Wednesday, May 20, 2015

కాకినాడ సెజ్‌ సెగలు సెజ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న రైతాంగ పోరాటం వర్ధిల్లాలి!

కరపత్రం   march 2008
                          కాకినాడ సెజ్‌ సెగలు
సెజ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న రైతాంగ పోరాటం వర్ధిల్లాలి!
ప్రత్యేక ఆర్ధిక మండలి (సెజ్‌) చట్టాన్ని రద్దు చేయాలి!!

-హేమా వెంకట్రావ్



ప్రజాస్వామ్యవాదులారా! అఖిలపక్ష పార్టీ ప్రతినిధులారా!!
మన దేశంలో ముందు ప్రత్యేక ఆర్ధిక మండలి సెజ్‌లు 19 వుంటే, సెజ్‌చట్టం 2005 వచ్చిన తరువాత 195 నోటిఫైడ్‌ కాగా అధికారికంగా ఆమోదించబడినది 439. సూత్రప్రాయంగా సుమారు 200 సెజ్‌లకు అనుమతి లభించింది. ఇందులో 88 సెజ్‌లతో మహారాష్ట్ర మొదటిస్థానంలో వుండగా 71 సెజ్‌లతో ఆంధ్రప్రదేశ్‌ రెండవ స్థానంలో వుంది. ప్రభుత్వం సెజ్‌లు దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపించేశక్తి అని అభివర్ణించడం జరుగుతుంది. కాని ఇది వాస్తవం కాదు. ఈ సెజ్‌లలో భూములు, మత్స్యసంపద, గ్రామాలు మొత్తంగా ప్రకృతి వనరులన్నీ స్వాహా, రైతులు, రైతుకూలీలు, మత్స్యకారులు, దళితులు, స్త్రీలు తమ జీవనాన్ని గ్రామ సంస్కృతిని కోల్పోతున్నారు.
ఒకప్పుడు భూసంస్కరణల పేరుతో అతికష్టముగా కొంత బంజరు, 2% సేద్యభూమి పేదలకు బదలాయించారు. రోజులు మారాయి. కాకపోతే మలివిడతగా ప్రపంచీకరణ పడగలో పెద్దపెద్ద కంపెనీలకు, పరిశ్రమలకు, ఉపాధి పేరిట భూయజ్ఞం జరుగుతుంది. ఎదురు తిరిగిన ప్రజలకు నందిగామ భీభత్సం స్మృతిలో మెదిలి భయభ్రాంతులను చేస్తూనే వుంది. ఇక మన రాష్ట్రంలో కాకినాడ దగ్గర సెజ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం గురించి నిజానిజాలు మీ ముందుంచుచున్నాము.
తూర్పుగోదావరి జిల్లా 58 మండలాలు కలపుకొని గిరిజన ప్రాంతం, మెట్టప్రాంతం, కోనసీమ, సముద్రతీర ప్రాంతాలుగా విభజింపబడిరది. ఇరిగేషన్‌ పేరుతో ఏలేరు, ముసురిమిల్లి, భూపతిపాలెం, పోలవరం ప్రాజెక్టుల వలన కొన్ని వేల కుటుంబాలు నిర్వాసితులు అయ్యారు. అలాగే మైనింగ్‌ పేరుతో బాక్సైటు, లేటరైటు, నల్లరాయి త్రవ్వకాల వలన సాగునీరు, త్రాగునీరు కరువై ప్రజలు అల్లాడిపోతున్నారు. దేశాభివృద్ధికి కావలసిన ఇంధనాలు వెలికితీత కోసం నదులను, సముద్రాలను, అడవులను రిలయన్స్‌ వంటి సంపన్న వర్గాలకు అప్పగించడం జరుగుతుంది.
కాకినాడ దగ్గర సహజవాయువు నిక్షేపాలు బాగావున్నాయి. కాబట్టి ఒ.ఎన్‌.జి.సి. వారికి శుద్ధి కర్మాగారం (రిఫైనరీ) నెలకొల్పడానికి భూమి కావాలంటూ ప్రభుత్వం చర్చ మొదలుపెట్టింది. ఒక ఒ.ఎన్‌.జి.సి. కాక ఇతర ప్రైవేటు రంగం, పెట్రోలియం కంపెనీలకు కూడా రిఫైనరీల కోసం భూమి కావాలి కాబట్టి ఇక్కడ 12,500 వేల ఎకరాలతో సెజ్‌ను నెలకొల్పుతామన్నారు. తొలుత కాకినాడ రూరల్‌ సామర్లకోట, పీఠాపురం, యు.కొత్తపల్లి మండలాల్లో సెజ్‌ను ప్రతిపాదించగా ఆ భూమిలో వరి పండిరచే నేలలు వున్నాయని రైతులు సంవత్సరంలో సగం రోజులు పైగా పని దొరుకుతుందని వ్యవసాయకూలీ సంఘాలు ప్రతిఘటించారు. వాళ్ళ ఆందోళన కన్నా అది రియల్‌ ఎస్టేట్‌ కళ్ళకు బంగారు భూమి కావడం వలన బిల్డర్లు ఒత్తిడి పెట్టారని, ఆ కారణంగా ప్రభుత్వం తన ప్రణాళికను మార్చుకుందంటారు. ఏమైతేనేం సెజ్‌ యు.కొత్తపల్లి మండలం, తొండంగి మండలంలోని తీరప్రాంత గ్రామాలకు మారింది. మరొక విశేషమేమిటంటే ఒ.ఎన్‌.జి.సి. ఈ దశలోనే తమకు కాకినాడ దగ్గర రిఫైనరీ నెలకొల్పే వుద్దేశ్యం లేదని ప్రకటించింది. తొలి ప్రతిపాదనలో సారవంతమైన భూములు వున్నాయి, కాబట్టి దానిస్థానంలో తీరప్రాంతములోని చవిటి నేలను ఎంపిక చేసామని వివరణ యిచ్చుకున్నా, భూసేకరణ కోసం ప్రతిపాదించినవి సారహీనమైన నేలలు కావు. వందల ఎకరాలు జీడిమామిడి, సరుగుడు, కొబ్బరి, సపోటా, మామిడి తోటలతో పాటు వరిపండే భూమి కూడా వుంది. సరుగుడు నారు ఇక్కడ నుండే రాష్ట్రానికి ఎగుమతి అవుతుంది. అర ఎకరంలో సర్వేనారు పోస్తే లక్షన్నరాదాయం వస్తుంది. సరుగుడు తోట నాలుగేళ్ళు పెంచి కలప అమ్మితే ఎకరానికి లక్షన్నర ఆదాయం తెస్తుంది.
స్వతంత్య్ర భారతదేశంలో బడాబాబులకు భూమిని ధారాదత్తం చేయడానికి ఈ భూసేకరణ కార్యక్రమము ప్రజా ప్రయోజనార్థం కోసం ఏర్పడిన వలస చట్టం 1894 ద్వారా నోటిఫికేషన్‌ జారీచేయబడిరది. అయితే సెజ్‌ల కోసం సారవంతమైన భూములు తీసుకొకూడదనే నిబంధనలకు అనుగుణంగా భూ రికార్డులనే తారుమారు చేసారు. పచ్చని వరిపొలాలను రికార్డుల సాక్షిగా సారహీనమైన భూములుగా మార్చేసారు. రెండు నియోజకవర్గ రాజకీయ ప్రతినిధులు తమ మిగులు భూములను బినామీ భూములను సెజ్‌ కోసం అమ్మటం కోసం ప్రజలను, గ్రామాలను బలిపశువులను చేసారు. ఆ తరువాత ప్రజలను భయపెట్టి మోసగించి భూములను లాక్కొన్నారు. అయితే గమనించవలసినది ఏమిటంటే కాకినాడ సెజ్‌ కోసం ఏ భూసేకరణ జరిగిందో అది సెజ్‌ పేరున కాక కొనుగోలు కె.వి.రావు పేరిట చేస్తూ అతను, అతని వారసులు భూమిపై హక్కులను అనుభవించ వచ్చునని రిజిస్ట్రేషన్‌ పట్టాలో నమోదు చేయబడిరది. భూములు దళితులకు ఇచ్చినా, ఆ భూములను నాయకులు వారి ప్రమేయం లేకుండానే అమ్మేసుకున్నారు. ఒకరి సర్వే నెంబర్లలోని భూమిని వేరొకరి పేరుతో అమ్మేసారు. ఒకరైతు కంటి ఆపరేషన్‌ కోసం హైదరాబాదు వెళ్ళి స్వగ్రామం వస్తే అతని భూమి కె.వి. రావు పరమైంది. అతని కంటిచూపుతోబాటు గుండె కొట్టుకోవడం కూడా మానేసింది. ప్రభుత్వ ధర 50 వేల నుండి లక్షన్నర వరకు వుంటుంది. కె.వి.రావు కాబట్టి 3 లక్షలు ఇస్తున్నాడు. అలా చేయనట్లైతే ప్రభుత్వ ధర ప్రకారం ట్రైజరీలో కట్టేస్తామని రెవెన్యూ సిబ్బంది జనాన్ని బెంబేలెత్తించారు. భూబకాసురుడు కె.వి.రావు ఇదే భూమిని కొన్ని లక్షలకు మారు అమ్ముకోవడానికి పథకం వేస్తున్నారని వినికిడి. దీనికి సెజ్‌ చట్టంలో ఎలాంటి జవాబు దొరకదు.
ఎక్కడా లేని విధంగా రైతుల భూములలో పేదల సరుగుడు, కొబ్బరి, జీడిమామిడి, సపోటా తోటలలో,  రెండు అంతర పంటలు పండిరచుకుంటున్నారు. ఈ పంటల ప్రతిఫలాలు రైతుకు చెందవు. చేసుకున్న పేదలకు దక్కుతాయి. ఇందులో పప్పుధాన్యాలు, దుంపలు, వంటచెరకు, పశువులకు మేత లభిస్తాయి. ఈ పంటలను పండిరచడం వలన రైతుల భూమిని సంరక్షించుకోవడమే కాక సేద్యానికి చేసే పనులు ఉచితంగా రైతుకు చేస్తారు. ఇది ఎన్నో ఏండ్లుగా రైతుకు, పేదలకు మధ్య ఉన్న అవినాభావ సంబంధంగా సెజ్‌ గ్రామాలలో చూడగలం. యాజమాన్యం హక్కు ఉన్న రైతులకు అనేక సేవలు అందించి బ్రతికే చాకలి, మంగలి, కుమ్మరి తదితర చేతివృత్తి కులాలు, ప్రకృతిలోని ఫలసాయం పైన ఆధారపడి బ్రతికే 1000 కుటుంబాలకు పైగా గీత కార్మికులు, 15,000 కుటుంబాలకుపైగా ప్రభుత్వ భూములలో పశువులను మేపే యాదవులను ఈ గ్రామాలలో చూడవచ్చు. ఈ నేలలో ప్రవహించు ఉప్పుటేర్లలో చేపలు, పీతలు, పట్టే మత్స్యకారులు, సముద్రములో అలివి వేసి గుంపుగా చేపలు పట్టేవారువున్నారు. వీరందరికి ప్రభుత్వం దృష్టిలో నష్టం కలుగదు. నష్టపరిహారం ప్రశ్నే తలెత్తదు.
బ్రిటీషువారి పాలనా వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న మన నాయకులు, అధికారులు ఇక్కడ ప్రజలను వర్గాలుగా విడగొట్టారు. కొంతమంది భూమిలేని కూలీలను, దళిత వాడలను కొనేసారు. ఎగుమతులను ప్రోత్సహించడం కోసం సేజ్‌లపై సకలసదుపాయాలు, అనేక రాయితీలు కల్పించే ప్రభుత్వం తమ జి.ఓ. నెం. 284 రెవెన్యూ (రిజిస్ట్రేషన్‌ Ê మండల్‌ డిపార్ట్‌మెంట్‌ తేది : 6`3`2006) ప్రకారం సెజ్‌ భూముల రిజస్ట్రేషన్‌ కోసం ఫీజు మినహాయించి కొన్ని కోట్ల రూపాయలు రాబడిని కోల్పోయింది. పన్ను రాయితీ కేవలం కంపెనీకే కాదు. దాని డైరెక్టర్లకు ఆదాయపు పన్ను చట్టం నుండి మినహాయింపు ఇస్తుంది. ఎగుమతులను ప్రోత్సహించే పేరిట ఈ రాయితీలు ఆర్థిక అరాచకత్వానికి దారితీయగా ఇది అభివృద్ధిపధంలో ప్రభుత్వం మొదటిమెట్టు!?
ఇకపోతే భూమిని, నీటిని, అడవిని, చేతివృత్తులను నమ్ముకున్న జనానికి సెజ్‌లో 30 వేల మందికి ఉద్యోగం ఇస్తామని చెబుతున్న అధికారులు సాంకేతిక పరిజ్ఞానం లేని తక్కువ శాతం చదువుకున్న వారికి ఏవిధమైన ఉద్యోగం ఇస్తారన్నది ఒక ప్రశ్న, అయితే ఇప్పుడు కొనసాగుతున్న పునరావాసం పనులలో స్థానికులకు చోటులేదన్నది సత్యం. చట్టంలో కూడా ఎక్కడా సెజ్‌లో నెలకొల్పబోవు కంపెనీ ఎవరికి ఉద్యోగాలు ఇవ్వాలో నిర్దేశించే అధికారం ప్రభుత్వానికి లేదు. పని గ్యారంటీ లేదు. ఆరోగ్య భద్రతా సదుపాయాలు లేవు. సెక్షను 49 ప్రకారం ఏ చట్టం నుండైనా సెజ్‌లకు మినహాయింపు ఇవ్వవచ్చు. ఇది కార్మిక, పర్యావరణ చట్టాలకు వర్తిస్తుంది. పైగా వ్యవసాయం, చేపలవేటపై ఆధారపడిన సెజ్‌ ప్రాంతవాసులకు ఎలాంటి ప్రత్యామ్నాయ ఉపాధి చూపిస్తారనేది ఇంకా వెలుగులోనికి రాకపోగా అసలు నిజానికి ఏ ఉత్పత్తి జరుగుతుందో ప్రజలకు ఇప్పటికి తెలియదు.
భూ సేకరణకు ఎంపిక చేసిన భూమిని బంగాళాఖాతాన్ని ఆనుకొనియున్నది. సి.ఆర్‌.జెడ్‌.జి.ఒ. ప్రకారం సముద్రతీరం నుండి 2 కిలోమీటర్ల లోపల రిఫైనరీలు, పరిశ్రమలు నెలకొల్పకూడదు. ఉప్పుటేర్లలో వ్యర్థపదార్థాలు చేరడం వలన మత్స్యసంపద నాశనం అవుతుంది. అలాగే సముద్రంలోకి చేరిన కలుషితం జలసంపదను నాశనం చేసి 50 వేల కుటుంబాలను వీధిపాలు చేస్తుంది. ఈ ప్రకృతి వనరుల దోపిడికి కేవలం రెవెన్యూ యంత్రాంగం రాజకీయ అధికారాన్ని మాత్రమే ఉపయోగించకుండా కొంతమంది యువకులను గ్రామాలనుండి దళారులుగా మార్చుకున్నారు. మరికొంతమంది స్థానిక రాజకీయప్రతినిధులను ప్రజలకు వ్యతిరేకంగా కె.వి.రావు గుప్పిట్లో పెట్టుకోవడం జరిగింది. ఇందుకు దడాలవారిపాలెం, మాతావారిపాలెం ఒక ఉదాహరణ.
బలవంతంగాను, మోసపూరితంగాను భూమిని కోల్పోయిన రైతులు తమకు వచ్చిన డబ్బును అప్పులను తీర్చడానికి, కుటుంబ కార్యక్రమాలకు ఖర్చుచేసుకొని వీధిపాలయ్యారు. రైతులు అమ్ముకున్న భూములను ఇంకా కె.వి.రావు అనేకచోట్ల స్వాధీనపర్చుకోలేదు. సెజ్‌లో 25% ఉత్పత్తిలేక ఇతర ఆర్థికసేవలు అందించే సంస్థలు వుంటాయి. మిగిలిన భూభాగంలో సెజ్‌ చట్టం 2వ సెక్షను ప్రకారం పారిశ్రామిక, వ్యాపార, సామాజిక వసతులు ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ పనిని డెవలపర్‌ చేస్తాడు. వసతుల పేరిట ఇది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం. ఇందులో గ్రామస్థులు సమిధులు, ఇకపోతే ఇక్కడ గ్రామాలలో ఉపాధి పథకం క్రింద పనులు లేకపోవడం వలన కుటుంబ భారం పెరగడమే కాక కుటుంబ హింసకు గురౌవుచున్నారు. ఇందుకు అధికారులు చెప్తున్న కారణం ఒక్కటే. ఈ గ్రామాలన్న సెజ్‌ల కాలనీలో ఇళ్ళను కొన్న కె.వి.రావు యింటికి మాత్రమే వెల కట్టి ఇంటి స్థలాలనికి తరువాత డబ్బు ఇస్తానని డబ్బు ఎగ్గొట్టే ఎత్తుగడ వేస్తున్నాడు. సాధారణంగా యింటిని, స్థలాన్ని ఒకేసారి అమ్ముతాము. కాని కె.వి.రావు స్థయిలే వేరు.
ఇక్కడ ప్రజలందరు దృష్టి సారించవలసిన విషయమేమిటంటే మహా ముంబాయి పేరిట రాయిఘడలో ఏర్పాటుచేసిన సెజ్‌లలో స్థానిక రౌడీలు, రిటైర్డ్‌ అవినీతి అధికారులు దళారులుగాను, ఉద్యోగస్థులుగాను నియమించుకున్న చందాన కాకినాడ సెజ్‌కు ఇదే వారసత్వాన్ని ఆపాదించడం జరిగింది. ఇక్కడ అధికార యంత్రాంగానికి సెజ్‌లకు భయపడిన కొంతమంది రైతాంగం తాము అమ్మిన భూములను కె.వి.రావు కోసం పరిరక్షించడానికి పూనుకుంటున్నారు. ఇందులో వారి స్వార్థంకాక కేసులు పెడతారన్న భయం వారిని వెంటాడి ఈ విధంగా చేయిస్తుంది.
పునరావాసం పేరిట మోసం :
పేదలకి ముఖ్యంగా దళితులకు సొంత ఇళ్ళు నిర్మిస్తామని ఆశ చూపించి ఖాళీ చేయిస్తున్నారు. అందరికీ పునరావాసం కల్పిస్తామని భ్రమింప చేసి ప్రజలను, ఉద్యమాన్ని నీరుగారుస్తున్నారు. నిజానికి రాష్ట్రప్రభుత్వం సహాయ పునరావాసన విధానం జి.వో. నెం. 68 నీటి పారుదలశాఖ, తేది : 8`4`2005 ప్రకారం భూములు, ఉపాధి, కోల్పోయేవారి గురించి, తమ వృత్తికి, వ్యాపారానికి దూరమయ్యే వారి గురించి ఆర్థిక సర్వే చేపట్టాలి. ఈ సర్వే 90 రోజుల్లో పూర్తికావాలి. ఈ సర్వే ఫలితాలు సంబంధిత గ్రామ పంచాయితీ కార్యాలయాలలో ప్రదర్శించి అభ్యంతరాలు విని 30 రోజుల లోపల దానికి తుదిరూపం యివ్వాలి. సమీప ప్రాంతములో భూమిని గుర్తించి ‘‘పునరావాస ప్రాంతం’’గా ప్రకటించి పునరావాస పథకాన్ని రూపొందించాలి. ఇందులో ఏ ఒక్కటి కూడా అమలు జరుగలేదు. ఇక్కడ గ్రామసభలు లేవు. వాటి తీర్మానాలు లేవు. ఇక్కడ ఎన్నో ఇళ్లు సగంలో ఆపేసారు. అటు పునరావాస కాలనీలో వుండాలో లేకా స్వంత ఇంటిలో వుండగలరో తెలియని అభద్రత నిరంతరం వాళ్ళను వెంటాడుతూనే వుంటుంది. ఇక వీరు కోల్పోయే పశుసంపదకు వెల కట్టలేము. ఇందుకు పునరావాస కాలనీలో ఎక్కడ ఎలా వాటిని పెంచుకోవాలో అర్థంకాదు. ‘‘మమ్మల్ని కబేళాలకు తరలించడం’’ అన్న స్త్రీల అర్తనాదాలు ప్రతి గ్రామములో వినిపించేవే.
ఉద్యమ పథంలో :
పి. చిరంజీవిని కుమారి స్పందన, గరిమెళ్ళ నారాయణ ప్రజావాహిని అనేక మంది మేధావులు, ఉద్యమ కార్యకర్తలు, సామాజిక ప్రతినిధులు, కడలి సామాజిక ఉద్యమ సంఘంగా ఏర్పడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్యేక ఆర్ధిక మండలిల ప్రవేశాన్ని గుర్తించి ఒ.ఎన్‌.జి.సి. రిఫైనరీల వలన కలుగునష్టాలను గురించి తెలియజెప్పాలని కె. రాజేంద్ర విసివిశ్వం ఆధ్వర్యములో ఒక బృందాన్ని పంపడం జరిగింది. ఈ బృందం సెజ్‌ సంబంధిత ప్రాంతాలలో ప్రజలను చైతన్యపరచడమే కాక వివిధ రాజకీయపక్షాల (బి.జె.పి., బి.ఎన్‌.పి., సి.పి.ఐ.(ఎమ్‌,ఎల్‌.), లిబరేషన్‌, లోక్‌సత్తా) నుంచి సంఫీుభావాన్ని కూడగట్టింది. ప్రజాచైతన్యం భూసేకరణ చట్టం 1894 యిచ్చిన నోటిఫికేషన్‌ ద్వారా ప్రతిపాదించిన ప్రాంతాన్నుండి సెజ్‌ను తరలించింది. దీనికి కారణం ప్రజా చైతన్యంతోబాటు రియల్‌ ఎస్టేట్‌, రాజకీయ లబ్ది వలన యు. కొత్తపల్లి, తొండంగి మండలాలకి మార్చడం జరిగింది.
మొదట స్థానిక ఎమ్‌.ఎల్‌.ఎ.లు ఊహాత్మకంగా ప్రజలతో కలిసినట్టు నటించి తమ భూములను అమ్మినట్టు చేసి ప్రజలను తప్పుద్రోవ పట్టించారు. దీన్ని గుర్తించిన కడలి ఉద్యమసంస్థ వివిధ మానవహక్కుల సంఘాల నాయకులు బాలగోపాల్‌ లాంటి వారితోను, కలిసివచ్చిన రాజకీయపార్టీలతో పనిచేసి నాటి నుంచి భూముల అమ్మకాలను అడ్డుకున్నారు. ఈ క్రమములో ప్రజలు సమాయత్తమై అధికారయంత్రాంగాన్ని ప్రశ్నించడంతోబాటు దళారులను ఎండగట్టారు. సంఘటితమైన ప్రజలు కాకినాడ సెజ్‌ వ్యతిరేక పోరాట కమిటిగా ఏర్పడినారు. ఈ సంఘం మానవహక్కుల కమీషన్‌, లీగల్‌సెల్‌ అథారిటీ ఇతర న్యాయవ్యవస్థల సహాయాన్ని అర్ధించింది. అఖిలపక్షం మద్ధతును కూడగట్టిన సెజ్‌ వ్యతిరేకపోరాట నాయకులపై అణచివేతను ప్రదర్శించి 35 మంది అఖిలపక్ష నాయకులను, రైతులను అరెస్టుచేసి స్వంత పూచీకత్తుపై వదిలివేసింది.
రామన్‌ మెగసేసే అవార్డు గ్రహీత సందీప్‌పాండే గారి చేత ప్రజలకు సమాచారహక్కుచట్టం గురించి అవగాహన కలిగించి రెవెన్యూ యంత్రాంగం నుండి సంబంధిత సమాచారాన్ని రాబట్టుకోవడం జరిగింది. అఖిలపక్షంలో భాగమైన బి.జె.పి. సెజ్‌ 16 గ్రామాలలో బండారు దత్తాత్రేయ గారి నాయకత్వంలో పర్యటించి తమ మద్ధతును తెలియజేసింది. మర్నాడు ఉదయమే ప్రభుత్వ యంత్రాంగం 1500 మంది పోలీసులతో శ్రీరాంపురం గ్రామాన్ని చుట్టుముట్టి నాయకులను అరెస్టు చేసింది. దానికి ప్రతిఘటించిన యువత, మహిళలు గ్రామ రహదారులు మూసివేసి అధికారులను నిర్భందించి వారి నాయకులను విడిపించుకున్నారు.
సమస్య తీవ్రతను గుర్తించి సామాజిక ఉద్యమకార్యకర్త మేధాపాట్కర్‌తో సమావేశాన్ని సుమారు 15,000 మందితో ఏర్పాటు చేయడం జరిగింది. దీని ప్రతినిధులు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌.ఆర్‌.లతో బాటు కేంద్రమంత్రులకు వినతిపత్రాలను ఇచ్చారు. వివిధ కోర్టులలో మానవహక్కుల కమీషన్‌ ముందు కేసు పెండిరగులో వుండగానే తీర్పుకు వ్యతిరేకంగా అధికారులు చట్టాన్ని ఉల్లంఘించి సెజ్‌ అక్రమ ఆక్రమిత ప్రాంతాలలో బలప్రయోగంచేసి భయోత్పాత వాతావరణాన్ని సృష్టించారు. సెజ్‌ ఉద్యోగుల వైఖరిని ప్రశ్నిస్తూ పనుల నిలుపుదలకు ఉద్యమనాయకులు ప్రయత్నించగా వారిని అరెస్టుచేసారు. ఈ సమయములో బి.జె.పి. పక్షనేత జి. కిషన్‌రెడ్డి గారు అరెస్టులకు నిరసనగా సెజ్‌ గ్రామాలలో బహిరంగసభలు జరిపి అరెస్టు అయినవారిని జైలులో పరామర్శించారు. టి.డి.పి. నాయకులు యనమల, బి.జె.పి. జిల్లా నాయకులు, సి.పి.ఐ. (ఎమ్‌.ఎల్‌), లిబరేషన్‌ పార్టీ ఎమ్‌.పి., ఎమ్‌.ఎల్‌.ఎ. (చత్తీస్‌ఘడ్‌, జార్ఖాండ్‌, ఒరిస్సా)లు, సామాజిక ఉద్యమ కార్యకర్త హైకోర్టు న్యాయవాది బొజ్జా తారకం గారు అరెస్టు అయిన నాయకులను జైలులో పరామర్శించారు.
బయటకు వచ్చిన నాయకులు ప్రజలతో కలసి స్వతంత్ర దేశంలో చీకటి రాజ్యం చేస్తున్నదని సెజ్‌ బాధిత ప్రాంతాల్లో నల్లజెండాలు ప్రదర్శించారు. ఊరూరా అభివృద్ధి పేరిట వినాశనంకాక శాంతి సౌభాతృత్వాలు తమ గ్రామాలలో కావాలని తెల్లజెండాలు ఎగురవేశారు.
ఈ పోరాటాన్ని దేశవ్యాప్తంగా ఇతరపోరాటాలతో సంధించాలని జాతీయ ప్రజా ఉద్యమాలవేదికగా ఏర్పాటుచేసిన నందిగాం నుండి గురై వరకు సాగినయాత్రలో మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర మేధావులతోను, ఎన్‌.ఎ.పి.ఎమ్‌., ఎ.పి.వి.వి.యు., క్రైనెట్‌తో కూడా సంఫీుభావాన్ని కూడగట్టారు.
మానవహక్కుల సంఘం ఇచ్చిన తీర్పుననుసరించి సెజ్‌ ప్రాంతములలో జరుగుతున్న అక్రమాలను వెలుగులోనికి తేవడానికి సెజ్‌ ప్రాంతానికి మహిళా న్యాయవాది, సామాజిక ఉద్యమ కార్యకర్త హేమావెంకట్రావు సందర్శించడం జరిగింది. మహిళల భాగస్వామ్యం ఉధ్యమాలలో అవసరమని గుర్తించి ప్రజలతో, స్థానిక నాయకులతో చర్చించి ఆమె నాయకత్వంలో కాకినాడ సెజ్‌ వ్యతిరేక మహిళాసంఘం ఏర్పడిరది. అంతర్జాతీయ మహిళా సంవత్సరాన్ని పురష్కరించుకొని మార్చి 7న ‘‘మహిళా అక్రందన దినం’’గా ప్రకటించారు. ఆ రోజు సభను జరుపుకొని ఉద్యమంలో సగభాగం అవుతామని ప్రతినపూనారు. వేలాదిమంది మహిళలు నాయకురాళ్ళను అగౌరవపరచి గాయపర్చారు. మహిళా న్యాయవాదిపై దౌర్జన్యంగా ప్రవర్తించి గాయపర్చడం జరిగింది. మహిళలపై దాడికి ఆక్రోశించిన మహిళలు తమ జీవితాల్ని మట్టుబెడుతున్న సెజ్‌ ఆక్రమిత ప్రాంతాన్ని చేరుకొని కోర్టు ఉత్తర్వుమేరకు పనులు ఆపుచేయమని సెజ్‌ ఉద్యోగులను శాంతియుతంగా కోరగా మహిళా నాయకురాళ్ళను అగౌరవపరచి గాయపరిచారు. మహిళా న్యాయవాదిపై దౌర్జన్యంగా ప్రవర్తించి గాయపర్చడం జరిగింది. మహిళలపై దాడికి ఆక్రోశించిన మహిళలు తమ జీవితాల్ని మట్టుబెడుతున్న సెజ్‌ పనులను ఆపడంతోబాటు వాటి సంబంధిత కంచెలను, బోర్డులను తొలగించారు. దీనిపై సెజ్‌ ప్రమోటర్‌ కె.వి.రావు యిచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మహిళలపై కేసును నమోదుచేసారు. మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున ఆరెస్టులను నిరశిస్తూ తమ నాయకులపై దౌర్జన్యాన్ని ఖండిస్తూ సెజ్‌ ఉద్యోగులపై కఠినచర్యలు తీసుకోవాలని కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఇదే సమయములో అక్కడకు వచ్చిన ఎమ్‌.ఎల్‌.ఎ.ను  ఘెరావ్‌చేసారు. ఉద్ధేశ్యపూర్వకంగా పోలీసులు ముఖ్యంగా డి.ఎస్‌.పి. సూర్యారావు, న్యాయవాది, మహిళా సంఘం నాయకురాలను దూషించడం జరిగింది. ఆగ్రహించిన మహిళలు ఆమరణ నిరాహారదీక్షకు పిలుపునిచ్చి డి.ఎస్‌.పి. సూర్యారావు క్షమాపణ చెప్పాలని, అతన్ని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేసారు. వెంటనే మహిళలను అరెస్టు చేసారు. ప్రధానంగా ఉద్యమంలో పాల్గొన్న మహిళలు అండగా నిలబడి తమను కూడా అరెస్టు చేయమని స్వచ్ఛంగా పోలీస్‌స్టేషన్‌ చుట్టుముట్టి నాయకులను విడిపించుకున్నారు. ఈ సంఘటనని అన్ని దళితసంఘాలు, స్థానిక సంఘాలు, అఖిలపక్షం, సామాజిక స్పృహ కలిగిన కొంతమంది మీడియా వ్యక్తులు సంఫీుభావాన్ని తెలిపి పోలీసుల మీద ఒత్తిడి తెచ్చి విడుదలకు ప్రముఖపాత్ర వహించారు.
న్యాయ పోరాటం :
కోర్టు ఉత్తర్వులను ఖాతరుచేయక సెజ్‌ సిబ్బంది పోలీస్‌, రెవెన్యూ అధికార బలగంతో రైతులభూములలో పనులు చేపడితే ప్రతిఘటించిన కార్యకర్తలను జైలుపాలుచేసారు. 144వ సెక్షను సెజ్‌ గ్రామాలలో విధించారు. కోర్టు కార్యకర్తలను క్రిమినల్స్‌గా చూడవద్దని బేషరతుగా విడుదల చేయాలని ఆదేశించింది. జైలునుండి విడుదలైన కార్యకర్తల ప్రతికదలికపైన నిఘా వుంది. సామాజిక ఉద్యమ కార్యకర్త మేధాపాట్కర్‌ తమ అభ్యంతరాలను కమీషన్‌ ఎదుట తెలియపర్చడం జరిగింది. కేసును తదుపరి తీర్పువరకు ఎటువంటి చర్యలు సెజ్‌ ప్రాంతాలలో చేయవలదని ఆదేశించి ది. 4`4`2008కు కేసును వాయిదా వేయడం జరిగింది. బొజ్జ తారకం గారు సెజ్‌ గ్రామాలలో సందర్శించి భూ వివరాలను సేకరించి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో న్యాయం కోసమై పోరాడతామని ప్రజలకు హామీ యివ్వడం జరిగింది.
సెజ్‌ ఉద్యోగులు, పోలీసులు మహిళాసంఘ ప్రతినిధి న్యాయవాదిపై అసభ్యంగా ప్రవర్తించి, గాయపరచి మహిళలపై దాడిచేసినందుకు. స్పందించిన సెజ్‌ వ్యతిరేక మహిళాసంఘం, సెజ్‌ వ్యతిరేక పోరాట కమిటి మరియు న్యాయవాది, సెజ్‌ ప్రమోటరు, ఉద్యోగిపైన, పోలీస్‌ సిబ్బందిపైన కేసును ఫైలు చేసారు. రాష్ట్ర, కేంద్ర మానవహక్కుల కమీషన్‌కు తమ నివేదికను బాధితులు సమర్పించారు. అఖిలపక్ష కమిటీ ఎస్‌.పి.కు, కలెక్టరుకు అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని వినతిపత్రం సమర్పించడం జరిగింది. సెజ్‌ బాధితులు సోనియాగాంధీకి వినతిపత్రం సమర్పించడానికి వెళ్ళుచున్నవారిని ఆపి 144 సెక్షన్‌ వాతావరణాన్ని సృష్టించారు.
నేటి పరిస్థితి :
మమ్ములను, మా నాయకులను అరెస్టు చేస్తామని కె.వి.రావు ప్రోద్బలముతో పోలీసు యంత్రాంగం ఊరూరా పహారా కాస్తున్నారు. మా గ్రామాలపై ఏ క్షణమైన దాడులు జరగొచ్చు. నిర్భంధం పెరగొచ్చు, అనేక ఎత్తుగడలు వేసి నిర్భందించవచ్చు. అనేక బయటశక్తులు ఉద్యమాన్ని నీరుగార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కాని ఈ పోరాట సెగలు పల్లె నుండి ఢల్లీి వరకు విస్తరిస్తున్నదని హెచ్చరిస్తున్నాం. ఏది ఏమైనా మాకు కులం, మతం, స్త్రీలు, పురుషులు, వృద్దులు, పిల్లలు అనే బేధాలు లేవు. మేమంతా సెజ్‌ బాధితులం. ఒకే వర్గం. భావితరాన్ని బానిసత్వానికి నెట్టే సెజ్‌ మాకు వద్దు. మా ప్రాణాలిచ్చైనా మా పచ్చటి పొలాల్ని, ప్రకృతి వనరులను, మా సంస్కృతిని కాపాడుకుంటాము. మా నాయకులను రక్షించుకుంటాము.
మా ఆక్రందన వినండి, మా ఆక్రోషాన్ని అర్థం చేసుకోండి. మా ప్రతిఘటనకు మీ వంతు మద్దతునివ్వండి. మీ సహకారం మాకు స్పూర్తి.
మా డిమాండ్లు :
` మోసపూరితంగాను, బలవంతంగాను తీసుకున్న భూములను ఆక్రమించనివ్వం. ఎట్టి పరిస్థితులలోను
ఒక సెంటు భూమి కూడా వదలుకోము.
` అక్రమంగా తీసుకున్న దళిత అసైన్డ్‌, ప్రభుత్వ, అటవీ భూములను బినామీ పేర్లతో బదలాయింపుచేసిన
వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలి.
` రైతు కూలీల, దళితలు, మత్య్సకారుల, మహిళ ప్రకృతిపై హక్కును అభివృద్ధి పేరుతో కాలరాయొద్దు.
` జలసంపదను, పర్యావరణాన్ని గ్రామ సంస్కృతిని సెజ్‌ల బారి నుండి రక్షించాలి.
` మా నాయకులైన బావిశెట్టి నారాయణస్వామి, చింతా సూర్యనారాయణమూర్తి, పిర్ల గంగాధరం,
పేకేటి యజమాని, కడలి సామాజిక ఉద్యమ కార్యకర్త కె. రాజేంద్ర, హేమావెంకట్రావు అఖిలపక్షల
సభ్యులు విప్లవకుమార్‌ మొ॥వారిపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి.
` 2008 మార్చి 7 సెజ్‌ మహిళా అక్రందన దినం సందర్భముగా మహిళపై దాడిచేసిన సెజ్‌ ఉద్యోగి
ప్రభాకర్‌, కె.వి.రావు మొ॥వారిని శిక్షించాలి.
` డి.ఎస్‌.పి. సూర్యారావు, మా నాయకురాలు, న్యాయవాది ఎన్‌. హేమావెంకట్రావు పైన చేసిన
దౌర్జన్యానికి క్షమాపణ చెప్పాలి. వారిని అరెస్టు చేయాలి.
` కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తు అధికారులను ‘‘కోర్టు ఉల్లంఘన’’ నేరం క్రింద శిక్షించాలి.
` తీరప్రాంతాల్లో సి.ఆర్‌.జెడ్‌. (తీరప్రాంత క్రమబద్దీకరణ ప్రభుత్వ ఉత్తర్వులు) విధానాన్ని పాటించి
పరిశ్రమలను నిషేదించాలి.
` సెజ్‌ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి.
పోరాట అభినందనలతో....
కాకినాడ సెజ్‌ వ్యతిరేక మహిళా సంఘం,
సెజ్‌ వ్యతిరేక పోరాట కమిటీ, సెజ్‌ వ్యతిరేక యువసేన
కడలి సామాజిక ఉద్యమ సంఘం

No comments:

Post a Comment

Text