Wednesday, April 25, 2012

warangal,telangana
Mangalore sez
with Vidya Nateshan-Mangalore Sez  
ksez area
disscussing with Medha Patkar- year 2009

Tuesday, April 17, 2012

దడాలపాలెం-దుగ్గాడ

kakinada sezదడాలపాలెం-దుగ్గాడ



రెండూ ఊర్ల పేర్లే !అవే మనుషుల పేర్లుగా ఎలా ఎదిగి వచ్చాయో  చూద్దాం.మామూలుగా అయితే ఒకే ఇంటి పేరు గలవారందరూ వుండే పేట పేరు అయినా ఊరు పేరు అయినా అదే వుంటుంది.కాని ఒక పిల్లని  'దుగ్గాడ' అని పిలుస్తుంటే ఒకింత ఆశ్ర్యపోవడమే  గాక మరింతగా ఆలోచనలో పడిపోయాను.
 అది కాకినాడ సెజ్ ప్రాంతం. అంటే అది ఏదో విహార ప్రదేశం కాదు సుమా!పచ్చని పంట పొలాలలో పెట్టుబడి పెట్టిన చిచ్చు .స్పెషల్ ఎకనామిక్ జోన్ (సెజ్ ).ప్రత్యేక ఆర్ధిక మండలి .2005 లో పార్లమెంట్ చట్టం కూడా చేసి పారేసింది .నానా దేశాల కంపెనీలు పరిశ్రమలు పెట్టుకోడానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా రైతులు తమ భూములన్నిటిని నామ మాత్రం నష్టపరిహారం తీసుకొని ఏలిన వారికి అప్పగించడమే తరువాయు.అయితే అప్పుడు వచ్చింది చిక్కు.కడుపు నిండా తిండి పెట్టె కన్నతల్లిని ,పుట్టిన ఊరిని విడిచి పెట్టి ఉండలేని రైతాంగం తిరగబడింది .


                                                                             బాలగోపాల్
బాలగోపాల్ లాంటి మేధావులు ,స్థానిక ప్రగతి శీల శక్తులు వారిని బలపరిచారు .2007  లో అంతర్జాతీయ మహిళా దినం స్ఫూర్తి తో పెద్దేత్తున మహిళలు సభ జరుపుకొని ,సెజ్ నిర్మాణాల  ఫై దాడి కి దిగారు .ఆ తర్వాత క్రమము లో సెజ్ వ్యతిరేక పోరాట కమిటి కార్యక్రమాలు కూడా  ఊపు అందుకొన్నాయి .అప్పుడు చాల తెలివిగా సెజ్ యాజమాన్యం భూమి లేని దళిత గ్రామాల ఫై కన్ను వేసింది .ఐదు దళిత గ్రామాలను మొత్తం గా తుడిచి పెట్టె కుట్ర పన్నింది.దడాలపాలెం కేంద్రంగా దళితగ్రామాలు ఐక్య పోరాటాలకు సిద్దమవుతున్నతరుణం.దడాలపాలెం పేరుకే ఊరు ,వాస్తవానికి చిన్న పల్లె,పెద్ద కాలనీ.ఒకప్పుడు ఎలా ఉండేదో కాని ఊరు ,ఇప్పుడు అన్నీఇందిరమ్మ ఇండ్లె.ఓ యాభై గడప దాక ఉంటై 






                                         వడ్డీ నూకరాజు




...అందులో ఒకే ఒక్క సర్పంచ్ వడ్డీ నూకరాజు .అతగాడి ఇల్లు ఒకటే  పెద్ద డాభా.ఓ ఇరవై ఎకరాల భూమికి అధిపతి అతడు .ఆ ఊరు లో చాలా మంది ఇంటి పేరు దడాలే.అందరి గుండెల నిండా దడే కాబోలు!
 ఆ కాలని కి ఒక చివర ఉప్మా బడి .అంగన్వాడి స్కూల్ .ఆ స్కూల్లో పిల్లలకి ఉప్మా పెడతారు కాబట్టి అది ఉప్మా బడి .దాన్ని ఆనుకొనే చిన్న ప్రాథమిక పాటశాల .వాటికి దగ్గర లోనే ఒక చిన్న చర్చి .ఆ పల్లెకి రేడు పక్కలా రెండు మట్టిరోడ్లు .అవి ,రెండు కిలోమీటర్ల దూరం లో బంగాలఖాతం సముద్రానికి పక్కనే వున్నా బీచ్ రోడ్డుకు కలుస్తాయి .రోజులో ఓ నాలుగు మాట్లు పిఠాపురం ,కాకినాడ బస్సులు తిరుగుతాయి ,ఆ రూట్లో .
 ఆ ఇండ్ల చుట్టూ కొబ్బరి చెట్లు కప్పేసి ఉంటాయి.ఆ ఊరి చుట్టూ సరుగుడు ,జీడిమామిడి వృక్షాలు ,తాడి చెట్లు అడివిలా అలుముకొని ఉంటాయి .ఇసుక నేలలు.నేలబావులు .పచ్చటి ప్రకృతి .ప్రశాంత మైన గాలి ,పరమలించే వెన్నల .పలకరించే చుక్కల ఆకాశం .దడాలపాలెం గురుంచి దడ పుట్టేలా చెప్పేసినట్టు ఉన్నాను కదా !
సర్లెండి ,సర్పంచ్ వడ్డీ నూకరాజు గారి డాబా పైకి వెళదాం సరదాగా !ఇంటి బయట, పొలం నుంచి అలిసిపోయు వచ్చి నూకరాజు నిదురపోతున్నాడు.అతడి భార్య నాగవేణి .అరవై ఏండ్ల నూకరాజుకి ముప్పై ఏండ్ల పడుచు భార్య .నలుగురు ఆడపిల్లలు వారికి .ఊరు ఊరంతా నూకరాజు ని 'నాన్న' అని పిలుస్తారు,ఇంట్లో పిల్లల్లాగే .నిజంగా అతడు ఊరంతటికీ తండ్రి లాంటి వాడే .ధరమ తండ్రి .మాట అంటే మాటే .మాట కోసం ,నిజాయీతీ కోసం ఇందిరమ్మ కాంగ్రెస్స్ రాజకీయాలలో ,40 ఎకరాల లోంచి సగం భూమి వేల్లిపోయు దంట.
నూకరాజు ,నాగవేణి ల కడగొట్టు పిల్ల పేరు విజయలక్ష్మి .ఉప్మా బడికి వెళుతుంది .ఆ పిల్లకి ,పక్కింటి పాకలో ,తన ఈడే వుండే బెతేన బేబి బెస్ట్ ఫ్రెండ్ .ఆ అమ్మాయి ది ఆ ఊరు కాదు.వేరే ఊరు .దుగ్గాడ..అయితే ఆ పేట లో అందరు  
దడాలపాలెం  ఊరు పేరు .దుగ్గాడ ఊరు పేరే .కాని ఇక్కడ ఇప్పుడు అమ్మాయి పేరు .నూకరాజు కూతురు విజయలక్ష్మి కూడా రేపు మూలపేట లోని సెజ్ పునరావాస కాలనీ కి వెళ్లిపోవచ్చు.(ఇప్పుడు ఆ పిల్ల అక్కడే వుంటుంది) .అప్పుడు విజయలక్ష్మి పేరు 'దడాల ' అవుతుందా ?ఏమో !చెప్పలేము .






మనిషి నామరూపాలు లేకుండా ,ఊరులన్నిటిని మింగేస్తూ బకాసురుడిలా సెజ్ రాక్షసంగా విస్తరిస్తుంది .అది నేడు కాకినాడ సెజ్ .రేపు కోస్టల్ కారిడార్ .దాన్ని మట్టు బెట్టందే మనిషి బ్రతుక్కి విశ్రాంతి లేదు .మనిషి పేరు కి విలువా లేదు.మనిషి చరిత్రకి మనుగడ లేదు .కాకినాడ సెజ్ కి వ్యతిరేకంగా 16 ఊర్ల ప్రజలు గత ఏడు ఏడ్లుగా అవిశ్రాంతంగా పోరాటం చేస్తూనే వున్నారు .రండి. వారికి అండగా నిలబడదాం.ఇవ్వాళా వారి చరిత్ర మాసిపోవచ్చు !రేపు పొద్దున్న మన చరిత్ర మీదా దాడి జరగవచ్చు .మొత్తంగా నిరాశ్రయ మయ్యే మానవ జాతిని ,మన తరాన్ని కాపాడుకుందాం .సెజ్ కి వ్యతిరేకంగా గళం విప్పుదాం.అందరం కలసి పోరాటం చేద్దాం !కడలి అంచున పొంచి ఉన్న సెజ్ ప్రమాదాన్ని ఆది లోనే తుదముట్టిద్దాం .
-నక్క వెంకట్రావు 
       

Wednesday, June 22, 2011

ఆల్టర్ నేట్   హీరో  ఆర్ ఎస్ రావు


అణగారిన వర్గాల కోసం అహర్నిశం పట్టించుకొనేవారు ఒక్కరొక్కరుగా రాలిపోతున్న సందర్భం ఇది.  కన్నాభిరాన్ బాలగోపాల్ బుర్ర రాములు పతిపాటి  వెంకటేశ్వర్లు .. ఇప్పుడు ఆర్ ఎస్ రావు (రేగులగడ్డ సోమేశ్వర రావు )  తెలుగు వాడే కాని ఒరిస్సా  లోని బుర్ల యూనివెర్సిటీ లో ప్రొఫెసర్ గా పని చేసారు.  అయిన ఆంధ్రప్రదేశ్ రాజకీయలను,  ఉద్యమాలను సాహిత్యాన్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు. అతడు రాసిన "అభివృద్ధి వెలుగు నీడలు" ఒక అద్భుత  రచన.  అభివృద్ధి గురించి ఇప్పటికే జరుగుతున్న చర్చకి 1990 లోనే శాస్త్రీయ సమాధానాన్ని వివరించి చెప్పిన ఆర్ ఎస్ రావు ను ఏ ఉద్యమ కార్యకర్త మర్చిపోరు.  ఆర్ ఎస్ రావు అంటే " అభివృద్ధి వెలుగు నీడ"  అనే విధంగా గుర్తిండిపోయారు.  ఆ తర్వాత కూడా అనేక విషయాల మీద ఆయన చేసిన రచనలు మనకు ఒక స్పష్టమైన అవగాహనని కల్పించే విధంగా వుంటాయి. కాబట్టి అతడ్ని గుర్తు చేసుకోవడం  అంటే  అతడి  రచనల్ని మరొక్కసారి మననం చేసుకొని ముందుకు సాగిపోవడమే. 

      మీరు ఆనకట్టలకి, విద్యుత్ కేంద్రాలు కు,  రోడ్ల నిర్మానాలకి వ్యతిరేకమా? అంటే "అభివృద్దికి వ్యతిరేకులు". అభివృద్దికి వ్యతిరేకులంటే ద్రోహులు అనే స్థాయికి వెళ్ళిపోయాయి ,  మనలో కొందరి బుర్రలు. అ బుర్రలు బూజు వదల గోట్టాలి అంటే  " అభివృద్ధి వెలుగు నీడల"  గురించి లోతుగా చర్చించాలసిందే.  అభివృద్ధి గురించి ఆర్ ఎస్ రావు మాటలోనే" ఏ ఉత్పత్తి శక్తుల పెరుగుదల  అయినా దాని వెనుక నిబిడమయి ఉన్న మానవ శ్రమ, విజ్ఞానాల ఫలితం.  అ  విజ్ఞానం ఒకనొక ప్రాపంచిక దృక్పధం కారణంగా జనిస్తుంది అంటే ఏ రూపంలో కన్పించే అభివృద్ధి  పథకం అయిన అంతిమ పరిశీలనలో ఒకానొక ప్రాపంచిక దృక్పథం నుండే పుడుతుంది.  అందుచేత ఆయ అభివృద్ధి పథకాల సారం వాటికి కారణం అయిన ప్రాపంచిక దృక్పథమే అని చెప్పుకోవాలి.  అలాంటప్పుడు ఆనకట్ట నో  ఫాక్టరియో కాలేజినో  అభివృద్దో కాదో తెలుసుకోవాలంటే ఆ అభివృద్ధి  పథకం ప్రాపంచిక దృక్పథం లో ఎమైన మార్పులు తీసుకు వచ్చిందా, లేదా, అప్పటికే బలంగా వున్నా వేరొక ప్రాపంచిక దృక్పథం లో తానే ఒక భాగం అయి పోయిందా అనే అంశాన్ని పరిశీలించాలి. ప్రాపంచిక దృక్పథం అంటే ఏమిటి? నిర్దిష్ట దేశకాల పరిస్థితిలలో మనిషికి, ప్రకృతి కి మధ్య గల సంబందాని లేదా వైరుధ్యం గురించి   తెలియ చెప్పే దృక్పథమే ప్రాపంచిక దృక్పథం. ....

    అభివృద్ధి  అనే భావన  ఏక కాలం లో క్లిష్ట0 అయినది  సులభంగా అర్ధమయ్యేది  కూడా. సులభంగా ఎందుకు అర్థం అవుతుందంటే  దాని బలమైన దర్సనీయత. (visibility ) వల్ల,  క్లిష్టమయినది  ఎందుకు అంటే  దాని వెలుతురిని అర్థం చేసుకోగలిగినంత సులభంగా అది సృస్తించే నీడల్ని అర్ధం చేసుకోలేము కాబట్టి. 


               అయితే అభివృద్ధి సారం  దాని భౌతిక రూపం లో కాక  ఆ  అభివృద్ధి సాధ్యం చేసిన  ప్రాపంచిక  దృక్పథం లోనే ఉందని సులభంగానే అర్ధమవుతుంది.  అందుకే భయంకర దుర్ఘటన జరగక ముందు భోపాల్ యునియాన్ కార్బిదే అభివృద్దికి ప్రతీక,  ఆ సంఘటన తర్వాత ఆ భావం బీటలు వారింది,  

      అభివృద్ధి వెలుగు నీడలు ఒక మంచి వ్యాసం అయితే  దాని ఒక జీవితం ద్వార చెప్ప్ప గలిగిన రచయత కాలిపతనం రామారావు.  అతడి  యజ్ఞం కథ గురించి రాస్తూ గొప్ప్ప విశ్లేషణ చేసారు.

యజ్ఞం కథలో గాంధిజీ ఆశయాలతో ప్ర భావితం అయినా శ్రీ రాములు నాయుడు గ్రామాభివృద్దికి రోడ్లు స్కూలు ఏర్పాటు చేస్తాడు.  రోడ్ల ద్వార  మోటారు వాహనాలు వచ్చి రిక్షాలను మూల పడేశాయి.  వ్యాపార పంటలు వలన సంప్రదాయ రీతులు నష్ట పోయి అప్పులు పాలవుతారు.  ఈ నేపద్యంలో అప్పల రాముడు అప్పు తగువే ఈ కథ.  ఈ తీరని అప్పులు వలన తన లాగే తన కొడుకును బానిస కావడానికి వీలు లేదని తన కొడుకును చంపేసి అప్పల రాముడు పంచాయితి ముందు పడేస్తాడు.  

   గ్రామా జీవితంలో అభివృద్ధి క్రమం ముందు శ్రీ రాములు నాయుడు హీరోగా మొదలు పెడితే కథ అంతానికి అప్పల రాముడు అంటి హీరో నుంచి హీరో అయిపోతాడు. ఇంకా వర్గం రుపొందని కాలంలో అప్పల రాముడు అ వర్గ ప్రతినిధి గానే వర్గ సహకారం లేకుండా ఉండిపోయాడు.  కాని ఆ  తర్వాత కాలానికి వర్గ పోరాటాల ద్వార వర్గం రూపొందటం మొదలయింది. సంఘర్షణ ప్రధానం అయ్యింది.  ఆ మార్పులో నూతన దృక్పథం కనిపిస్తుంది.  ఇది ఎటువంటి అప్పు అనే ప్రశ్న కాకుండా దానికి ఒక సమాధానం ఇస్తుంది.  ఇది ఎటువంటి అభివృద్ధి అని కాకుండా అభివృద్ధి అంటే ఏమిటి అని చెపుతుంది. ఉద్యమం ప్రధానంగా ఉన్న గ్రామాల లోనే కాకుండా మిగిలిన ప్రాంతాలలో కూడా ఈ మార్పు కనిపిస్తుంది.  రూపాలు వికృతం అవ్వచును. అంటే నిజ జీవితం అంటి హీరో నుంచి alternativeహీరో కు మార్పు చెందింది.  ఈ alternative హీరో అట్టడుగు వర్గాల నుంచి అనగార్చ బడ్డ  ఆడవాళ దగ్గర నుండి ముందుకు వస్తున్నారు..  
                               there is no alternative, ఈ అభివృద్ధి తప్ప్ప వేరే దారి లేదు  అని చెబుతూ సామ్రాజ్యవాద  పెట్టుబడి దారి విధానం తన విధ్వంసకర  కారక్రమాన్ని అణిచివేత విధానాలతో అమలు చేయ ప్రయత్నిస్తుంది. ప్రత్యామ్నాయం ఉందంటూ (alternative ) ప్రజలు ప్రతిఘటిస్తూనే ఉన్నారు వారి పక్షాన నిలిచిన ఆర్ ఎస్ రావు ప్రత్యామ్నాయా రాజకీయాలను ప్రతిపాదించి మనందరికీ "కొత్త చూపు" ను అందించారు.    


Friday, December 10, 2010

                                              వాన్ పిక్  ఏరియా లో మహిళలతో  నేను
                                            వాన్ పిక్ లో నేను ,ఉష


                                              వాన్ పిక్ ఆఫీసు
                                            భూ మాత కు సంకెళ్ళు
                                                నేను,ఉష ,వాన్ పిక్ శంకర్ 
                                            శంకర్ ఇంటిలో
                                           వాన్ పిక్ మహిళలు           


                                               కాకినాడ సెజ్ వ్యతిరేఖ పోరాట నాయకులతో బాలగోపాల్

                                              రాజేంద్ర ,బాలగోపాల్ ,మూర్తి ,


                                           బాలగోపాల్  పబ్లిక్ హియరింగ్


                                               కాకినాడ రాములమ్మ
                                              చిరంజీవిని కుమారి -కాకినాడ

Text