి సామాజిక ఆర్థిక పునాదులు మిగతా భూ సొంతదారులతో సంబంధాలు తీసుకుంటే దళితులతో కలిసి బహుజనంగా అధికారంకోసం జరిగే సమీకరణలో భాగం కాగలరా? బి.సి కులాల మహాజనసభ నాయకులు ఉ. సాంబశివరావు వ్యవసాయాధారిత తూర్పు కాపులను బి.సిల నుంచి ఎత్తివేయాలని డిమాండ్‌ పెట్టారు. మరి తెలంగాణాలోకి మున్నూరు కాపుల సంగతేమిటి? ఉత్తరాంధ్రలో, తెలంగాణలో కాపులు బి.సిలు అయితే కోస్తా, రాయలసీమలో కాపులుగా  ఓసిలు వున్నారు..  అసలు 1956 వరకు అన్ని కాపులకులాలు  బిసిలుగా వున్నాం కాబట్టి అన్ని ప్రాంతాల కాపుల్ని  బిసిలుగా చేర్చాలన్న  కాపునాడు డిమాండుకు ప్రపంచీకరణ కులాన్ని పొగుడుతుందనే భ్రమలో వున్న బహుజన ఉద్యమం ఏమీ సమాధానం చెబుతుంది?
వాస్తవానికి నిచ్చెనమెట్ల కుల సమాజంలో దళితులు తక్కువవారనే ధోరణి, దళితులపై దాడి జరిపినా తమ సామాజిక, రాజకీయ బలాలతో బయటపడవచ్చన్న  భరోసా ఆధిపత్య కులాలకు పెరుగుతుండగా బాధితులకు న్యాయవ్యవస్థ మీద ఆధిపత్య కారణాలపై నమ్మకం సన్నగిల్లుతుంది. దళితుల ఆత్మరక్షణకు ఆయుధాలు యివ్వాలని, ప్రతిహింస జరగాలని, కారంచేడు తిరగబడాలన్న వాదనలు విన్పిస్తున్నాయి. భూమి వాటి వనరుల ఆధిపత్యంపై  కొన్ని కులాల నుండి తప్పించగలమా అన్నది నేటి ప్రశ్న. స్వాతంత్య్ర ప్రకటన తర్వాత దళితులకు యిన్నేళ్ళు అయినా భూ సంస్కరణల పేరిట దోబుచులాటే తప్ప భూమిపై హక్కు ఏర్పడలేదు. అందుకే 2004లో నక్సల్స్‌కు ప్రభుత్వంకు మధ్య జరిగిన చర్చలలో వారి ఉనికి కంటే భూసమస్యపైనే  ఎక్కువ దృష్టిపెట్టారేమో!  దళిత బహుజన దార్శికుడు డా. బి. ఆర్‌ అంబేద్కర్‌ చెప్పినట్లు భూవనరులను జాతీయం చెయ్యగలమా? అలా జరిగినట్లయితే ఈ కులవ్యవస్థ యొక్క మూలాలు కదిలేవి.  పాలకులకు తమ స్వార్థ ప్రయోజకులకు అది అడ్డుకట్ట. అందుకే యింతటి విప్లవాత్మ ఆదరణకు భారత రాజకీయవ్యవస్థ పూనుకోలేదు. కాబట్టే బలిమి కల్గిన కులాలు భూమిని, మార్కెట్టును శాసిస్తున్నాయి.
పాలనాయంత్రాంగంలో దళితులు అధిక సంఖ్యలో ఉన్నారని వాళ్ళు దళితులకు న్యాయం చేస్తారని కాన్షిరాం తెచ్చిన బహుజన రాజకీయాలతో సహా అనేక భ్రమల్ని బ్రద్ధలు కొట్టింది లక్షింపేట. ఇక్కడ సర్పంచ్‌ దళిత స్త్రీ, అప్పటివరకు వున్న పోలీస్‌ ఆఫీసర్‌ దళితుడే, యింకా అనేక మంది ఐఎస్‌ఎస్‌, ఐపిఎస్‌ దళిత అధికారులు వున్నారు. అయితే లక్షంపేట విషయంలో మొత్తం రాజ్యం వైఫల్యం వుంది. దళిత అధికారలు అంతా వ్యవస్థలో ఒక భాగమే. ఒక దళితుడు ఉన్నాతాధికారిగానో పాలనా యంత్రాంగంలోనో ఉంటే దళిత ప్రయోజనాలను కాపాడుతాడనుకోవడం అమాయకత్వమే. ఈ  అమాయకత్వమే దళితుల్ని రాజకీయ అచేతనానికి నెట్టేెసింది. వ్యక్తులుగా ఎంత ఉన్నత స్థితిలో వున్నా సమాజాన్ని మార్చలేరని, వాళ్ళ సమిష్టి రాజకీయ ఆచరణ మొత్తం సమాజాన్నే మార్చుతుందని, ఆ పోరాటం సమాజంలోకి అన్ని రంగాలకు ప్రభావితం చేస్తుందని విషయం మర్చిపోయారు. అందుకే భౌతిక వాద తాత్వికతో వచ్చిన సామాజిక ఉద్యమాలనుండి చారిత్రకంగానే దళిత ఉద్యమాలు దూరమయ్యాయి. ఈ తిరోగమన ఆలోచనా విధానం సమిష్టి మనుగడకు తీరని నష్టం చేసింది. ఫలితంగా కారంచేడు పునరావృతమయి లక్షింపేట మారణహోమంగా ముందుకు వచ్చింది. అందుకే దళిత బహుజన ఉద్యమాలు కార్మిక వర్గంతో మొత్తంగా కదలాలంటే కుల పునాదులు పెకిలించాలంటే ఏ సమీకరణ అవసరం అన్నది ప్రశ్నించుకోవాల్సిన సందర్భం యిది. నయా ఉదారవాదం సామ్రాజ్యవాద ప్రపంచీకరణలో అన్ని విధాల నష్టపోతున్న దళిత బహుజనుల, ఈ ఉద్యమాలకు సరైన దిశ నేడు  అత్యవసరం.
 లక్షింపేట మరిన్ని వైవిధ్యాల్ని మన ముందుంచింది.  ఒకటి దళిత బహుజనులతో భాగమైన స్త్రీలు లక్షింపేట దమనకాండలో ప్రత్యక్షంగా పాల్గొనటం, రెండు మహిళా సమస్యల్ని ఫెమినిస్టు ఫిలాసిపితో దోపిడీ మూలాల్ని వెతుక్కునే స్త్రీ ఉద్యమం, అల్ప సంఖ్యక వర్గాల  హక్కులకై పోరాడే మైనార్టీల ఉద్యమాలు  లక్షింపేట పోరాటాలకు  బాసటగా నిలుస్తాయని ఆశించిన దానికి భిన్నంగా జరగడం. లక్షింపేట దమనకాండలో అదే గ్రామానికి చెందిన పలాస ఉమ, కేతు లక్ష్మికాంతన్డు, ఆవు కళ్యాణి, గండేడి కళావతి, గంటాడి లక్ష్మి, కేతు రాములమ్మ, గొలుసు పద్మ మొదలగు మహిళలు భర్తలకు సహకరిస్తూ ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఈ ట్రెండ్‌ ఈ మధ్యకాలంలో భైర్లాంజి సంఘటన (2006) నుంచి ఎక్కువయింది. అంతకుముందు సామాజిక దాడులతో అణగారిన వర్గాల స్త్రీలు ధన, మానాలు పురుషుల చేతుల్లోనే పోగొట్టుకునేవారు. మరి లక్షింపేట విషాదం గురించి ఏమనుకోవాలి?
 స్త్రీలకు స్త్రీలే శత్రువులని, ఆడది బాల్యంలో తండ్రి చాటున, యవ్వనంలో  భర్త చాటున, వృద్ధాప్యంలో కొడుకు చాటున, నస్త్రీ స్వాతంత్య్రం మర్హతి అని నూరుపోసిన పితృస్వామిక సమాజం ఇది. మార్కెట్‌ ఆధారిత వ్యవస్థ కులాన్ని తమ ప్రయోజనాలకు వాడుకున్నట్టే పితృస్వామ్య భావజాలాన్ని తమ ప్రయోజనాలకు వాడుకొంది. ఉన్నత విద్య, పట్టణీకరణ కూడా తమ స్వంత ప్రయోజనాలికి పెట్టుబడిదారి విధానం ఉపయోగించుకుంది. అందుకే స్త్రీని ఒక వైపు అంగడి సరుకుగా మరోవైపు భర్త వుండే వర్గానికి అనుకూలంగా మార్చివేసి, పోటీ సమాజంలో వీరిని దోషులుగా నిలబెడుతుంది. అందుకే స్త్రీవాదులు అన్నట్లుగా స్త్రీలు అంతా ఒక వర్గంగా లేరు. ఎన్నో వర్గాలుగా విడిపోయి సమాజంలో ఆయా సామాజిక వర్గాల్లో భాగంగా దళిత, బి.సి, ఆధిపత్య కులాల స్త్రీలుగా విడిపోయి ఆ వ్యవస్థ లక్షణాలకు ప్రతినిధులుగా మారిపోయారు.
దళిత అంటే విడగొట్టబడిన, అణచబడిన అనే అర్ధంలో స్త్రీలు కూడా వున్నారు. లక్షింపేట తూర్పు కాపు స్త్రీలు యిందుకు మినహాయింపు కాదు. వాస్తవానికి దాడిలో పాల్గొన్న స్త్రీలకు  భూమిలో హక్కు  లేదు. కుటుంబంలో  వివక్షతకు గురికానివారు కాదు. కాని పితృస్వామ్యపు భావజాలంపట్ల అవగాహన లేని వారు తమ మగవారి వెంట నడవడమే కాకుండా హింసతో కూడిన చర్యలు దాడిలో చేపట్టారు. వారిలో స్వార్ధం లేదనటానికి వీలులేదు. కాని స్వార్థం కంటే పితృస్వామ్యపు భావజాలం, పోటీ తత్వపు ప్రపంచీకరణ ప్రభావం వారిని ముందుకు నడిపించిందేమో!.
మరో వైపు చూసినట్లయితే విస్థాపన ఉద్యమంలో భూమిని కాపాడుకోవటానికి ప్త్రీలు విరివిగా పాల్గొన్నారు. కాకినాడ వ్యతిరేకసెజ్‌ మహిళా పోరాట కమిటి ఏర్పడింది.  బొంబాయి  మహాసెజ్‌ వ్యతిరేక ఉద్యమకారిణి, ఉల్కా మహాజన్‌, మంగూళూరు సెజ్‌ వ్యతిరేక ఉద్యమకారిణి విద్యా నటేశన్‌, గోవా సెజ్‌ వ్యతిరేక ఉద్యమ కారిణి స్వాతి కేల్కర్‌ యిలా ఎందరో తమ ఉద్యమ ఆచరణలో ముందున్నారు.  ముస్లిం స్త్రీలపైన దాడులు గుజరాత్‌లో, హైద్రాబాద్‌లో యింకా యితర ప్రదేశాలలో జరిగినపుడు, క్రైస్తవ మైనార్టీ స్త్రీలపై మంగళూరులో బిజెపి ఆధ్వర్యంలో జరిగినప్పుడో మైనార్టీ ఉద్యమకారులు స్పందించారు. ఈ మధ్యకాలంలో చంద్రబాల అనే సోషల్‌వర్కర్‌ పై ఒక ఛానల్‌ అంభాండాలు వేసినపుడు, తారాచౌదరి అనే స్త్రీ  వ్యభిచార వివాదంలో యిరుక్కునప్పుడు స్త్రీవాదులు, స్త్రీ సంఘాలు స్త్రీల హక్కులకై ప్రశ్నించారు. కాని లక్షింపేట మారణహోమంలో  ఒక వర్గానికి చెందిన స్త్రీలు,  మరో వర్గంలోని స్త్రీలపై దాడి చేస్తే ఎందుకు స్పందించలేదు? ఈ ఘటనను ఏ కారణాలచేతనో తీవ్రంగా ఖండించలేదు?  స్త్రీ ఉద్యమం స్త్రీవాద దృక్పథంతో స్త్రీలకు  అవగాహన కల్పించడంలో ఎందుకు విఫలమవుతుంది? లక్షింపేట వ్యతిరేక ఆందోళనలు జరిగినపుడు వారు దళితులకు మద్దతు తెలపాల్సింది. మరికొంతమంది మర్యాదపూర్వకమైన ప్రగతిశీల నిరసన తెలియచేసారు. ఈ ప్రగతిశీలశక్తులు మైనార్టీలు, స్త్రీల అణచివేత విషయంలో స్పందించినంతగా కుల అణచివేత విషయంలో స్పందించడంలేదు. దీన్ని బట్టి చూస్త్తే భారతదేశంలో ప్రగతి శీల భావనలోనే కుల వ్యతిరేకత ఉండే అవకాశం లేదోమోనన్పిస్తుంది. స్త్రీవాద, మైనార్టీ  ప్రగతిశీల భావాలుగల వారు మరొక్కసారి ఆత్మావలోకం చేసుకోవ డానికి లక్షింపేట ఒక సందర్భం కావాలి.
అందరూ  డిమాండ్‌ చేస్తున్నట్లుగా సిబిసిఐడి విచారణ, ప్రత్యేక కోర్టులకంటే దాడుల మూలాలను లక్షింపేట బాధితులు ప్రశ్నిస్తున్నారు. అన్యాయపు వ్యవస్థను నిలదీస్త్తున్నారు. శూద్ర, దళిత కులాలు ఐక్యమై సీట్ల బలంతో అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న బహుజన రాజకీయాల పగుళ్ళ తీవ్రతను లక్షింపేట మరొక్కసారి రుజువు చేసింది. ఆయా కులాల స్థితి వల్ల దళిత బహుజనులు ఐక్యమవుతారడంలో సందేహం లేకపోయినా  అవర్ణ, (దళితులు) సువర్ణ (శూద్రులు)ల మధ్య వున్న అనేక అనైక్యతలను ఈ దాడి తేటతెల్లం చేసింది. ఈ అనైక్యత నిరోధించాలంటే  పూర్తిగా భిన్నమైన మార్గాన్నే అనుసరించాలి. అది వర్గ దృక్పథం.
అభివృద్ధి అంటే సామాజిక సంబంధాలలో మార్పుని, ఉత్పతి చేయగలిగిన శక్తి సామర్థం ఉండి, ప్రపంచీకరణ ఉత్పత్తి సంబంధంలో భాగం కానివ్వని హిందూకులాల దురహంకారానికి బలైన దళితులు భూమి వాటి వనరుల ఆధిపత్యం కోసం రాజీలేని పోరాటం చెయ్యడమే ఏకైక మార్గం. అభివృద్ధి, కుల రాజకీయ గుట్టు విప్పుతూ కార్మిక, కర్షక, విద్యార్థి మేధావి బాధిత వర్గాలతో భుజం భుజం కలిపి తమ విముక్తి కోసం ఉద్యమించడమే దళిత బహుజనుల కర్తవ్యం. (రచయిత మానవ హక్కుల కార్యకర్త, లక్షింపేట బాధితుల న్యాయవాది)
Share

About The Author

Saturday, July 21, 2012

హేమావెంక్రటావ్‌
తూర్పు తీరంపై విరుచుకుపడ్డ సునామీలా మొదలైన ‘కాకినాడ సెజ్‌’ ఇప్పటికే అనేక గ్రామాల్ని మింగేసింది. ఇళ్లన్నీ కూల్చివేయబడ్డాయి. విలువైన జీడి మామిడి, సరుగుడు తోటలు సమూలంగా నరికివేయబడ్డాయి. పచ్చని పొలాలు బీడుపడిపోయాయి. మొత్తంగా తనకు కావాల్సిందంతా తానే ఉత్పత్తి చేసుకొనే పటిష్టమైన అఖండ వ్యవస్థ కలిగిన పల్లెలు సర్వనాశనం అయ్యాయి. అపురూపమైన మానవ సంబంధాలకు ఆలవాలమైన ప్రశాంత జీవితాన్నే కోల్పోయిన సెజ్‌ బాధితులు;
ఏప్రిల్‌ 10న (2012) ”ఎవడు వాడు? ఎచటివాడు? ఇటు వచ్చిన సెజ్‌ వాడు…” అంటూ అల్లూరి పోరాట స్ఫూర్తిని స్పురణకు తెచ్చారు. వివరాల్లోకి వెళితే, కాకినాడ సెజ్‌ ప్రతిపాదిత గ్రామాలు గత రెండు మూడు నెలలుగా సెజ్‌కి వ్యతిరేకంగా ఎక్కడికక్కడ వంటావార్పు, నిరసన కార్యక్రమాలు చేస్తూ వున్నారు. మోసపూరితంగా, బలవంతంగా సెజ్‌ వారు లాక్కున్న తమ భూముల్లో రైతులు, మహిళలు, పిల్లా పాపలతో ఏప్రిల్‌ 10న ఎరువాక నిర్వహిస్తుంటే, వారిని అడ్డుకునేందుకు పోలీసులు దిగబడ్డారు. అప్పటికే అటు ప్రభుత్వం చేత, సెజ్‌ యాజమాన్యం చేత మోసానికి గురి కాబడ్డ ప్రజలకు పోలీసులను చూసేసరికి అరికాలి మంట నెత్తికెక్కినట్లయ్యింది. ”మా భూములు మేము దున్నుకుంటుంటే అసలు మీరు రావాల్సిన పనేంటి అసలు మిమ్మల్ని ఎవరు పంపించారు. విషయం తేలేదాకా ఇక్కడ్నించి కదలనివ్వం అంటూ పోలీసు వాహనాల చుట్టూ మంటలతో గిరి గీసి చుట్టుముట్టారు. అంతలోనే అక్కడికి చేరుకున్న అదనపు పోలీసు బలగాలను కూడా రాళ్ళతో, కర్రలతో తిప్పికొట్టారు. కాకినాడ సెజ్‌ ప్రతిపాదిత రమణక్కపేట గ్రామంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనగా తిరిగి రగిలిన పోరాట జ్వాల ఇది.
ఈ ప్రజా పోరాటాల వేడిని ఓట్లుగా మల్చుకొనే కుట్రలో భాగంగా ఉప ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే రైతుల భూములు తిరిగి ఇస్తామంటున్నారు. కాని మిగులు భూములు, అసైన్డ్‌ భూములు పేదలకు పంచి, దాని యాజమాన్యం కుటుంబంలోని మహిళలకు ఇవ్వాలని, దానిని అమలు చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. కాని కేంద్రంలో ఉన్న పార్టీలైన, రాష్ట్రంలో ఉన్న పార్టీలైన ప్రపంచీకరణలో భాగంగా వస్తున్న సంస్కరణలకు వత్తాసు పలుకుతున్నవారే అన్న విషయాన్ని ప్రజలు ఎలా మర్చిపోతారు.
ఏ రాజకీయ శక్తులైనా, వ్యవస్థలైనా బానిస ఫ్యూడల్‌ వ్యవస్థలో భూమిని వాడుకున్నారే కాని, ఇంతగా భ్రష్టు పట్టించలేదు. అందుకే సెజ్‌లను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన ప్రొఫెసర్‌ ఆర్‌.ఎస్‌. రావు వివరణ ఈ సందర్భంగా ఎంతో సరియైనది. కమ్యూనిస్టు దేశాలు ఒక అడుగు వెనక్కి వేసిన కాలంలో పెట్టుబడి తనదైన శైలిలో ప్రవేశపెట్టిన ప్రపంచీకరణ కార్యక్రమంలో సెజ్‌లు అత్యంత ముఖ్యమైన స్థానాన్ని కలిగి వున్నాయి. సోషలిస్టు సమాజాలను పునర్మించే కార్యక్రమంలో అంతరాష్ట్రీయ పెట్టుబడి ఎంచుకున్న రూపం సెజ్‌. ఈ పునర్‌ నిర్మాణ కార్యక్రమంలో మిగిలిన సమాజం దాని చరిత్రతో సంబంధం లేకుండా ప్రభుత్వ ఆధిపత్యానికి దూరంగా స్వచ్ఛంగా పెరిగినవే ఈ సెజ్‌లు అంటారాయన. నిజానికి ప్రజల ఆకాంక్ష అభివృద్ధి అయితే, పాలక వర్గాల ఆకాంక్ష అభివృద్ధి. పాలకులు పెట్టుబడి ద్వారా వృద్ధిని వ్యవస్థాగత మార్పులు లేకుండా తేవాలని చూస్తుంటే, ప్రజలు వ్యవస్థలో మార్పు ఒక కొత్త నిర్మాణంలోని అభివృద్ధిని చూస్తున్నారు. ఇది పాలకులకు, ప్రజలకు మధ్య వున్న వైరుధ్యం. అభివృద్ధి అనే భావనను నెట్టేసి వృద్ధి అనే భూతాన్ని చూపి, అదే అభివృద్ధిగా చూపిస్తున్నాయి ఈనాటి పాలక వర్గాలు. ఇంకా ముదునూరి భారతిగారి మాటల్లో చెప్పాలంటే ప్రత్యామ్నాయ అవకాశాలు నూతన సమాజంలో సాంకేతిక నైపుణ్యంతో కూడినది కాబట్టి నిర్వాసిత ప్రజలకు స్థానం లేకుండా పోయింది. పాత సమాజం నుండి క్రొత్త సమాజంలోకి నెట్టివేయబడ్డవారికి స్థానం లేక ఒక అడ్డంకిగా మిగులు మనుషులుగా మిగిలిపోతారు. ఈ పారిశ్రామికీకరణ కాలంలో వృద్ధి సాధ్యపడినా మిగులు  మనుషుల సమస్యలు తీరకపోవడం, పేదరికం, నిరుద్యోగంలో ప్రభుత్వ పెట్టుబడిదారి వర్గాల దయాదాక్షిణ్యాల మీద బతికేవారిగా, అడ్డంకిగా చూడడం జరుగుతుంది.
చరిత్రలోకి వెళితే 2008 నుంచి సెజ్‌ కాకినాడ సెజ్‌ వ్యతిరేక పోరాటం మార్చి 8 పోరాట స్ఫూర్తితో పెద్ద ఎత్తునే ప్రారంభమయ్యింది. నాయకులపై అనేక కేసులు, అక్రమ అరెస్టులు మొదలయ్యాయి. ఇప్పటికీ నాయకులు కోర్టుల చుట్టూ తిరగుతూనే వున్నారు. అయితే ఈ పోరాటంలో అత్యధికంగా పాల్గొన్నది స్త్రీలే. పోలీసులు గ్రామాలపై విరుచుకుపడితే, తామే ముందుగా తమ వారిని కాపాడుకోవటంతో పాటు అనేక విషయాలను చర్చించుకునే వారు. ప్రజలు ప్రకృతి వనరులను పోగొట్టుకోవడంతో పాటు దానికి సంబంధించిన జ్ఞానాన్ని కూడా పోగొట్టుకుంటారు. వ్యవసాయానికి బదులు పారిశ్రామికీకరణే ప్రత్యామ్నాయంగా వచ్చే సమాజంలో కొత్త నైపుణ్యానికి వుండే జ్ఞానం కొరవడుతుంది. సెజ్‌ పేరిట జరిగే ఈ భూసేకరణ వల్ల స్త్రీలే ఎక్కువగా నష్టపోతారు. ప్రత్యామ్నాయ సమాజంలో కావాల్సిన నైపుణ్యం లేక వున్న కాస్తంతా ఆర్థిక స్వాతంత్య్రాన్ని కోల్పోయి గృహపరిధిలోకి నెట్టివేయబడతారు. స్త్రీలకు కుటుంబ వనరులపై ఆధిపత్యం, హక్కు లేకపోయినా, ఓ మేరకు రక్షణ ఫ్యూడల్‌ వ్యవస్థలో ఉంటుంది. సహజంగా భూమి కోల్పోయినప్పుడు డబ్బు రూపేణా వచ్చే పునరావాసం పురుషుని చేతిలోకి వెళుతుంది. పితృస్వామిక సమాజంలో ఈ మార్పు పురుషుడి పెత్తనానికి లేక వ్యసనాలకు దారి తీసి, స్త్రీకి వున్న కాస్తంత రక్షణ కొరవడి బజారున పడవలసి వస్తుంది. ఉద్యోగం పురుష లక్షణంగా చూసే పితృస్వామిక సమాజంలో స్త్రీలు తమ అస్థిత్వాన్ని కోల్పోతారు. ఇది కుటుంబ హింసకు దారి తీస్తుంది. కాబట్టి ఈ రోజుల్లో ఈ ఉద్యమంలోకి స్త్రీలు మరింత ఉదృతంగా వస్తున్నారు. కాకినాడ సెజ్‌ రాములమ్మ పోలేపల్లి చుక్కమ్మ జిందాల్‌ దేవుడమ్మ, రాయఘడ్‌ ఉల్కా మహాజన్‌, మంగుళూరు విద్యానటేషన్‌ వీళ్లంతా ఈ కోవకే చెందుతారు.
కాని విషాదమేమిటంటే కాకినాడ సెజ్‌ యాజమాన్యాన్ని ఠారెత్తిచ్చి ప్రతిఘటించిన స్త్రీలు, నాయకత్వ స్థానంలో లేరు. కేవలం ప్రతిఘటన స్వరాలుగా మిగిలిపోయారు. అందుకు కారణం ఇక్కడి సెజ్‌ నాయకత్వంలో పితృస్వామ్య ధోరణులు బలంగా ఉండడమే. సునామీలా వచ్చి పోలీసులను తరిమివేసిన స్త్రీలు అంతేవేగంగా నిమ్మకుండిపోతున్నారు. గత కొన్ని నెలలుగా వంటా వార్పు వంటి నిరసన కార్యక్రమాలు జరుగుతున్నా అందులో స్త్రీల భాగస్వామ్యం చెప్పుకోతగ్గదిగా లేదు. అయితే స్త్రీలు, పిల్లలు ముందుంటే పోలీసులు ఏమి చేయరన్న భావంతో కొంత మేరకి స్త్రీలను పిలుస్తున్నారే తప్ప వారిని నాయకత్వ స్థాయిలోకి తీసుకురావాలన్న అభీష్టం ఏమేరా లేదు. కుటుంబాన్ని ఇద్దరు వ్యక్తుల కలయికగా కాకుండా పితృస్వామ్య భావజాలంతో విభిన్న అభిప్రాయాలు కలిగిన వ్యక్తులుగా గుర్తించకపోవడం పెద్ద లోపం. రాష్ట్రంలో సెజ్‌ ఉద్యమాలకి ఆదర్శంగా నిలిచిన కాకినాడ సెజ్‌ వ్యతిరేక పోరాటం మరింత పదును పెట్టుకోవడానికి తీసుకోవలసిన అత్యవసర విషయాలలో ఒకటి; స్త్రీల భాగస్వామ్యాన్ని మరింతగా పెంచడం, మహిళా సాధికారిత పేరిట ప్రభుత్వం స్వయం సహాయక గ్రూపులను ఏర్పాటు చేసి తమ ప్రయోజనాలకు వాడుకుంటుంది. అయినా ‘సోంపేట’ లాంటి ఉద్యమాలలో స్త్రీలు కాల్పుల ఘటన తర్వాత ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని నిర్ద్వందంగా తోసిపుచ్చారు. ఆ మహిళలు ఉద్యమ శ్రేణులుగా అవతరించిననాడు పోరాటాలకు విజపథమే! ఆ దిశగా కాకినాడ సెజ్‌ వ్యతిరేక పోరాటం మహిళా సంఘ నిర్మాణ ఏర్పాటుకు ఇతర ప్రజాసంఘాలతో కలిసి ప్రయత్నించాల్సి ఉంది. రాజకీయ దృష్టి, తాత్విక పునాది మరింత పదునెక్కి ప్రజా పోరాటాల్లో పాల్గొంటూ వాటితో నడిచినప్పుడే ఇది సాధ్యమౌతుంది.
దడాలపాలెం-దుగ్గాడ
రెండూ ఊర్ల పేర్లే! అవేే మనుషుల పేర్లుగా ఎలా ఎదిగివచ్చాయో చూద్దాం. మామూలుగా అయితే ఒకే ఇంటిపేరు గలవారందరూ వుండే పేట పేరు అయినా ఊరు పేరు అయినా అదే వుంటుంది. కాని ఒక పిల్లని ‘దుగ్గాడ’ అని పిలుస్తుంటే ఒకింత ఆశ్చర్యపోవడమే గాక మరింతగా ఆలోచనలో పడిపోయాను.
అది కాకినాడ సెజ్‌ ప్రాంతం. అంటే అది ఏదో విహారప్రదేశం కాదు సుమా! పచ్చని పంట పొలాలలో పెట్టుబడి పెట్టిన చిచ్చు. స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌ (సెజ్‌)  ప్రత్యేక ఆర్థికమండలి. 2005లో పార్లమెంట్‌ చట్టం కూడా చేసి పారేసింది. నానా దేశాల కంపెనీలు పరిశ్రమలు పెట్టుకోవడానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా రైతులు తమ భూములన్నిటిని నామమాత్రం నష్టపరిహారం తీసుకొని ఏలినవారికి అప్పగించడమే తరువాయి. అయితే అప్పుడు వచ్చింది చిక్కు. కడుపు నిండా తిండిపెట్టే కన్నతల్లిని, పుట్టిన ఊరిని విడిచిపెట్టి ఉండలేని రైతాంగం తిరగబడింది.
బాలగోపాల్‌ లాంటి మేధావులు, స్థానిక ప్రగతిశీల శక్తులు వారిని బలపరిచారు. 2007లో అంతర్జాతీయ మహిళా దినం స్ఫూర్తితో పెద్దెత్తున మహిళలు సభ జరుపుకొని, సెజ్‌ నిర్మాణాలపై దాడికి దిగారు. ఆ తర్వాత క్రమము లోసెజ్‌ వ్యతిరేక పోరాట కమిటి కార్యక్రమాలు కూడా ఊపు అందుకొన్నాయి. అప్పుడు చాలా తెలివిగా సెజ్‌ యాజమాన్యం భూమి లేని దళిత గ్రామాలపై కన్ను వేసింది. ఐదు దళిత గ్రామాలను మొత్తంగా తుడిచిపెట్టే కుట్ర పన్నింది. దడాలపాలెం కేంద్రంగా దళిత గ్రామాలు ఐక్యపోరాటాలకు సిద్ధమవుతున్న తరుణం. దడాలపాలెం పేరుకే ఊరు, వాస్తవానికి చిన్న పల్లె, పెద్ద కాలనీ. ఒకప్పుడు ఎలా ఉండేదో కాని ఊరు, ఇప్పుడు అన్నీ ఇందిరమ్మ ఇండ్లే. ఓ యాభై గడప దాక ఉంటాయి.
…అందులో ఒకే ఒక్క సర్పంచ్‌ వడ్డీ నూకరాజు. అతగాడి ఇల్లు ఒకటే పెద్ద డాబా. ఓ ఇరవై ఎకరాల భూమికి అధిపతి అతడు. ఆ ఊరులో చాలామంది ఇంటిపేరు దడాలే. అందరి గుండెల నిండా దడే కాబోలు!
ఆ కాలనీకి ఒక చివర ఉప్మా బడి, అంగన్‌వాడి స్కూల్‌. ఆ స్కూల్లో పిల్లలకి ఉప్మా పెడతారు కాబట్టి అది ఉప్మా బడి. దాన్ని ఆనుకొనే చిన్న ప్రాథమిక పాఠశాల. వాటికి దగ్గరలోనే ఒక చిన్న చర్చి. ఆ పల్లెకి రెండుపక్కలా రెండు మట్టిరోడ్లు. అవి, రెండు కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతం సముద్రానికి పక్కనే వున్న బీచ్‌రోడ్డుకు కలుస్తాయి. రోజులో ఓ నాలుగు మాట్లు పిఠాపురం, కాకినాడ బస్సులు తిరుగుతాయి ఆ రూట్లో.
ఆ ఇండ్ల చుట్టూ కొబ్బరి చెట్లు కప్పేసి ఉంటాయి. ఆ ఊరి చుట్టూ సరుగుడు, జీడిమామిడి వృక్షాలు, తాడిచెట్లు అడివిలా అలుముకొని ఉంటాయి. ఇసుక నేలలు, నేలబావులు, పచ్చటి ప్రకృతి ప్రశాంతమైన గాలి, పరమళించే వెన్నల. పలకరించే చుక్కల ఆకాశం. దడాలపాలెం గురించి దడ పుట్టేలా చెప్పేసినట్టు ఉన్నాను కదా! సర్లెండి, సర్పంచ్‌ వడ్డీ నూకరాజు గారి డాబా పైకి వెళదాం సరదాగా! ఇంటి బయట, పొలం నుంచి అలిసిపోయి వచ్చి నూకరాజు నిదురపోతున్నాడు. అతడి భార్య నాగవేణి. అరవై ఏండ్ల నూకరాజుకి ముప్ఫై ఏండ్ల పడుచు భార్య. నలుగురు ఆడపిల్లలు వారికి. ఊరు ఊరంతా నూకరాజుని ‘నాన్న’ అని పిలుస్తారు, ఇంట్లో పిల్లల్లాగే. నిజంగా అతడు ఊరంతటికీ తండ్రిలాంటివాడే. ధర్మ తండ్రి. మాట అంటే మాటే. మాటకోసం, నిజాయితీ కోసం ఇందిరమ్మ కాంగ్రెస్‌ రాజకీయాలలో, 40 ఎకరాలలోంచి సగం వెళ్ళిపోయిందంట. నూకరాజు, నాగవేణిల కడగొట్టు పిల్ల పేరు విజయలక్ష్మి. ఉప్మా బడికి వెళుతుంది. ఆ పిల్లకి, పక్కింటి పాకలో, తన ఈడే వుండే బెతేన బేబి దడాలపాలెం ఊరు పేరు. దుగ్గాడ ఊరు పేరే. కాని ఇక్కడ ఇప్పుడు అమ్మాయి పేరు. నూకరాజు కూతురు విజయలక్ష్మి కూడా రేపు మూలపేటలోని సెజ్‌ పునరావాస కాలనీకి వెళ్లిపోవచ్చు. (ఇప్పుడు ఆ పిల్ల అక్కడే వుంటోంది). అప్పుడు విజయలక్ష్మి పేరు ‘దడాల’ అవుతుందా? ఏమో! చెప్పలేము.
మనిషి నామరూపాలు లేకుండా, ఊరులన్నింటిని మింగేస్తూ బకాసురుడిలా సెజ్‌ రాక్షసంగా విస్తరిస్తుంది. అది నేడు కాకినాడ సెజ్‌. రేపు కోస్టల్‌ కారిడార్‌. దాన్ని మట్టుబెట్టందే మనిషి బ్రతుక్కి విశ్రాంతి లేదు. మనిషి పేరుకి విలువా లేదు. మనిషి చరిత్రకి మనుగడ లేదు. కాకినాడ సెజ్‌కి వ్యతిరేకంగా 16 ఊర్ల ప్రజలు గత ఏడు ఏండ్లుగా అవిశ్రాంతంగా పోరాటం చేస్తూనే వున్నారు. రండి. వారికి అండగా నిలబడదాం. ఇవ్వాళ వారి చరిత్ర మాసిపోవచ్చు! రేపు పొద్దున మన చరిత్ర మీదా దాడి జరగవచ్చు. మొత్తంగా నిరాశ్రయమయ్యే మానవజాతిని, మన తరాన్ని కాపాడుకుందాం. సెజ్‌కి వ్యతిరేకంగా గళం విప్పుదాం. అందరం కలసి పోరాటం చేద్దాం! కడలి అంచున పొంచి ఉన్న సెజ్‌ ప్రమాదాన్ని ఆదిలోనే తుదముట్టిద్దాం.

Friday, July 20, 2012

సోంపేట-సీకాకుల పోరాట బావుటా


August 2, 2010
హేమా వెంక్రటావు
”నక్సల్బరీ”ని అందిపుచ్చుకున్న సీకాకులం రాష్ట్రంలో అన్ని పోరాటాల్ని కొత్త మలుపు తిప్పింది. వెంకట్రావు సత్యం, పంచాది నిర్మల, సుబ్బారావు, పాణిగ్రాహిలాంటి ఎందరో వీరులు అమరులైనారు. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ సోంపేట ”అభివృద్ధి” పేరుమీద జరుగుతున్న జీవన ”విధ్వాంసానికి” వ్యతిరేకంగా ప్రాణాలకు తెగించి పోరాడింది. ఆ త్యాగం వృధా పోదు.
గత దశాబ్దకాలంగా రాష్ట్రంలో సెజ్‌లు , కోస్టల్‌ కారిడార్‌లు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తమ భూముల్ని గ్రామాల్ని ప్రభుత్వం దగ్గరుండి కంపెనీలకు కట్టబెడుతుంటే తిరగ బడుతున్న జనాల మీద దారుణ మారణ కాండ జరుగుతూనే వుంది. గంగవరంలో ఒక మత్స్య కారుడు ప్రాణాలు కోల్పోయాడు. కాకినాడ సెజ్‌ వ్యతిరేక నాయకులపై అక్రమ కేసులు నడుస్తూనే ఉన్నాయి. వాన్‌పిక్‌లో అగ్గి రాజుకుంటూనే ఉంది. ఈ సందర్భంలో సోంపేట ప్రజలు తమ భూమికోసం, ”బీల” కోసం సాహసోపేతంగా పోరాడటం ప్రజాపోరాటాలకు కొండంత ధైర్యాన్నిచ్చింది. ఆ స్ఫూర్తిని నింపుకుంటూ సోంపేట పోరాటానికి బాసటగా మనమందరం నిలవాలని కోరుకుంటూ వారి బాధను తెలపడమే ఈ వ్యాసం ఉద్దేశం.
జూలై 14వ తేదీ కాల్పుల సంఘటనకు ముందు గ్రామాలకు వెళ్ళిన పోలీసులు, సాయుధ కంపెనీ గుండాలు ప్రతీ ఇంటిని సోదాచేసి ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేసారు. ముఖ్యంగా స్త్రీలను బయటకు రావద్దని, వారి పురుషుల్ని కట్టడి చేయాలని లేకపోతే తీవ్ర పరిమాణాలు ఎదుర్కొంటారని హెచ్చరించారు. విచ్చలవిడిగా ఒక పత్రికా విలేఖరి సహాయంతో గ్రామాల్లో డబ్బులు వెదజల్లారు. వీధుల్లో కవాతు చేసారు. సుమారు 1000 మంది గుండాలను చత్తీస్‌ఘడ్‌, ఒరిస్సాల నుండి అక్కడ ధర్మల్‌ విద్యుత్‌ పవర్‌ప్లాంటు నిర్మాణం చేపట్టపోతున్న నాగార్జున కనస్ట్రక్షన్‌ కంపెనీ రప్పించింది. వీరు మారణాయుధాలు ధరించి వీధులలో, గ్రామాలలో తిరుగాడుతూ ప్రజల్ని ముఖ్యంగా స్త్రీలను భయభ్రాంతులకు గురి చేస్తుంటే పర్యావరణ పరిరక్షణ సంఘ సభ్యులు కలెక్టరుకు విషయాన్ని నివేదించినా స్పందన శూన్యం. మొత్తంగా కంపెనీ తరఫున, పాలక వర్గాల పక్షాన జిల్లా పాలనా యంత్రాంగం నిలబడింది. సోంపేట ఉద్యమ నాయకత్వాన్ని అందిస్తున్న పర్యావరణ పరిరక్షణ సంఘం ప్రధాన కార్యదర్శి బీన ఢిల్లీరావు భార్యజ్ఞానేశ్వరిని నడిరోడ్డు మీద తగలరాని ప్రదేశంలో కొట్టి అవమానించారు. కొందరు స్త్రీలను వివస్త్రలను చేయడానికి ప్రయత్నించారు. సంఘ అధ్యక్షులు డా. క్రిష్టమూర్తి రిలే నిరాహార దీక్షలో కూర్చున్న స్త్రీలకు మద్ధతుగా శిబిరానికి వెళితే ఆయనతోపాటు స్త్రీలను చావగొట్టి చితకబాదారు. మరో నాయకుడు టి. రామారావు సంఘ ఉపాధ్యక్షులు ఆసుపత్రి మీద దాడి చేసి అక్కడ ఉన్న నర్సులను బెదిరించి చేయి చేసుకున్నారు. మహిళా రోగులనగలు దోచుకున్నారు. గర్భిణీ స్త్రీలను బయటకు ఈడ్చేసి బీభత్సాన్ని సృష్టిం చారు. ఇంత జరిగితే హోం మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఒక స్త్రీ అయివుండి కూడా అది ఒక అల్లరి మూక పని అని చెప్పటం సిగ్గు చేటు. మరి యింతగా ప్రజల్ని పోరాటంలోకి నడిపించిన ఆ పరిశ్రమ ఏమిటి? స్త్రీలు నాయకత్వం వహించి ముందుండి పోలీసుల్ని, గూండాల్ని తమ భూమిలోకి రాకుండా అడ్డుకోవడానికి అవసరమైతే తమ ప్రాణాలు వదలడానికి కూడా సిద్దపడి ఆ పరిశ్రమలను ఎందుకు ఆపాలనుకుంటున్నారు.
అభివృద్ధి, పారిశ్రామీకరణ పేరిట, ఉత్తరాంధ్ర (మూడు జిల్లాల్లో) 14 ధర్మల్‌ విద్యుత్‌ప్లాంట్లు నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించింది. అందులో శ్రీకాకుళం జిల్లా సోంపేటలో నాగార్జున కనస్ట్రక్షన్‌ కంపెనీ అనుమతి పొందింది. సోంపేట మండలంలోని గొల్లగండి, గ్రామ ప్రాంతం పరిశ్రమ ఏర్పాటుకు అనువైనదని గుర్తించింది. ఈ ప్రాంతం పురాతన రేపుల్లో ఒకటైన బారువాకు చేరువగా ఉన్న బారువ, ప్రముఖ స్వాతంత్య్ర యోధుడైన గౌతు లచ్చన్న జన్మస్థలం కూడా! 12 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 2640 మెగావాట్ల సామర్ధ్యంగల పరిశ్రమను 1890 ఎకరాల భూమి అవసరమని నిర్ణయించారు. పరిశ్రమల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ కోసం ఆంధ్ర ప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కార్పోరేషన్‌ పూనుకుంది. ప్రభుత్వ పట్టా భూమికి 80000/- ప్రయివేటు వ్యక్తుల భూమికి 2 లక్షల నుండి 3.5 లక్షల వరకు ధరను ప్రకటించారు. ఇది కూడా భూమి నాణ్యత బట్టి కాకుండా వ్యక్తుల పరపతి మీద ధర ఆధారపడి ఉంటుంది. ఇప్పటివరకు ప్రభుత్వ భూమికి 970 ఎకరాలు ప్రయివేటు వ్యక్తుల నుంచి 560 ఎకరాలు నయానో భయానో సేకరించారు. ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.నిర్మాణ ప్రదేశంలో ”బీ” అని స్థానికులు, పిల్చుకునే చిత్తడి భూములున్నాయి. ఏడాది పొడవునా వీటిలో నీరుంటుంది. మత్స్యకారులు వీటిలో చేపలు వేట చేస్తారు. రైతులు వీటి ఆధారంగా రెండు సీజనుల్లో వరి పండిస్తారు. ఈ ప్రదేశంలో నిర్మాణం చేపడితే వర్షాధారిత బీలు, జలాశయాలు ఎండిపోతాయి. దీనివలన వ్యవసాయానికి, చేపలు వేటకి జీవ వైవిధ్యానికి విఘాతం కలుగుతుంది. ఈ ప్రదేశంలో 118 రకాల పక్షులు, అంతరించిపోతున్న అరుదైన జంతువుల నాశనం అవుతుంది.
ఈ ప్రాంతం అంతా మరో కోనసీమగా భావించే ”ఉద్ధానం”లో భాగం బొగ్గు దిగుమతికి జెట్టీని సముద్రంలో నిర్మిస్తారు. కాని కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌ నిబంధనల ప్రకారం సముద్రానికి 500 మీటర్లు లోపు ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదు. ఈ నిబంధనకు వ్యతిరేకంగానే కంపెనీ చర్యలు చేపడుతుంది. ఈ పరిశ్రమల వలన గంటకు 228 క్యూబిక్‌ మీటర్ల వ్యర్ధ జలాల విడుదల వలన చేపల వేటకు సమస్యలు ఉత్పన్నమవుతాయి. చేపలు, రొయ్యల ఉత్పత్తికి ఆటంకం ఏర్పడుతుందని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. నీటిలో కాలుష్యం పెరగటం, ప్లాంటు ప్రాంతంలో భూ ఉపరితల భాగం, పచ్చదనం, మట్టి కొంతమేరకు కోల్పోయే అవకాశం ఉంది.
అయితే బూడిద, వ్యర్ధజలాల వల్ల ఎటువంటి యిబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామని అత్యంత ఆధునికమైన, నాణ్యమైన సూపర్‌ క్రిటికల్‌ టెక్నాలజీతో పరిశ్రమను నడుపుతామని నాగార్జున కన్‌స్ట్రక్సన్‌ కంపెనీ యాజమాన్యం ప్రజలను నమ్మించ డానికి ప్రయత్నించింది. తమకు అనుకూలంగా స్పందించి రిపోర్టులు యిచ్చే కొంతమంది పర్యావరణ శాస్త్రవేత్తలను, వివిధ రకాల నిపుణులను ఈ ప్రాంతానికి రప్పించి స్థానికులను మభ్య పెట్టడానికి ప్రయత్నాలు చేసింది. అదే సమయంలో సలాసపురం గ్రామం నుండి అగ్రికల్చరల్‌ యం. యస్సీ. చేసిన వ్యక్తి ఈ నష్టాన్ని గుర్తెరిగి ప్రజల ముందు పెట్టగా 2008 సం. అక్టోబర్‌ నెలలో జనరక్షణ సమితి పేరుతో బీన ఢిల్లీరావు 10 వేల కరపత్రాలు ప్రచురించి గ్రామ గ్రామాన ఆటోలో తిరిగి సమావేశం ఏర్పాటు చేయగా 7గురు రైతు ప్రతినిధులు సనపల శ్రీరాంమూర్తి, మాదిన రాఘువుల, మొదలగు వారు 7గురు హజరై దీనిని పర్యావరణ పరిరక్షణ సమితిగారూపకల్పన చేసారు. పర్యావరణ స్థానిక పరిరక్షణ ఉద్యమ నాయకులు కూడా ప్రజల పక్షాన నిలబడి నిబద్ధతతో వ్యవహరించే శాస్త్రవేత్తలను, నిపుణులను రప్పించి పరిశ్రమల వల్ల ముప్పు ఉందని ప్రకటించారు. అంతేకాకుండా గాలి, నీరు, భూమి, వాతావరణం మొత్తం వేడెక్కుతుందని అనేక జబ్బులు వస్తాయని, వ్యవసాయం కుంటుపడుతుందని తద్వారా ఆహార ధాన్యాల కొరత ఏర్పడు తుందని మత్స్య ఐక్యవేదిక ఏర్పడి ప్రజలు పర్యావరణ సమితి, తీర ప్రాంత మత్స్యకార ఐక్యవేదిక వాటి తీరుతెన్నులను ప్రజల ముందర ఎండగట్టారు.
తరువాత క్రమంలో సోంపేటలో ఉన్న లోకనాధేశ్వర కళాపీ సంఘం ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ సమితికి మద్దతుగా పవర్‌ ప్లాంటుకు వ్యతిరేకంగా బందు పిలుపు ఇవ్వడం జరిగినది. అప్పుడు ఈ ప్రాంత మేధావి వర్గం, డాక్టర్లు, అడ్వకేట్సు, తాపీ మేస్త్రీల సంఘంవారు, ఉపాధ్యాయులు, వ్యాపార వేత్తలు, స్వచ్ఛంద సంస్థలు వారంతట వారు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఈ జరుగుతున్న దానిపై చర్చించుకొని పరవాడ, తాల్చేర్‌ ప్లాంటులు చూసి వచ్చి అపుడు పర్యావరణ పరిరక్షణ సమితికి మద్దతు తెలపడం జరిగింది. అప్పటినుండి పర్యావరణ పరిరక్షణ సంఘంగా మార్పు చెందింది. సంఘ అధ్యక్షులు డా. క్రిష్టమూర్తి ముందుగా ఒక డాక్టరుగా ప్రజారోగ్యానికి, పర్యావరణానికి ప్రాధాన్యత యిచ్చి ఈ ఉద్యమాల్లో పాల్గొన్నారు. ప్రజల జీవించే హక్కులకే భంగం ఏర్పడుతుందని గ్రహించి ప్రజాపోరాటానికి ఇతర సంఘాలను కలుపుకుని ఇక్కడ మెకానిక్‌ ఇంజనీర్‌ చదువుకొని ఈ ప్రాంతంలోనే విద్యాసంస్థలు నడుపుతున్న సంఘ ఉపాధ్యక్షులు రామారావు పోరాటంలో చేరి ముందుకు సాగుతున్నారు. ఈ ఉద్యమ ప్రాంతంలోకి అన్ని అస్తిత్వ వర్గాల వృత్తుల యూనియన్లు భాగస్వామ్యంలో సంఘం మరింతగా బలపడింది.
ఉద్యమ నేపధ్యం :
పోలీసు, రెవెన్యూ శాఖలు నయానో కొంతమంది దగ్గర భూమిని యిక్కడ కూడా ప్రజల నుంచి బలవంతంగా లాక్కొవడం జరిగింది. కానీ పోరాటాలకు మారు పేరైన శ్రీకాకుళం సోంపేట వాస్తవ్యులు తమపట్ల జరిగిన మోసాన్ని త్వరితగతినే గ్రహించారు. అందుకే గ్రామ గ్రామాన ప్రజలు ధర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టును మనసా వాచా ప్రతిఘటించారు. అవసరమైతే తమ ప్రాణాన్ని ఓడైకడనా నిలువరిస్తామని శపథం చేసారు. తమ భూములలోకి వచ్చే వారికి మొదట నుంచి అడ్డుకోవడానికి ప్రయత్నించారు. గ్రామ గ్రామాన వీధి వీధినా సభలు పెట్టుకున్నారు. అభివృద్ధే ప్రధానమని అధికార కాగ్రెస్‌పార్టీ స్పష్టంగా ప్రకటించింది. పరిశ్రమను అడ్డుకునే ప్రయత్నాలకు ఎవరూ సహకరించవద్దని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ముందుగానే కాంగ్రెస్‌ శ్రేణులకు పిలుపు నిచ్చారు. సోంపేటలో ఎన్నో దశాబ్దాల అనుబంధం గల సర్దార్‌ గౌతు లచ్చన్న కుమారుడు మాజీ మంత్రి గౌతు శివాజీ కూడా బహిరంగంగా ఈ పరిశ్రమకు మద్దతునిచ్చాడు.
స్థానిక పరిస్థితుల వలన కొందరు కాంగ్రెస్‌ శ్రేణులు ఉద్యమంలో పాల్గొన్నా ప్రజలకు వారి స్టాండు తెలుసు. ఉభయ కమ్యూనిస్టు పార్టీల సీనియర్‌ నాయకులు ఒకటి రెండు సార్లు వచ్చి బహిరంగ సభల్లో ఉద్యమానికి మద్దతు ప్రకటించినా మమేకం కాలేకపోయారు. ఇక సి.పి.యం. ప్రభుత్వం నందిగ్రాంలో పారించిన రక్తపుటేర్లు వారి కళ్ళ ముందు కదులుతూనే ఉన్నాయి. ప్రజారాజ్యం పార్టీ సీనియర్‌ నాయకులు ఒకటి రెండు సార్లు వేదికలపై ఉపన్యాసాలు యివ్వడం తప్ప ఉద్యమంలో కొనసాగిన దాఖలాలు లేవు. శ్రీకాళం జిల్లా ఏకైక శాసన సభ్యుడైన పి. సాయిరాజ్‌ స్థానికులకు దూరమైపోతాననే భావనతో మద్దతు ప్రకటించినా, దాదాపు 194 రోజుల పాటు ఉద్యమంలో భాగస్వామిగా కన్పిస్తూ కుంటి సాకులతో ఉద్యమాన్ని చీల్చి స్థానిక తెలుగు దేశం నాయకులు ఉద్యమ కారులకు షాకిచ్చారు. అయినా రాజకీయ పార్టీల నిజాయితీ, నిబద్ధత, చిత్తశుద్ధి పట్ల ప్రజలకు వుండే సందేహాలు ప్రజలకున్నాయి.
గత ఏడాది ఆగష్టు 8న మానవ హక్కుల వేదిక బాలగోపాల్‌ తదితర నాయకులు పాదయాత్ర నిర్వహించి ఉద్యమానికి మద్దతు తెలిపారు. అదే నెల 18న గొల్లగండిలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో దాదాపు అందరూ పరిశ్రమను వ్యతిరేకించారు. ఆగష్టు 29న ముఖ్యమంత్రిగారిని, తెలుగు దేశం పార్టీ నేత చంద్రబాబుగారిని పి.ఆర్‌.పి. నేత చిరంజీవిని, సి.పి.ఐ నేత నారాయణను, లోక్‌సత్తా నేత జయప్రకాష్‌ నారాయణని కలిసి ఉద్యమకారులు వినతి పత్రాలను ఇచ్చారు. అదే రోజు మానవ హక్కుల కమీషన్‌ ఛైర్మన్‌ శ్రీ సుభాషణ్‌ రెడ్డి గారిని కూడా కలిసి సదరు మహజరు ఇవ్వడమైనది. రైల్‌రోకోలతో మొదలై డిసెంబరు 5న పదిమందితో రిలే నిరాహార దీక్ష శిబిరం ప్రారంభించడం జరిగింది. కాల్పులు సంఘటన జరిగే నాటికి అనేక గ్రామాల నుంచి స్త్రీలు పాల్గొని 222 రోజులు పూర్తి చేసారు. గత జనవరిలో ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులు మమతా బెనర్జీ, జైపాల్‌ రెడ్డిలను కలిసారు. సోనియా, రాహుల్‌ గాంధీ, మన్‌మోహన్‌లకు వినతి పత్రాలు సమర్పించారు. ఫిబ్రవరిలో జాయింట్‌ కలెక్టర్‌ పర్యటనను అడ్డుకుని అదే నెల 25న భారీ ఎత్తున ప్రజాగర్జన సభ ఏర్పాటు చేసారు. ఏప్రిల్‌లో రామన్‌ మెగసెసే అవార్డు గ్రహీత, ప్రముఖ పర్యావరణ వేత్త సందీప్‌ పాండే ఈ ప్రాంతాన్ని సందర్శించారు. జూన్‌ 21న నర్మదా బచావో ఉద్యమ సారధి మేధా పాట్కర్‌ ఈ ప్రదేశానికి వచ్చి వీరి ఉద్యమానికి మద్దతు పలికారు. యిప్పటికీ ఉద్యమకారులపై 25 కేసులు తాజాగా కాల్పులు సందర్భంగా హత్యానేరారోపణలపై కేసులు బనాయించారు. వాటిలో 10 నాన్‌ బెయిల్‌బుల్‌ కేసులు, ఆరుగురిపై రౌడీ షీట్‌కేసులు తెరిచారు. యస్‌.సి, యస్‌.టి కేసును సంఘ ప్రధాన కార్యదర్శిపై మోపారు. కానీ ప్రజల మనోభావాలను గుర్తించలేదు సరికదా చివరకు జూలై 14న పిట్టల్ని కాల్చినట్టు కాల్చారు.
సోంపేట ప్రజల్ని పిట్టల్ని కాల్చినట్లు కాల్చాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ప్రపంచీకరణ, ప్రయివేటీకరణ విధానాల అమలు ఈ దుర్మార్గానికి మూలం.
రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం ప్రపంచ వ్యాప్తంగా జాతీయోద్యమాలు ఉవ్వెత్తున లేచి సామ్రాజ్యవాదుల విస్తృత కాంక్షను వెనక్కి తిప్పి కొట్టారు. పాత పద్ధతులలో తమ ప్రభావాన్ని కొనసాగించలేమని అబివృద్ధి చెందిన దేశాలు గుర్తించాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలలోని పాలక వర్గాలను బుట్టలో వేసుకొని వారి ద్వారా తమ దేశంలోకి పెట్టుబడిదారులు, బహుళ జాతి సంస్థల ప్రయోజనాలను కాపాడటానికి నడుం బిగించారు. ఆయా దేశాలలో పెట్టుబడులు పెట్టి ఆ దేశ సహజ వనరులను ఉపయోగించుకొని పరిశ్రమలు స్థాపించి లాభాలను తమ దేశాలకు తరలించుకు పోవడం జరుగుతుంది. అందుకు స్థానిక దళారీ సంస్థల సహాయం కోరడం జరుగుతుంది.
మానవ జీవితానికి సంబంధించిన ప్రతి విషయం ఇక్కడ వినియోగ వస్తువుగానే పరిగణించబడుతుంది. అందుకే మనకు కావల్సినంత విద్యుత్‌ ఉత్పత్తి ఉన్నప్పటికీ దాని పేరిట లాభాలను కొల్లగొట్టాలని ప్రయత్నిస్తున్నారు. సోంపేట మీద కూడా ఆ ప్రపంచీకరణ రాబందు నీడ పడింది. అందుకే ప్రజల ప్రాణాలను అంత సులభంగా తీయగలిగారు.
ఈ పాశవిక ఘటనకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగానూ ప్రజా సంఘాలు ప్రజల పక్షాన నిలబడ్డారు. ప్రతి జిల్లాలోనూ సంఘటనలకు ఖండిస్తూ మత్స్యకారులు, రైతు సంఘాలు, ప్రజాస్వామ్య వాదులు ధర్నాలు, మౌన ప్రదర్శనలు, కలక్టరేటు ముట్టడిలతో తమ నిరసనను తెలియజేసారు. మానవ హక్కుల వేదిక, సాంప్రదాయ మత్స్యకారుల సమితి, ఇండియన్‌ పీపుల్స్‌ లాయర్స్‌, పర్యావరణ పరిరక్షణ సంఘం, ప్రజా ఉద్యమాల జాతీయ సమాఖ్య మానవ హక్కుల కమీషన్‌కు న్యాయవాది హేమా వెంకట్రావు ద్వారా పిటీషన్లు దాఖలు చేసారు. తక్షణమే పోలీసులను ఉపసంహ రించాలని, ఉద్యమకారుల ప్రాణాలకు పోలీసుల నుండి, కంపెనీ యాజమాన్యం నుండి రక్షణ కల్పించాలని నాగార్జున కనస్ట్రక్షన్‌ కంపెనీకి చట్టవ్యతిరేకంగా మద్దతునిచ్చి ప్రజల ప్రాణాలను హరించిన వారిపై న్యాయ విచారణ జరిపించాలని, జరిగిన సంఘటనలపై కమీషన్‌ ఆధ్వర్యంలో కమీషన్‌ ఏర్పాటును లేదా హైకోర్టు సిట్టింగు జడ్జితో విచారణ ఆదేశించాలని, కంపెనీ యాజమాన్యపు గుండాలు ప్రజల్ని భయ భ్రాంతుల్ని చేస్తుంటే ఈ విషయాన్ని కలెక్టర్‌ దృష్టిికి తెచ్చినా స్పందించని కలెక్టరుపై చర్య తీసుకోవాలని, ముఖ్యంగా ”అశోక్‌ కుమార్‌, నవీన్‌ కుమార్‌” ఎస్త్సెలు ప్రజలకు సినిమా చూపిస్తామని అడ్డుకుంటే ప్రాణాలు తీస్తామని బహిరంగంగా ప్రకటించినందుకు తక్షణమే వారిని సస్పెండు చేయాలని, ఉద్యమ కారులపై ఆక్రమంగా బనాయించిన కేసులను ఎత్తివేయాలని, హత్య, లూటీ, దాడి, స్త్రీలపై అత్యాచార ప్రయత్నం, ఇతరుల భూములలోకి అనుమతి లేకుండా ప్రవేశించడంపై పోలీసులపై, గూండాలపై సంబంధింత ఐ.పి.సి సెక్షన్‌ క్రింద కేసులు పెట్టి అరెస్టు చేయాలని, వారిని విధులనుండి బహిష్కరించాలని కోరారు. ముఖ్యంగా మహిళా నాయకురాలు అయిన జ్ఞానేశ్వరిని బహిరంగంగా బట్టలు ఊడదీసి అవమాన పరిచినందుకు, మౌర్య ఆసుపత్రిలో, శిబిరంలో స్త్రీలపై జరిగిన దాడులకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. దీనికి కొంత అనుకూలంగా స్పందించిన మానవ హక్కుల కమీషన్‌ ఉద్యమ కారులను బెదిరింపులకు గురిచేయవద్దని, ఎలాంటి హాని తలపెట్టవద్దని తక్షణమే వైద్య సహాయం అందించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నిజానికి మానవ హక్కుల కమీషన్‌ ఎక్స్‌గ్రేషియాకై ఆదేశిస్తామని తెలిపినా అలాంటిదేమీ వద్దని న్యాయవాది ద్వారా హక్కుల కమీషన్‌కు తెలిపారు. అలాగే మేథాపాట్కర్‌, మిగతా మేధావులు తమ ప్రాంతానికి వచ్చినా ఎట్టి పరిస్థితులలోను పునరావాసం కొరకు ప్రస్తావించవద్దని ఉద్యమ కారులు కోరారు. ఆ సంఘటనా స్థలానికి వెళ్ళి నిజా నిజాలను కమీషన్‌కు తెలియచేస్తామన్న న్యాయవాది ప్రతిపాదనను మానవ హక్కుల కమీషన్‌ ఆమోదించింది.
సమత అనే స్వచ్ఛంద సంస్థ పర్యావరణ అప్పిలేటు కమీషన్‌కు పిటీషన్‌ దాఖలు చేయగా కంపెనీ యాజమాన్యం వాస్తవాలను తప్పుదోవ పట్టించింది. కాబట్టి పూర్తి అధ్యయనం తరువాతే అనుమతుల్విడం జరుగతుందని వారు ఆదేశించారు. ఇవన్నీ కొంతమేరకు ప్రజలు సాధించిన విజయాలే.
కానీ ధర్మల్‌ ప్లాంటు ఆగిపోయేంతవరకు విశ్రమించకూడదని పట్టుదలతో ఉన్నారు. అంతేకాకుండా పరిశ్రమను ఆపడమే కాదు. ఇప్పటివరకు ఆక్రమంగా బెదిరించి, మోసగించి తమ వద్దనుండి లాక్కున్న భూములను డీ-నోటిఫై చెయ్యాలని, డిమాండు చేస్తున్నారు.
గత రెండు సంవత్సరాలుగా నిరవధికంగా రిలే నిరాహార దీక్షలు ధర్నాలు, బందులు, ప్రజల్ని చైతన్య పర్చడం, అన్ని ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాడే ప్రజలందరిని కూడగట్టడం, కుళ్ళు రాజకీయాలకు అతీతంగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ఉద్యమాన్ని నిర్మించి 3000 మంది పోలీసులు, మరో వెయ్యి మంది గుండాల ప్రయివేటు సైన్యానికి ఎదురు నిల్చి ఉద్యమ స్ఫూర్తిని నిలబెట్టడంలో సోంపేట, దాని చుట్టూ ఉన్న 84 గ్రామాల ప్రజలు ముఖ్యంగా మహిళలు ప్రదర్శించిన తెగువ అన్ని ప్రజా పోరాటాలకు ఆదర్శం అనుటలో అతిశయోక్తి లేదు. అందుకే ఇప్పుడు సోంపేట శ్రీకాకుళ పోరాట బావుటా.
(రచయిత్రి సోంపేట ఉద్యమ సంఘాల న్యాయవాదిని) ఫోటోలు పంపిన ప్రశాంతి ఉప్పలపాటి, రాకేష్‌రెడ్డి దుబ్బుడుకి ధన్యవాదాలు.)
వీర గున్నమ్మ దారిలో…
స్త్రీవాదం అంటే మనం, మన కుటుంబం అనే చట్రాలను దాటుకొని వాటికి మూలాలైన సామాజిక, ఆర్థిక, రాజకీయ, వ్యవస్థల మార్పుకై నడుం బిగించి సెజ్‌లకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న మహిళలెందరో. ”కాకినాడ” రాములమ్మ ”పోలేపల్లి” చుక్కమ్మ ”జిందాల్‌” దేవుడమ్మ, ”మహాముంబాయి” ఉల్కా మహాజన్‌, ”మంగుళూరు” విద్యా నటేషన్‌..వీరిలో కొందరు మాత్రమే!!
సోంపేట ప్రాంతానికి చెంది, 1940 సం. లో జమీందారీ వ్యతిరేక పోరాటంలో అమరురాలైన వీర గున్నమ్మ స్ఫూర్తిని ఎత్తిపడుతూ సోంపేట మహిళలు వీరోచితంగా తిరగబడ్డారు. ఇక్కడ స్త్రీలంతా శ్రామిక వర్గానికి చెందిన వారే. మత్స్యకార కుటుంబాలకు చెందిన స్త్రీలు, మగవారు వేటచేసి రాగా చేపలను ఆరబెట్టి, గ్రేడింగు చేసి, అమ్మకాలు చేసేవారు. మిగిలిన కులాలకు చెందిన వారు రైతు కూలీలుగాను, తమకున్న కొంత భూమిని సాగు చేసుకుంటూనే, కుల వృత్తులు చేసుకుంటూ ఉపాధిని పొందుతూ కొంత మేర ఆర్ధికంగా నిలబడ్డావారే. అందుకే ఇతర సెజ్‌లలోలాగానే ఇక్కడ స్త్రీలు కూడా థర్మల్‌ విద్యుత్‌ ప్లాంటు యాజమాన్యపు మాటలు నమ్మి ఉపాధిని పోగొట్టుకోదల్చలేదు. ఉద్యోగం పురుష లక్షణం అని నమ్మే సమాజంలో ఎలాంటి ఉపాధి కంపెనీ నుండి దొరుకుతుందో వారికి తెలుసు. అందుకే ససేమిరా అన్నారు. ప్రభుత్వ స్వయం సహాయ బృందాలకు చెందిన మహిళలు ఉద్యమంలో పాల్గొనకూడదని ప్రభుత్వం పరోక్షంగా హెచ్చరించినా సంక్షేమ పధకాలు నిలిపివేస్తామని బెదిరించినా పోరులో ముందు భాగాన ఉన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రాజెక్టులు మాకొద్దు, మా సహజ వవనరుల్ని ఆక్రమించవద్దని ఆక్రందనలు చేసారు. పాద యాత్రలు, ప్రజాభిప్రాయ సేకరణ, సమావేశాలలో ఒకటిగా ఉద్యమించి భాగస్వామ్యమయ్యారు. గురి చూసి కాలుస్తున్న పోలీసుల్ని బ్రతిమిలాడారు. ప్రాధేయపడ్డారు. వారికి ఎదురు నిలిచి తమను గురి పెట్టమన్నారు. ధర్మల్‌ పవర్‌ ప్లాంటుకు వ్యతిరేకంగా మహిళలు పెద్ద ఎత్తున కదిలారు.

సోంపేట-సీకాకుల పోరాట బావుటా


August 2, 2010
హేమా వెంక్రటావు
”నక్సల్బరీ”ని అందిపుచ్చుకున్న సీకాకులం రాష్ట్రంలో అన్ని పోరాటాల్ని కొత్త మలుపు తిప్పింది. వెంకట్రావు సత్యం, పంచాది నిర్మల, సుబ్బారావు, పాణిగ్రాహిలాంటి ఎందరో వీరులు అమరులైనారు. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ సోంపేట ”అభివృద్ధి” పేరుమీద జరుగుతున్న జీవన ”విధ్వాంసానికి” వ్యతిరేకంగా ప్రాణాలకు తెగించి పోరాడింది. ఆ త్యాగం వృధా పోదు.
గత దశాబ్దకాలంగా రాష్ట్రంలో సెజ్‌లు , కోస్టల్‌ కారిడార్‌లు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తమ భూముల్ని గ్రామాల్ని ప్రభుత్వం దగ్గరుండి కంపెనీలకు కట్టబెడుతుంటే తిరగ బడుతున్న జనాల మీద దారుణ మారణ కాండ జరుగుతూనే వుంది. గంగవరంలో ఒక మత్స్య కారుడు ప్రాణాలు కోల్పోయాడు. కాకినాడ సెజ్‌ వ్యతిరేక నాయకులపై అక్రమ కేసులు నడుస్తూనే ఉన్నాయి. వాన్‌పిక్‌లో అగ్గి రాజుకుంటూనే ఉంది. ఈ సందర్భంలో సోంపేట ప్రజలు తమ భూమికోసం, ”బీల” కోసం సాహసోపేతంగా పోరాడటం ప్రజాపోరాటాలకు కొండంత ధైర్యాన్నిచ్చింది. ఆ స్ఫూర్తిని నింపుకుంటూ సోంపేట పోరాటానికి బాసటగా మనమందరం నిలవాలని కోరుకుంటూ వారి బాధను తెలపడమే ఈ వ్యాసం ఉద్దేశం.
జూలై 14వ తేదీ కాల్పుల సంఘటనకు ముందు గ్రామాలకు వెళ్ళిన పోలీసులు, సాయుధ కంపెనీ గుండాలు ప్రతీ ఇంటిని సోదాచేసి ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేసారు. ముఖ్యంగా స్త్రీలను బయటకు రావద్దని, వారి పురుషుల్ని కట్టడి చేయాలని లేకపోతే తీవ్ర పరిమాణాలు ఎదుర్కొంటారని హెచ్చరించారు. విచ్చలవిడిగా ఒక పత్రికా విలేఖరి సహాయంతో గ్రామాల్లో డబ్బులు వెదజల్లారు. వీధుల్లో కవాతు చేసారు. సుమారు 1000 మంది గుండాలను చత్తీస్‌ఘడ్‌, ఒరిస్సాల నుండి అక్కడ ధర్మల్‌ విద్యుత్‌ పవర్‌ప్లాంటు నిర్మాణం చేపట్టపోతున్న నాగార్జున కనస్ట్రక్షన్‌ కంపెనీ రప్పించింది. వీరు మారణాయుధాలు ధరించి వీధులలో, గ్రామాలలో తిరుగాడుతూ ప్రజల్ని ముఖ్యంగా స్త్రీలను భయభ్రాంతులకు గురి చేస్తుంటే పర్యావరణ పరిరక్షణ సంఘ సభ్యులు కలెక్టరుకు విషయాన్ని నివేదించినా స్పందన శూన్యం. మొత్తంగా కంపెనీ తరఫున, పాలక వర్గాల పక్షాన జిల్లా పాలనా యంత్రాంగం నిలబడింది. సోంపేట ఉద్యమ నాయకత్వాన్ని అందిస్తున్న పర్యావరణ పరిరక్షణ సంఘం ప్రధాన కార్యదర్శి బీన ఢిల్లీరావు భార్యజ్ఞానేశ్వరిని నడిరోడ్డు మీద తగలరాని ప్రదేశంలో కొట్టి అవమానించారు. కొందరు స్త్రీలను వివస్త్రలను చేయడానికి ప్రయత్నించారు. సంఘ అధ్యక్షులు డా. క్రిష్టమూర్తి రిలే నిరాహార దీక్షలో కూర్చున్న స్త్రీలకు మద్ధతుగా శిబిరానికి వెళితే ఆయనతోపాటు స్త్రీలను చావగొట్టి చితకబాదారు. మరో నాయకుడు టి. రామారావు సంఘ ఉపాధ్యక్షులు ఆసుపత్రి మీద దాడి చేసి అక్కడ ఉన్న నర్సులను బెదిరించి చేయి చేసుకున్నారు. మహిళా రోగులనగలు దోచుకున్నారు. గర్భిణీ స్త్రీలను బయటకు ఈడ్చేసి బీభత్సాన్ని సృష్టిం చారు. ఇంత జరిగితే హోం మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఒక స్త్రీ అయివుండి కూడా అది ఒక అల్లరి మూక పని అని చెప్పటం సిగ్గు చేటు. మరి యింతగా ప్రజల్ని పోరాటంలోకి నడిపించిన ఆ పరిశ్రమ ఏమిటి? స్త్రీలు నాయకత్వం వహించి ముందుండి పోలీసుల్ని, గూండాల్ని తమ భూమిలోకి రాకుండా అడ్డుకోవడానికి అవసరమైతే తమ ప్రాణాలు వదలడానికి కూడా సిద్దపడి ఆ పరిశ్రమలను ఎందుకు ఆపాలనుకుంటున్నారు.
అభివృద్ధి, పారిశ్రామీకరణ పేరిట, ఉత్తరాంధ్ర (మూడు జిల్లాల్లో) 14 ధర్మల్‌ విద్యుత్‌ప్లాంట్లు నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించింది. అందులో శ్రీకాకుళం జిల్లా సోంపేటలో నాగార్జున కనస్ట్రక్షన్‌ కంపెనీ అనుమతి పొందింది. సోంపేట మండలంలోని గొల్లగండి, గ్రామ ప్రాంతం పరిశ్రమ ఏర్పాటుకు అనువైనదని గుర్తించింది. ఈ ప్రాంతం పురాతన రేపుల్లో ఒకటైన బారువాకు చేరువగా ఉన్న బారువ, ప్రముఖ స్వాతంత్య్ర యోధుడైన గౌతు లచ్చన్న జన్మస్థలం కూడా! 12 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 2640 మెగావాట్ల సామర్ధ్యంగల పరిశ్రమను 1890 ఎకరాల భూమి అవసరమని నిర్ణయించారు. పరిశ్రమల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ కోసం ఆంధ్ర ప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కార్పోరేషన్‌ పూనుకుంది. ప్రభుత్వ పట్టా భూమికి 80000/- ప్రయివేటు వ్యక్తుల భూమికి 2 లక్షల నుండి 3.5 లక్షల వరకు ధరను ప్రకటించారు. ఇది కూడా భూమి నాణ్యత బట్టి కాకుండా వ్యక్తుల పరపతి మీద ధర ఆధారపడి ఉంటుంది. ఇప్పటివరకు ప్రభుత్వ భూమికి 970 ఎకరాలు ప్రయివేటు వ్యక్తుల నుంచి 560 ఎకరాలు నయానో భయానో సేకరించారు. ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.నిర్మాణ ప్రదేశంలో ”బీ” అని స్థానికులు, పిల్చుకునే చిత్తడి భూములున్నాయి. ఏడాది పొడవునా వీటిలో నీరుంటుంది. మత్స్యకారులు వీటిలో చేపలు వేట చేస్తారు. రైతులు వీటి ఆధారంగా రెండు సీజనుల్లో వరి పండిస్తారు. ఈ ప్రదేశంలో నిర్మాణం చేపడితే వర్షాధారిత బీలు, జలాశయాలు ఎండిపోతాయి. దీనివలన వ్యవసాయానికి, చేపలు వేటకి జీవ వైవిధ్యానికి విఘాతం కలుగుతుంది. ఈ ప్రదేశంలో 118 రకాల పక్షులు, అంతరించిపోతున్న అరుదైన జంతువుల నాశనం అవుతుంది.
ఈ ప్రాంతం అంతా మరో కోనసీమగా భావించే ”ఉద్ధానం”లో భాగం బొగ్గు దిగుమతికి జెట్టీని సముద్రంలో నిర్మిస్తారు. కాని కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌ నిబంధనల ప్రకారం సముద్రానికి 500 మీటర్లు లోపు ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదు. ఈ నిబంధనకు వ్యతిరేకంగానే కంపెనీ చర్యలు చేపడుతుంది. ఈ పరిశ్రమల వలన గంటకు 228 క్యూబిక్‌ మీటర్ల వ్యర్ధ జలాల విడుదల వలన చేపల వేటకు సమస్యలు ఉత్పన్నమవుతాయి. చేపలు, రొయ్యల ఉత్పత్తికి ఆటంకం ఏర్పడుతుందని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. నీటిలో కాలుష్యం పెరగటం, ప్లాంటు ప్రాంతంలో భూ ఉపరితల భాగం, పచ్చదనం, మట్టి కొంతమేరకు కోల్పోయే అవకాశం ఉంది.
అయితే బూడిద, వ్యర్ధజలాల వల్ల ఎటువంటి యిబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామని అత్యంత ఆధునికమైన, నాణ్యమైన సూపర్‌ క్రిటికల్‌ టెక్నాలజీతో పరిశ్రమను నడుపుతామని నాగార్జున కన్‌స్ట్రక్సన్‌ కంపెనీ యాజమాన్యం ప్రజలను నమ్మించ డానికి ప్రయత్నించింది. తమకు అనుకూలంగా స్పందించి రిపోర్టులు యిచ్చే కొంతమంది పర్యావరణ శాస్త్రవేత్తలను, వివిధ రకాల నిపుణులను ఈ ప్రాంతానికి రప్పించి స్థానికులను మభ్య పెట్టడానికి ప్రయత్నాలు చేసింది. అదే సమయంలో సలాసపురం గ్రామం నుండి అగ్రికల్చరల్‌ యం. యస్సీ. చేసిన వ్యక్తి ఈ నష్టాన్ని గుర్తెరిగి ప్రజల ముందు పెట్టగా 2008 సం. అక్టోబర్‌ నెలలో జనరక్షణ సమితి పేరుతో బీన ఢిల్లీరావు 10 వేల కరపత్రాలు ప్రచురించి గ్రామ గ్రామాన ఆటోలో తిరిగి సమావేశం ఏర్పాటు చేయగా 7గురు రైతు ప్రతినిధులు సనపల శ్రీరాంమూర్తి, మాదిన రాఘువుల, మొదలగు వారు 7గురు హజరై దీనిని పర్యావరణ పరిరక్షణ సమితిగారూపకల్పన చేసారు. పర్యావరణ స్థానిక పరిరక్షణ ఉద్యమ నాయకులు కూడా ప్రజల పక్షాన నిలబడి నిబద్ధతతో వ్యవహరించే శాస్త్రవేత్తలను, నిపుణులను రప్పించి పరిశ్రమల వల్ల ముప్పు ఉందని ప్రకటించారు. అంతేకాకుండా గాలి, నీరు, భూమి, వాతావరణం మొత్తం వేడెక్కుతుందని అనేక జబ్బులు వస్తాయని, వ్యవసాయం కుంటుపడుతుందని తద్వారా ఆహార ధాన్యాల కొరత ఏర్పడు తుందని మత్స్య ఐక్యవేదిక ఏర్పడి ప్రజలు పర్యావరణ సమితి, తీర ప్రాంత మత్స్యకార ఐక్యవేదిక వాటి తీరుతెన్నులను ప్రజల ముందర ఎండగట్టారు.
తరువాత క్రమంలో సోంపేటలో ఉన్న లోకనాధేశ్వర కళాపీ సంఘం ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ సమితికి మద్దతుగా పవర్‌ ప్లాంటుకు వ్యతిరేకంగా బందు పిలుపు ఇవ్వడం జరిగినది. అప్పుడు ఈ ప్రాంత మేధావి వర్గం, డాక్టర్లు, అడ్వకేట్సు, తాపీ మేస్త్రీల సంఘంవారు, ఉపాధ్యాయులు, వ్యాపార వేత్తలు, స్వచ్ఛంద సంస్థలు వారంతట వారు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఈ జరుగుతున్న దానిపై చర్చించుకొని పరవాడ, తాల్చేర్‌ ప్లాంటులు చూసి వచ్చి అపుడు పర్యావరణ పరిరక్షణ సమితికి మద్దతు తెలపడం జరిగింది. అప్పటినుండి పర్యావరణ పరిరక్షణ సంఘంగా మార్పు చెందింది. సంఘ అధ్యక్షులు డా. క్రిష్టమూర్తి ముందుగా ఒక డాక్టరుగా ప్రజారోగ్యానికి, పర్యావరణానికి ప్రాధాన్యత యిచ్చి ఈ ఉద్యమాల్లో పాల్గొన్నారు. ప్రజల జీవించే హక్కులకే భంగం ఏర్పడుతుందని గ్రహించి ప్రజాపోరాటానికి ఇతర సంఘాలను కలుపుకుని ఇక్కడ మెకానిక్‌ ఇంజనీర్‌ చదువుకొని ఈ ప్రాంతంలోనే విద్యాసంస్థలు నడుపుతున్న సంఘ ఉపాధ్యక్షులు రామారావు పోరాటంలో చేరి ముందుకు సాగుతున్నారు. ఈ ఉద్యమ ప్రాంతంలోకి అన్ని అస్తిత్వ వర్గాల వృత్తుల యూనియన్లు భాగస్వామ్యంలో సంఘం మరింతగా బలపడింది.
ఉద్యమ నేపధ్యం :
పోలీసు, రెవెన్యూ శాఖలు నయానో కొంతమంది దగ్గర భూమిని యిక్కడ కూడా ప్రజల నుంచి బలవంతంగా లాక్కొవడం జరిగింది. కానీ పోరాటాలకు మారు పేరైన శ్రీకాకుళం సోంపేట వాస్తవ్యులు తమపట్ల జరిగిన మోసాన్ని త్వరితగతినే గ్రహించారు. అందుకే గ్రామ గ్రామాన ప్రజలు ధర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టును మనసా వాచా ప్రతిఘటించారు. అవసరమైతే తమ ప్రాణాన్ని ఓడైకడనా నిలువరిస్తామని శపథం చేసారు. తమ భూములలోకి వచ్చే వారికి మొదట నుంచి అడ్డుకోవడానికి ప్రయత్నించారు. గ్రామ గ్రామాన వీధి వీధినా సభలు పెట్టుకున్నారు. అభివృద్ధే ప్రధానమని అధికార కాగ్రెస్‌పార్టీ స్పష్టంగా ప్రకటించింది. పరిశ్రమను అడ్డుకునే ప్రయత్నాలకు ఎవరూ సహకరించవద్దని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ముందుగానే కాంగ్రెస్‌ శ్రేణులకు పిలుపు నిచ్చారు. సోంపేటలో ఎన్నో దశాబ్దాల అనుబంధం గల సర్దార్‌ గౌతు లచ్చన్న కుమారుడు మాజీ మంత్రి గౌతు శివాజీ కూడా బహిరంగంగా ఈ పరిశ్రమకు మద్దతునిచ్చాడు.
స్థానిక పరిస్థితుల వలన కొందరు కాంగ్రెస్‌ శ్రేణులు ఉద్యమంలో పాల్గొన్నా ప్రజలకు వారి స్టాండు తెలుసు. ఉభయ కమ్యూనిస్టు పార్టీల సీనియర్‌ నాయకులు ఒకటి రెండు సార్లు వచ్చి బహిరంగ సభల్లో ఉద్యమానికి మద్దతు ప్రకటించినా మమేకం కాలేకపోయారు. ఇక సి.పి.యం. ప్రభుత్వం నందిగ్రాంలో పారించిన రక్తపుటేర్లు వారి కళ్ళ ముందు కదులుతూనే ఉన్నాయి. ప్రజారాజ్యం పార్టీ సీనియర్‌ నాయకులు ఒకటి రెండు సార్లు వేదికలపై ఉపన్యాసాలు యివ్వడం తప్ప ఉద్యమంలో కొనసాగిన దాఖలాలు లేవు. శ్రీకాళం జిల్లా ఏకైక శాసన సభ్యుడైన పి. సాయిరాజ్‌ స్థానికులకు దూరమైపోతాననే భావనతో మద్దతు ప్రకటించినా, దాదాపు 194 రోజుల పాటు ఉద్యమంలో భాగస్వామిగా కన్పిస్తూ కుంటి సాకులతో ఉద్యమాన్ని చీల్చి స్థానిక తెలుగు దేశం నాయకులు ఉద్యమ కారులకు షాకిచ్చారు. అయినా రాజకీయ పార్టీల నిజాయితీ, నిబద్ధత, చిత్తశుద్ధి పట్ల ప్రజలకు వుండే సందేహాలు ప్రజలకున్నాయి.
గత ఏడాది ఆగష్టు 8న మానవ హక్కుల వేదిక బాలగోపాల్‌ తదితర నాయకులు పాదయాత్ర నిర్వహించి ఉద్యమానికి మద్దతు తెలిపారు. అదే నెల 18న గొల్లగండిలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో దాదాపు అందరూ పరిశ్రమను వ్యతిరేకించారు. ఆగష్టు 29న ముఖ్యమంత్రిగారిని, తెలుగు దేశం పార్టీ నేత చంద్రబాబుగారిని పి.ఆర్‌.పి. నేత చిరంజీవిని, సి.పి.ఐ నేత నారాయణను, లోక్‌సత్తా నేత జయప్రకాష్‌ నారాయణని కలిసి ఉద్యమకారులు వినతి పత్రాలను ఇచ్చారు. అదే రోజు మానవ హక్కుల కమీషన్‌ ఛైర్మన్‌ శ్రీ సుభాషణ్‌ రెడ్డి గారిని కూడా కలిసి సదరు మహజరు ఇవ్వడమైనది. రైల్‌రోకోలతో మొదలై డిసెంబరు 5న పదిమందితో రిలే నిరాహార దీక్ష శిబిరం ప్రారంభించడం జరిగింది. కాల్పులు సంఘటన జరిగే నాటికి అనేక గ్రామాల నుంచి స్త్రీలు పాల్గొని 222 రోజులు పూర్తి చేసారు. గత జనవరిలో ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులు మమతా బెనర్జీ, జైపాల్‌ రెడ్డిలను కలిసారు. సోనియా, రాహుల్‌ గాంధీ, మన్‌మోహన్‌లకు వినతి పత్రాలు సమర్పించారు. ఫిబ్రవరిలో జాయింట్‌ కలెక్టర్‌ పర్యటనను అడ్డుకుని అదే నెల 25న భారీ ఎత్తున ప్రజాగర్జన సభ ఏర్పాటు చేసారు. ఏప్రిల్‌లో రామన్‌ మెగసెసే అవార్డు గ్రహీత, ప్రముఖ పర్యావరణ వేత్త సందీప్‌ పాండే ఈ ప్రాంతాన్ని సందర్శించారు. జూన్‌ 21న నర్మదా బచావో ఉద్యమ సారధి మేధా పాట్కర్‌ ఈ ప్రదేశానికి వచ్చి వీరి ఉద్యమానికి మద్దతు పలికారు. యిప్పటికీ ఉద్యమకారులపై 25 కేసులు తాజాగా కాల్పులు సందర్భంగా హత్యానేరారోపణలపై కేసులు బనాయించారు. వాటిలో 10 నాన్‌ బెయిల్‌బుల్‌ కేసులు, ఆరుగురిపై రౌడీ షీట్‌కేసులు తెరిచారు. యస్‌.సి, యస్‌.టి కేసును సంఘ ప్రధాన కార్యదర్శిపై మోపారు. కానీ ప్రజల మనోభావాలను గుర్తించలేదు సరికదా చివరకు జూలై 14న పిట్టల్ని కాల్చినట్టు కాల్చారు.
సోంపేట ప్రజల్ని పిట్టల్ని కాల్చినట్లు కాల్చాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ప్రపంచీకరణ, ప్రయివేటీకరణ విధానాల అమలు ఈ దుర్మార్గానికి మూలం.
రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం ప్రపంచ వ్యాప్తంగా జాతీయోద్యమాలు ఉవ్వెత్తున లేచి సామ్రాజ్యవాదుల విస్తృత కాంక్షను వెనక్కి తిప్పి కొట్టారు. పాత పద్ధతులలో తమ ప్రభావాన్ని కొనసాగించలేమని అబివృద్ధి చెందిన దేశాలు గుర్తించాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలలోని పాలక వర్గాలను బుట్టలో వేసుకొని వారి ద్వారా తమ దేశంలోకి పెట్టుబడిదారులు, బహుళ జాతి సంస్థల ప్రయోజనాలను కాపాడటానికి నడుం బిగించారు. ఆయా దేశాలలో పెట్టుబడులు పెట్టి ఆ దేశ సహజ వనరులను ఉపయోగించుకొని పరిశ్రమలు స్థాపించి లాభాలను తమ దేశాలకు తరలించుకు పోవడం జరుగుతుంది. అందుకు స్థానిక దళారీ సంస్థల సహాయం కోరడం జరుగుతుంది.
మానవ జీవితానికి సంబంధించిన ప్రతి విషయం ఇక్కడ వినియోగ వస్తువుగానే పరిగణించబడుతుంది. అందుకే మనకు కావల్సినంత విద్యుత్‌ ఉత్పత్తి ఉన్నప్పటికీ దాని పేరిట లాభాలను కొల్లగొట్టాలని ప్రయత్నిస్తున్నారు. సోంపేట మీద కూడా ఆ ప్రపంచీకరణ రాబందు నీడ పడింది. అందుకే ప్రజల ప్రాణాలను అంత సులభంగా తీయగలిగారు.
ఈ పాశవిక ఘటనకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగానూ ప్రజా సంఘాలు ప్రజల పక్షాన నిలబడ్డారు. ప్రతి జిల్లాలోనూ సంఘటనలకు ఖండిస్తూ మత్స్యకారులు, రైతు సంఘాలు, ప్రజాస్వామ్య వాదులు ధర్నాలు, మౌన ప్రదర్శనలు, కలక్టరేటు ముట్టడిలతో తమ నిరసనను తెలియజేసారు. మానవ హక్కుల వేదిక, సాంప్రదాయ మత్స్యకారుల సమితి, ఇండియన్‌ పీపుల్స్‌ లాయర్స్‌, పర్యావరణ పరిరక్షణ సంఘం, ప్రజా ఉద్యమాల జాతీయ సమాఖ్య మానవ హక్కుల కమీషన్‌కు న్యాయవాది హేమా వెంకట్రావు ద్వారా పిటీషన్లు దాఖలు చేసారు. తక్షణమే పోలీసులను ఉపసంహ రించాలని, ఉద్యమకారుల ప్రాణాలకు పోలీసుల నుండి, కంపెనీ యాజమాన్యం నుండి రక్షణ కల్పించాలని నాగార్జున కనస్ట్రక్షన్‌ కంపెనీకి చట్టవ్యతిరేకంగా మద్దతునిచ్చి ప్రజల ప్రాణాలను హరించిన వారిపై న్యాయ విచారణ జరిపించాలని, జరిగిన సంఘటనలపై కమీషన్‌ ఆధ్వర్యంలో కమీషన్‌ ఏర్పాటును లేదా హైకోర్టు సిట్టింగు జడ్జితో విచారణ ఆదేశించాలని, కంపెనీ యాజమాన్యపు గుండాలు ప్రజల్ని భయ భ్రాంతుల్ని చేస్తుంటే ఈ విషయాన్ని కలెక్టర్‌ దృష్టిికి తెచ్చినా స్పందించని కలెక్టరుపై చర్య తీసుకోవాలని, ముఖ్యంగా ”అశోక్‌ కుమార్‌, నవీన్‌ కుమార్‌” ఎస్త్సెలు ప్రజలకు సినిమా చూపిస్తామని అడ్డుకుంటే ప్రాణాలు తీస్తామని బహిరంగంగా ప్రకటించినందుకు తక్షణమే వారిని సస్పెండు చేయాలని, ఉద్యమ కారులపై ఆక్రమంగా బనాయించిన కేసులను ఎత్తివేయాలని, హత్య, లూటీ, దాడి, స్త్రీలపై అత్యాచార ప్రయత్నం, ఇతరుల భూములలోకి అనుమతి లేకుండా ప్రవేశించడంపై పోలీసులపై, గూండాలపై సంబంధింత ఐ.పి.సి సెక్షన్‌ క్రింద కేసులు పెట్టి అరెస్టు చేయాలని, వారిని విధులనుండి బహిష్కరించాలని కోరారు. ముఖ్యంగా మహిళా నాయకురాలు అయిన జ్ఞానేశ్వరిని బహిరంగంగా బట్టలు ఊడదీసి అవమాన పరిచినందుకు, మౌర్య ఆసుపత్రిలో, శిబిరంలో స్త్రీలపై జరిగిన దాడులకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. దీనికి కొంత అనుకూలంగా స్పందించిన మానవ హక్కుల కమీషన్‌ ఉద్యమ కారులను బెదిరింపులకు గురిచేయవద్దని, ఎలాంటి హాని తలపెట్టవద్దని తక్షణమే వైద్య సహాయం అందించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నిజానికి మానవ హక్కుల కమీషన్‌ ఎక్స్‌గ్రేషియాకై ఆదేశిస్తామని తెలిపినా అలాంటిదేమీ వద్దని న్యాయవాది ద్వారా హక్కుల కమీషన్‌కు తెలిపారు. అలాగే మేథాపాట్కర్‌, మిగతా మేధావులు తమ ప్రాంతానికి వచ్చినా ఎట్టి పరిస్థితులలోను పునరావాసం కొరకు ప్రస్తావించవద్దని ఉద్యమ కారులు కోరారు. ఆ సంఘటనా స్థలానికి వెళ్ళి నిజా నిజాలను కమీషన్‌కు తెలియచేస్తామన్న న్యాయవాది ప్రతిపాదనను మానవ హక్కుల కమీషన్‌ ఆమోదించింది.
సమత అనే స్వచ్ఛంద సంస్థ పర్యావరణ అప్పిలేటు కమీషన్‌కు పిటీషన్‌ దాఖలు చేయగా కంపెనీ యాజమాన్యం వాస్తవాలను తప్పుదోవ పట్టించింది. కాబట్టి పూర్తి అధ్యయనం తరువాతే అనుమతుల్విడం జరుగతుందని వారు ఆదేశించారు. ఇవన్నీ కొంతమేరకు ప్రజలు సాధించిన విజయాలే.
కానీ ధర్మల్‌ ప్లాంటు ఆగిపోయేంతవరకు విశ్రమించకూడదని పట్టుదలతో ఉన్నారు. అంతేకాకుండా పరిశ్రమను ఆపడమే కాదు. ఇప్పటివరకు ఆక్రమంగా బెదిరించి, మోసగించి తమ వద్దనుండి లాక్కున్న భూములను డీ-నోటిఫై చెయ్యాలని, డిమాండు చేస్తున్నారు.
గత రెండు సంవత్సరాలుగా నిరవధికంగా రిలే నిరాహార దీక్షలు ధర్నాలు, బందులు, ప్రజల్ని చైతన్య పర్చడం, అన్ని ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాడే ప్రజలందరిని కూడగట్టడం, కుళ్ళు రాజకీయాలకు అతీతంగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ఉద్యమాన్ని నిర్మించి 3000 మంది పోలీసులు, మరో వెయ్యి మంది గుండాల ప్రయివేటు సైన్యానికి ఎదురు నిల్చి ఉద్యమ స్ఫూర్తిని నిలబెట్టడంలో సోంపేట, దాని చుట్టూ ఉన్న 84 గ్రామాల ప్రజలు ముఖ్యంగా మహిళలు ప్రదర్శించిన తెగువ అన్ని ప్రజా పోరాటాలకు ఆదర్శం అనుటలో అతిశయోక్తి లేదు. అందుకే ఇప్పుడు సోంపేట శ్రీకాకుళ పోరాట బావుటా.
(రచయిత్రి సోంపేట ఉద్యమ సంఘాల న్యాయవాదిని) ఫోటోలు పంపిన ప్రశాంతి ఉప్పలపాటి, రాకేష్‌రెడ్డి దుబ్బుడుకి ధన్యవాదాలు.)
వీర గున్నమ్మ దారిలో…
స్త్రీవాదం అంటే మనం, మన కుటుంబం అనే చట్రాలను దాటుకొని వాటికి మూలాలైన సామాజిక, ఆర్థిక, రాజకీయ, వ్యవస్థల మార్పుకై నడుం బిగించి సెజ్‌లకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న మహిళలెందరో. ”కాకినాడ” రాములమ్మ ”పోలేపల్లి” చుక్కమ్మ ”జిందాల్‌” దేవుడమ్మ, ”మహాముంబాయి” ఉల్కా మహాజన్‌, ”మంగుళూరు” విద్యా నటేషన్‌..వీరిలో కొందరు మాత్రమే!!
సోంపేట ప్రాంతానికి చెంది, 1940 సం. లో జమీందారీ వ్యతిరేక పోరాటంలో అమరురాలైన వీర గున్నమ్మ స్ఫూర్తిని ఎత్తిపడుతూ సోంపేట మహిళలు వీరోచితంగా తిరగబడ్డారు. ఇక్కడ స్త్రీలంతా శ్రామిక వర్గానికి చెందిన వారే. మత్స్యకార కుటుంబాలకు చెందిన స్త్రీలు, మగవారు వేటచేసి రాగా చేపలను ఆరబెట్టి, గ్రేడింగు చేసి, అమ్మకాలు చేసేవారు. మిగిలిన కులాలకు చెందిన వారు రైతు కూలీలుగాను, తమకున్న కొంత భూమిని సాగు చేసుకుంటూనే, కుల వృత్తులు చేసుకుంటూ ఉపాధిని పొందుతూ కొంత మేర ఆర్ధికంగా నిలబడ్డావారే. అందుకే ఇతర సెజ్‌లలోలాగానే ఇక్కడ స్త్రీలు కూడా థర్మల్‌ విద్యుత్‌ ప్లాంటు యాజమాన్యపు మాటలు నమ్మి ఉపాధిని పోగొట్టుకోదల్చలేదు. ఉద్యోగం పురుష లక్షణం అని నమ్మే సమాజంలో ఎలాంటి ఉపాధి కంపెనీ నుండి దొరుకుతుందో వారికి తెలుసు. అందుకే ససేమిరా అన్నారు. ప్రభుత్వ స్వయం సహాయ బృందాలకు చెందిన మహిళలు ఉద్యమంలో పాల్గొనకూడదని ప్రభుత్వం పరోక్షంగా హెచ్చరించినా సంక్షేమ పధకాలు నిలిపివేస్తామని బెదిరించినా పోరులో ముందు భాగాన ఉన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రాజెక్టులు మాకొద్దు, మా సహజ వవనరుల్ని ఆక్రమించవద్దని ఆక్రందనలు చేసారు. పాద యాత్రలు, ప్రజాభిప్రాయ సేకరణ, సమావేశాలలో ఒకటిగా ఉద్యమించి భాగస్వామ్యమయ్యారు. గురి చూసి కాలుస్తున్న పోలీసుల్ని బ్రతిమిలాడారు. ప్రాధేయపడ్డారు. వారికి ఎదురు నిలిచి తమను గురి పెట్టమన్నారు. ధర్మల్‌ పవర్‌ ప్లాంటుకు వ్యతిరేకంగా మహిళలు పెద్ద ఎత్తున కదిలారు.

Resistance to Imperialist policies- Kakinada Anti SEZ Struggle

Special Economic Zone (SEZ) is a key instrument for furthering the imperialist policy of Globalization, Privatization and Liberalization which is enacted in the year of 2005. It is to pave the way for the Multi National Corporations (MNC) to acquire prime agriculture land to set up their enclaves where they are free to do virtually what ever they want. The SEZs are anti people anti constitutional and imperialistic in nature. Once the SEZs are established the economy will be controlled by few capitalists forces where the rich becomes richer and poor becomes more poorer . It is to satisfy these sections of the capitalists, the ruling class is ready to sacrifice the sovereignty of the country. Peoples land is being taken off them often at low market rates.
Land, a sacred trust is being commodified by using state muscle to deny farmers their rights and then establish corporate monopoly on land ownership.The large scale uprooting of millions of farmers in Andhra Pradesh ,U.P, West Bengal, Maharashtra is breaking the sacred bond between peasants and the land which supports them. The situation at Kakinada is not vary from other SEZs. The victims of land grabbing of Kakinada SEZ have been struggling since 3 years for their right to live as guaranteed by the constitution of India.
Considered the rice granary of India, East Godavari district has always been in the forefront of all-round economic development setting itself as a role model for several districts not just in Andhra Pradesh but in other states as well. Situated in the north of Andhra pradesh and bounded by visakhapatnam, west godavari and Khammmam districts and the Bay of Bengal the district is endowed with abundant natural resources and scenic beauty that has few places in the country. The district has history of anti colonial struggles and produced revolutionary warriors such as Alluri Sitarama Raju who fought against British Raj. The present proposed SEZ is located about 20 kilometers away from the city of Kakinada.
On March 07,2008 on eve of International Women’s Day, thousands of women of Kakinada SEZ Vythireka Mahila Sangham along with their men scathing attack against formation of SEZ in their home land. The members of sangham entered into the forcibly occupied fields of KSEZ and demolished the constructions and destroyed the fencing. Truly, it was a turning point in our struggle and it is surely inspiration to other sez struggles . 
Acquisition of land – A Violation of fundamental rights
The constitution of India has guaranteed rights to its citizens. As per the article 21 of constitution every citizen has right to live, with dignity and prosperity. The SEZ act itself is against the spirit of this article. The acquisition of land in Kakinada is being done fraudulently and using coercive methods. The people are threatened and terrified to leave their home land and hand over the lands to KSEZ by the revenue officials and police. They are subjected to all sorts of humiliation. The political forces are being used to divide the people The process adopted for the acquisition of land for SEZ is therefore is violation of fundamental rights. The SEZ act as significantly contributed to India’s real estate boom yet the harsh reality is that the land is taken from farmers to benefit private enterprise which is the precondition for globalization. A large population of country consist of agrarians who will be unemployed in a market that seeks only skilled labourers and just compensation for acquired property remains questionable.
Kakinada SEZ – A classic Example
In 2005, a memorandum of understanding between the Government of A.P and Oil and Natural Gas Corporation on 03.03.2005 to establish an oil refinery as an SEZ near Kakinada, for which an area of 10,000 acres had to be acquired under the Land Acquisition Act, 1894. Being intensively cultivated paddy growing area, there were protests from the farmers and farm labourers, the latter organized by leftist organizations. For reasons which have never been made public, but most probably because of pressure exerted by the real estate lobby, the notification was not followed up but a fresh notification was issued for about the 12,000 acres of land in U.Kothapally and Thondangi mandals, which are away from the developed areas near Kakinada and politically dormant. The real estate sector is on high growth path according to recent reports in The Economic Times. Almost simultaneously the ONGC, the original beneficiary of the proposed SEZ, declared that it had no interests in the proposal. But the government went ahead nevertheless with aggressive acquisition strategy.
 
Corporate feudalism
A developer called K.V. Rao of the KSEZ Pvt. Ltd entered the picture, while the notification was in the force, he was allowed to ‘persuade’ the landowners to sell land to him, citing the delay and other difficulties incidental to land acquisition proceedings and was given large scale subsidies. This is a criminal subsidy the state is giving to the rich by stealing from the poor. The revenue authorities aided the developer and his brokers (middlemen) who started roaming the villages of these mandals, on a daily basis, in village after village. A price of Rs. 3 lakh was arrived at an negotiations with some willing sellers, and the developer’s men with the active connivance of the revenue authorities used intimidators tactics, threatening the farmers that if they did not sell their lands at Rs. 3 lakh not to the KSEZ Pvt. Ltd, they would have to accept the government rate of one lakh or one and a half lakh and would have to run around courts or years if they wanted more. A ‘s land and then tell his neighbor B that the SEZ will come up in his neighborhood and he cannot continue his cultivation so he had better to sell his land too. In some cases they even lied about the neighbor having sold his land.
Many of the innocent semi-literate farmers, threatened and misled by the revenue authorities, the developer’s men and their brokers sold away their lands. About 45% of the proposed land was acquired by the developer by these means. The registration papers described these lands as barren and vacant, that these are no proper irrigation facilities, that the income of the farmers on these lands is insufficient, and hence the farmers are “ voluntarily” agreeing to sell their lands at Rs 3 lakh per acre to the KSEZ authorities in a “mutually agreeable” manner. Many times the poor did not get compensation at all due to the absence of land titles.
In reality, the lands of the farmers are replete with lush green foliage. They grow mango, caesarians, cashew, sapota, amla, coconuts and numerous other crops. The crops grow in abundance on these fertile lands. The lands also have good facility of natural water resources and good filter points and therefore there are no problems of watering the lands. Irrigated by the canals of the Godavari and Eluru, these lands enable three successful harvests annually, including paddy crops. Both the farmers and farm laborers, whose livelihoods depend on these lands, know no drought or hunger, suicides are unheard of.
Rehabilitation and resettlement package is an illusion
Fifteen hundred sheep rearing and 1000 families of toddy taping, pot makers, black smith families are dependent on their profession and serving the community. Much of the population are Dalits who are working as farm labourers are dependent on the land. Government has issued G.O No. 68 which promises relief to the victims, this rehabilitation and resettlement policy adopted by the government is specially prepared for the SEZ affected people. The rehabilitation package which was announced by the government is not acceptable to the people because the package merely announced by the government it never allowed people to be part of decision making. The forced and aggressive implementation of this package created big hue cry in the community. The middle men are minting up money from the people and government to bargain for better settlement. Castist forces and dimensions are playing substantial role in the same. The package announced by the government is more patriarchy in nature and anti class oriented. There is no space for women and artisans in the total package.
SEZ ACT is anti people
The SEZ Act was passed to boost so called Economic development in India. However, the Land Acquisition Act,1894 does not clearly define the scope o land acquisition for the public purpose. Essentially has been used by the government to acquire land for private corporations. Now the public out cry against SEZ act is that it is “anti peasantry, anti rural poor, anti labour and anti environment”. So the Land Acquisition Act is in dire need of scrap. It permits 70% of the land required to be purchased by the company or corporation and 30% can be acquired for private projects by the government. The question is whether SEZ is really required so much land as often done. Even SEZ prescribes that out of acquired land 25% to 50% can be used for the establishment of units and remaining land can be used for infrastructure development, which obviously lures the investor to go for real estate business. The land acquisition is also contradicts the purpose of Act itself which was supposed to use to acquire for the public purpose and not for private and monopoly ownership rights.
Battle in the courts : strengthening the struggle:
In 2006,the farmers organised themselves and formed a SEZ Vythireka Porata Samiti (SVPS), which has been protesting against the dubious and coercive acquisition of land done for the Kakinada Special Economic Zone. In December 2007 the State human right commission (SHRC) passed an interim order for the East Godavari Administration “not to adopt any coercive methods against the farmers to part with their lands or offered by them” the commission also decided to investigate the matter further and was supposed to make a site visit the area which is still pending. A writ petition filed by farmers in the High Court questioning the legality of the land acquisition is also pending in the High Court and there is stay of dispossession of the petitioners. But the government has formally completed the land acquisition proceedings ex parte insofar as the other farmers are concerned (those who have not succumbed to the developer and those who have not gone to the High Court and is threatening to use force to take possession of that land and to help the develop to take possession of the lands he has fraudulently purchased.
Over the last few months members of the KSEZ Vythireka Porata Samithi have been threatened , harassed and arrested many times all this is being done to create fear in the minds of the farmers and debilitate the process of the SHRC fact finding. The respondents advocate (a senior advocate from Delhi) argued that this case does not come in purview of Human Right Commission and further he argued that it has no jurisdiction and KSEZ is not affecting he article 21 of Constitution of India which guarantees Right to live quoting different case laws. It shows how colonial policies and interests are safeguarded even by the judiciary.

Vote bank politics – dubious standards

The opposition parties and other main stream parties are are playing dubious role. It is surprised to note that the then ruling party Telugu Desam which had given approval to KSEZ is now opposing the SEZ because to get the vote bank for the coming election.Bharathiya janatha party(BJP), Bahujan Samaj Party (BSP) which have local stand has been supporting peoples struggles though they are not opposing SEZ policies. The so called left parties have not taken any clear cut stand till today. CPI state committee members visited the struggle area and supported the peoples fight and formed Costal Corridor Parirakshana Committee in which members of anti KSEZ movement have also taken part. The CPM party which is main culprit in killing of Nandigram farmers to create SEZ is silent about SEZs in A.P. In the beginning of the struggle few CPI ML parties had involved to organize the sections of the poor farmers except CPI (ML) liberation, however with intervention of the NGOs they withdrew from the scene.

Solidarity of Peoples Organizations : boon for the struggle

It is also pertinent to state that the members of the sangham participated in yatra organized by National alliance for peoples movement from Nandigram(Kolkata) to Gorai (Mumbai). Members of various peoples organizations have visited the area and extended their solidarity. KSEZ Vyathireka Porata Sangham also approached all the Democratic forces at state level to support their struggle, organizations like Virasam (Revolution Writers Association) Patriotic and democratic movement (PDM), Human Rights Forum (HRF) APCLC (Andhra Pradesh Civil Liberties Committee), National Alliance for Peoples Movement and Andhra Pradesh Vyavasaya Vruttidarula Sangham (APVVU). etc The Non Governmental Organization KADALI which initiated the process to create awareness among people against SEZ is continuing the support the peoples movement.
Active involvement in other Anti SEZ movements: Sangham members are actively involved in other anti SEZ movements in Andhra Pradesh. Harassed members extended their support to struggles of Polepally, Coastal Corridor, Dibba Palem and other struggles. Efforts are being made to form a Coordination committee at state level to enhance fight against evil SEZ. Democrats and all progressive sections of the society were informed to take part in the struggle and collaborate with us.

Current Situation

 In spite of State Human Rights Commissions’s mid term order and several instructions from it the government is taking hasty steps to oppress the movement by using police and military forces and people of the area are living under fear day in and day out. Community leaders are being charged with many cases and terrified by the police. Possession of land is still with the farmers only and cultivating the land except in rehabilitation area. The displaced and harassed land lords are approaching the local courts for cancellation of registration under appropriate acts. Repeatedly farmers are approaching the Human Rights Commission when ever their rights are violated. Committee is planning to file a Public Interest Litigation in High Court. Recently under Section 30A of Land Acquisition Act 1894 notices are served to the parties stating that their awarded money for their Committee acquired land is deposited in the courts and if necessary to approach the courts as last resort.
Struggle Committee along with farmers has decided to continue their fight against SEZ as well as Coastal Corridor as it is booming up in our area.
Your solidarity actions are essential to continue our fight against imperialist policies and to intensify our struggles to scrap SEZs.

Text